వెనుకబడిన తరగతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లుకు మద్దతుగా 385 మంది ఎంపీలు ఓటేశారు. రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.

ఇక రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాను సేకరించి, నిర్వహించే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. ఓబీసీ, సామాజికంగా, వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం సైతం రాష్ట్రాలకు దక్కనుంది.


































