రేపు అనగా ఆగస్టు 22 న రాఖీ పౌర్ణమి. ఇది అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ఎంతో ఇష్టమైన పండుగ. రక్షా బంధన్, రాఖీ, ఇలా ఏ పేరుతో పిలిచినా.. అందులో ఉండే పవర్ మాత్రం ఒకటే. తమ సోదరులు క్షేమంగా ఉండాలని అని కోరుకుంటూ.. సోదరీమణులు వారికి ఈ రాఖీని కడుతారు. అందుకు ఫలితంగా సోదరులు వారికి తమకు తోచన బహుమానాన్ని అందజేస్తారు.

ఈ సాంప్రదాయం కొన్ని వందల సంవత్సరాలుగా మన భారతదేశంలో కొనసాగుతూ వస్తోంది. ఈ రాఖీ పండగకు మరొకరోజు మాత్రమే ఉండగా.. ఇప్పటికే వీధుల్లో రాఖీ షాపింగ్లతో కోలాహలం మొదలైంది. అయితే సాధారణంగా రాఖీ పండుగకు సోదరులు.. తమ అక్క లేదా చెల్లల్లకు కానుకలు ఇస్తారు. ఇది మొదటి నుంచి వస్తున్నా ఆచారం.
కానీ, కొణిదెల నట వారసురాలు నిహారికా ఈసారి తన అన్న వరుణ్ తేజ్కు రాఖీ పండుగ కానుకను డిఫరెంట్ గా అందించింది. అది మరేంటో కాదు.. ‘బ్రో’ సినిమాలోని ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ అనే లిరికల్ సాంగ్ వరుణ్ తేజ్కి డెడికేట్ చేస్తున్నట్లు తెలిపింది నిహారిక. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలను తెలియజేసే విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీత పాడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 2020 సంవత్సరం డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డని నిహారిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వైవాహిక జీవితంతో బిజీగా ఉన్న నిహారిక.. మరో వైపు తన ప్రొడక్షన్లో వెబ్ సిరీస్ని నిర్మిస్తోంది.
































