Vidadala Rajini : ఇప్పటి పాలిటిక్స్.. నిన్న ఒక పార్టీ ని తెగ విమర్శించి ఈరోజు అదే పార్టీ లోకి జంప్ అయ్యి నిన్న తిట్టిన నాయకుడినే నేడు పొగడడం చూస్తూనే ఉన్నాం. ఈ జంపింగులు పాలిటిక్స్ లో కామన్ అయిపోయాయి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా అని పార్టీలను చుట్టేస్తూ అధికారం ఏ పార్టీది అయితే ఆ పార్టీలోకి వాలిపోతున్నారు. ఇంతకు ముందు రాజకీయాల్లో సిద్ధాంతాల ప్రకారం ఏ పార్టీ మనకు నచ్చుతుందో అందులోకి వెళ్ళేవారు. రాజకీయ జీవితమంతా ఒకే పార్టీలో ఉండేవారు. అయితే ప్రస్తుతం అలా రాజకీయ వ్యవస్థ లేదు. అనుకూలతను బట్టి పార్టీ మారిపోతు ఉంటారు.

వైసీపీ నుండి టీడీపీ లోకి జింప్ అవ్వబోతున్న విడదల రజనీ…
మొదటి సారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయిన చిలకులూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆమె పార్టీ మారుతోంది టీడీపీ కి జంప్ అవ్వబోతోంది అనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పూల గుచ్చన్ని ఇస్తూ ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఈవిషయాన్ని అనలిస్ట్ శ్రీనివాసరావుగారు విశ్లేషించారు. అయితే విడదల రజనీ బాలకృష్ణ తో ఉన్న ఫోటో మార్ఫింగ్ అని విజయ సాయి రెడ్డి తో ఉన్న ఫోటో ను అలా మార్ఫింగ్ చేసారని టీడీపీ వాళ్ళు ఇలానే గోరంట్ల మాధవ్ ఫోటో కూడా చేశారంటూ కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు.

ఇక వీటిపై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆమె మొదట టీడీపీ ఆ తరువాత మునుపటి ఎలక్షన్ టైములో వైసీపీ లోకి చేరి ఎమ్మెల్యే అయింది. మంత్రి గా ఉన్న తాను పార్టీ మారాల్సిన అవసరం లేదు. అయితే ఇది మార్ఫింగ్ ఒకవేళ చేసినా అది టీడీపీ వాళ్ళే చేసుంటారు అనడానికి లేదు, వైసీపీ లో ఆమె అంటే గిట్టని వాళ్ళు కుడా చేసిండొచ్చు చెప్పలేం కదా. ఆమెకు తొలిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆమె పై అక్కసు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి వాస్తవాలు తెలియాలి, తెలియకుండా టీడీపీ పై బురద జల్లడం కరెక్ట్ కాదు అంటూ చెప్పారు.

































