మేఘాలయ రాష్ట్రం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(హెచ్ఎన్ఎల్సీ) మాజీ నేత చెరిష్స్టార్ఫీల్డ్ థాంగ్కీని ఎన్కౌంటర్తో ఆ రాష్ట్రాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చెరిష్ మద్దతుదారులు హింసత్మాక దాడులు పాల్పడుతున్నారు. ఆదివారం ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై పెట్రోల్ బాంబులు విసిరారు.

రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటలనకు బాధ్యతగా మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు.ఓ కేసు విచారణలో భాగంగా ఆగస్టు 13 పోలీసులు థాంగ్కీని ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో థాంగ్కీ కత్తితో దాడి చేశాడని దీంతో తాము ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
































