Pandanti Kaapuram Movie : సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో తన 60వ సినిమాగా వచ్చిన మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి అది సాధించిన విజయం గురించి అందరికి తెలిసిందే. అయితే మోసగాళ్లకు మోసగాడు సినిమాకి మహిళా ప్రేక్షకులు అంతగా రాలేదని వారిని ఆకట్టుకోవడానికి ఒక కుటుంబ కథా చిత్రం తీయాలని తమ్ముళ్ళతో సంప్రదించి బాలీవుడ్ లో రాకేష్ ఖన్నా హీరోగా వచ్చిన దో రాస్తే సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించ్చారట. కానీ అది ఫలించలేదు, తరువాత కొన్ని సినిమాలు తీసిన తరువాత నటుడు ప్రభాకర్ రెడ్డి గారు దో రాస్తే, ఇంగ్లీష్ మూవీ ది విజిట్ సినిమాలు కలిపి కథా తయారు చేయగా సూపర్ స్టార్ కృష్ణ ఒప్పుకోవడంతో పండంటి కాపురం సినిమా మొదలు అయ్యింది.

పండంటి కాపురం సినిమాకు పోటీగా భానుమతి మరో ప్రయత్నం……..
సినిమా కథ గురించి పాత్రలు గురించి చర్చిస్తుండగా కృష్ణ తమ్ముడు హనుమంతరావు సినిమాకు పండంటి కాపురం టైటిల్ చెప్పగా అందరికి నచ్చడంతో దానిని పెట్టారు. అయితే సినిమాలు నలిగి అన్నదమ్ములుగా ఎస్వి రంగారావు గారు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ లుగా అనుకోగా, సినిమాలో రాణి మాలిని దేవి పాత్ర కోసం భానుమతి గారిని సంప్రదించారట. భానుమతికి కూడా కథా నచ్చడం, ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తవ్వగానే పండంటి కాపురం సినిమాకు డేట్లు ఇస్తానని చెప్పడంతో అందరి డేట్లు తీసుకున్నాక ఇపుడు ఆమె కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందని భావించి ఆ పాత్రకు జమున గారిని తీసుకున్నారట.

అయితే దీనికి కోపం తెచ్చుకున్న భానుమతి గారు ఇంగ్లీష్ సినిమా ది విజిట్ అదారంగా ఈ సినిమా తీయబోతున్నారు కాబట్టి ఆ సినిమాని నేను తిస్తె బాగుంటుంది అన్న ఆలోచనతో గుమ్మడి గారిని సంప్రదించిందట. అయితే గుమ్మడి గారు పండంటి కాపురం సినిమా చేస్తుందటంతో అక్కడ ఈ విషయం చెప్పగా అప్పటికే భానుమతి కి ఎస్వి రంగారావు గారికి పడకపోవడతో అలా ఎలా చేస్తారు అని ఆవేశం చెందారు. అయితే ఈ సినిమాని కృష్ణ గారు అందరికి సహకారంతో ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి సహకారంతో అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసి విడుదల చేయడం అది ఘన విజయం సాదించడం జరిగింది.


































