భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు కరోనా వ్యాక్సిన్ గురించి ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కరోనా వ్యాక్సిన్లు విడుదలైనా ఆ వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను సాధించలేకపోయాయి. అయితే ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ తాజాగా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి అదిరిపోయే శుభవార్తను చెప్పింది. నిన్న కరోనా వ్యాక్సిన్ కు సంబంధిన తుది దశ ఫలితాలను ఫైజర్ ప్రకటించింది.

ఫైజర్ సంస్థ తుది దశ ప్రయోగాల్లో 95 శాతం కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా పని చేస్తున్నట్టు వెల్లడించింది. కరోనా నిర్ధారణ అయిన 170 మందికి ఫైజర్ సంస్థ వ్యాక్సిన్ ను ఇచ్చి వాళ్లలో నాలుగు వారాల తరువాత 95 శాతం ఆశాజనకమైన ఫలితాలు వచ్చినట్టు గుర్తించామని ఫైజర్ సంస్థ వెల్లడించింది. త్వరలో ఈ వ్యాక్సిన్ ఆమోదం పొంది మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఫైజర్ సంస్థ ఇప్పటికే అనుమతులకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేసింది.
కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నా భారతదేశంలోని ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని సమాచారం. -70 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ ను నిల్వ చేయాల్సి ఉండగా మన దేశంలో వ్యాక్సిన్ ను ఆ ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
అన్ని వయస్సుల వారిపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసిందని.. వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని సమాచారం. మన దేశంతో పాటు చాలా దేశాల దగ్గర కూడా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు లేవు.





























