Producer Chittibabu : నాగచైతన్య తో విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అందరూ భావించినా అలా ఏ మాత్రం లేకుండా కెరీర్ లో మరింత దూసుకుపోతూ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్న సమంత సడెన్ గా ఆటో ఇమ్మ్యూన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటోంది. సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు అందులో చాలా ఎమోషనల్ గా తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడంతో అప్పట్లో అది బాగా వైరల్ అయింది. అయితే మరోసారి సమంత మళ్ళీ కన్నీరు పెట్టుకుంది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతున్న సమయంలో సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం గురించి నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

అంత బిల్డప్ అవసరమా…
చిట్టిబాబు మాట్లాడుతూ సమంత శాకుంతలం సినిమా కోసం కస్టపడినందుకు అలానే తాను ఆ సినిమాలో నటించిన కొన్ని సీన్స్ తలచుకుని ఏడ్చడం చాలా విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ చేసారు. అనుష్క జేజమ్మ లాంటి పాత్రలో నటించింది. అలానే రుద్రమదేవి, బాహుబలిలో దేవసేనగా నటించినపుడు కూడా ఇలా ఇంత ఎమోషనల్ అవ్వలేదు.

అది వాళ్ళ ప్రొఫెషన్, చేయాలి అంతేకాని తానే ఏదో చేస్తున్నట్లు బిల్డప్ ఎందుకు అంటూ మాట్లాడారు. సమంత కు వచ్చిన జబ్బు కూడా ఏదో ప్రణాంతక వ్యాధేమి కాదు. తాను నేను బ్రతుకుతానో చనిపోతానో అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ మాట్లాడారు. తనకు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ చాలా తప్పు నిర్ణయాలు అవన్నీ అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.































