Movie Tickets: ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి పరోక్ష యుద్దం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ టికెట్ రేట్ల తగ్గింపు అంశంపై వెనక్కి తగ్గకపోవడంతో టాలీవుడ్ ప్రముఖుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అయితే ఎవరూ బయటపడటం లేదు. పవన్ కళ్యాన్, నాని, సిద్ధార్ధ్, నితిన్ , కార్తికేయ వంటి కొంతమంది మాత్రం స్పందిస్తున్నారు. మిగతా హీరోలు ఈ అంశం మనది కాదన్న రీతిలో ఉన్నారు.
పవన్ కళ్యాన్ టికెట్ ధరల విషయంలో స్పందించినప్పుడు ఒక్క హీరో కూడా మద్దతు నిలవలేదు.. అప్పుడే సినీ పరిశ్రమ మద్దతు ఇస్తే ఇంత దూరం వచ్చేది కాదని చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కొన్న పెద్ద ఫ్యామిలీలుగా చెబుతున్న వారు కూడా టికెట్ తగ్గింపు విషయంపై స్పందించడం లేదు. వారి రెమ్యునరేషన్ లో నిర్మాతలు కోత విధిస్తామంటే.. ఏమైనా ముందుకు వస్తారో చూడాలి. ముఖ్యంగా బాలక్రిష్ణ ఈ అంశంపై దూరంగా ఉంటున్నారు.
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలక్రిష్ణ మరింతగా ప్రభుత్వంపై ఫైట్ చేయాల్సి ఉన్నా అసలు ఏం స్పందించడం లేదని వాదన వస్తోంది. మరో వైపు పాన్ ఇండియా మూవీల కోసం ఎగబడుతున్న కుర్ర హీరోలు తమ సంపాదన.. తన ఇమేజ్ గురించి పట్టించుకుంటున్నారు తప్పితే.. పరిశ్రమ మంచి కోసం పాటు పడటం లేదు. మరోవైపు ’మా‘ అధ్యక్ష ఎన్నికల సమయంలో భారీ డైలాగులు చెప్పిన మంచు విష్ణు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. మోహన్ బాబుకు సీఎం జగన్ తో చుట్టరికం కూడా ఉంది. అయినా కూడా మోహన్ బాబు టికెట్ల ధరల విషయంపై కనీసం సీఎంతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కేవలం పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల సొంత సమస్యగా భావిస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాన్ టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాట్లాడితే.. ఏపీ మంత్రులు పవన్ కళ్యాన్ పై విమర్శల దాడి చేశారు. ఆసయంలో టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ కూడా సపోర్ట్ గా నిలబడలేదు. తాజాగా శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని ఏపీ సర్కార్ ను విమర్శించారు. సినిమా థియేటర్ల కలెక్షన్… కిరాణా దుకాణాల కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యాఖ్యలు చేశాడో.. తెల్లవారి నుంచి ఏపీలోని థియేటర్ల మీద పెద్ద ఎత్తున రైడ్లు ప్రారంభం అయ్యాయి. ఇది చూస్తే సినిమా ఇండస్ట్రీ పై సర్కార్ ప్రతీకారానికి పాల్పడుతుందా.. అనే అనుమానం కలుగుతోంది.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.