పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి సినీ పరిశ్రమకు సంబంధించి విషయాలను మాత్రమే పట్టించుకుంటూ.. తన రాజకీయ విషయాలను పక్కకు పెట్టేశారు. కానీ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. నా కారణంగా ఏపీలో సినీ ఇండస్ట్రీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే విధంగా పవన్ వ్యాఖ్యానించారు. తన సినిమాలు ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని చెబుతూ.. తన పేరు చెప్పి ఇండస్ట్రీని చావగొడుతున్నారని ఆక్రోశించారు.

సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై మండిపడ్డారు. చిరంజీవి అంటే సోదర భావన అని ఆ సన్నాసి అంటారు. సోదిలో సోదర భావన.. చిత్ర పరిశ్రమకు ఉపయోగపడని ఆ సోదర భావన ఎందుకంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్యపైనా నీచంగా మాట్లాడారు… భారత ప్రధాన న్యాయమూర్తిపైనే దాడులు చేశారు.
వీళ్లకు సినిమా పరిశ్రమ ఒక లెక్కా.. వారి లక్ష కోట్ల ముందు రెండువేల కోట్ల విలువైన పరిశ్రమ ఎంత.. అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. సినిమా టికెట్ల ద్వారా ఆడబ్బులను బ్యాంకులకు చూపించి కొత్త అప్పులు తెచ్చుకోవాలనే ఆరాటంలో ఉన్నారన్నారు.
లోన్ల కోసమే సినిమా పరిశ్రమ డబ్బులు వాడుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
































