గత కొన్ని నెలల నుంచి బంగారం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరుగుతున్న ధరలకు సామాన్యుడు డీలా పడుతున్నాడు. వీటిపై ఎన్ని రాస్తారోకోలు, ధర్నాలు చేసినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. అయితే ప్రస్తుతం వాటి ధరలు దాదాపు తగివస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా పెట్రోలో ధరల్లో చిన్నపాటి మార్పులు కనపడుతున్నాయి.

బంగారం, వంట గ్యాస్ ధరల్లో స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు రోజుల నుంచి పెరగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి.
తాజాగా ధరల వివరాలు చూస్తే.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.26గా ఉంది. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. నిన్నటి పోల్చితే ఆ ధరలో 0.25 పైసలు తేడా కనిపించింది. అయితే మెట్రో నగరంలో కాకుడా జిల్లాల్లో వాటి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.13గా ఉంది. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.56 గా ఉంది.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ లీటర్ పెట్రోల్ ధర.. హైదరాబాద్ లో ఉన్న ధరల కంటే రూ. 5 తక్కువగా ఉంది. అంటే అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో వీటి ధరలు తగ్గాయనే చెప్పవచ్చు.





























