ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను పోడిగించింది. కర్ఫ్యూను ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ వెవ్,కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులో నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,088 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిగా 1,535 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,075 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

































