Producer Chittibabu : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు కృష్ణ గారి ఆస్తులు ఆయన పంచారా లేదా, ఎవరికి ఏమి ఇచ్చారు అనే విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ చిట్టి బాబు గారు.

కృష్ణ గారి కుటుంబ విషయాలు సోషల్ మీడియాకు ఎందుకు…
కృష్ణ గారి ఆస్తులు మహేష్, నరేష్ లలో ఎవరికి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడుతూ చిట్టి బాబు గారు ఫైర్ అయ్యారు. అసలు నరేష్ కి కృష్ణ గారి ఆస్తుల అవసరం లేదు, ఆయనకు కృష్ణ గారి ఆస్తులతో సంబంధం లేదు. ఎందుకు ఇలాంటి వెధవ చర్చలను చేస్తున్నారు పనిలేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. నరేష్ కృష్ణ గారి కొడుకు కాదు అలాంటప్పుడు ఆస్తిలో వాటా అంటూ చర్చ ఏమిటి. అయిన బ్రతికి ఉండగానే విజయనిర్మల గారు ఆస్తి పంచారు నరేష్ కి అలాగే మనవడికి, ఇంకా ఆస్తి గోల ఎందుకు.

ఇక కృష్ణ గారు బ్రతికున్నపుడే ఆస్తులను అందరికీ సమానంగా పంచేసారు. వాళ్ళింట్లో అసలు అలాంటి గొడవలు వచ్చే ఆస్కారం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నరేష్ కు కృష్ణ గారి ఆస్తులు అనే చర్చ అనవసరం. విజయనిర్మల గారు విజయకృష్ణ బ్యానర్ పై ఎన్నో సినిమాలను తీయడానికి కృష్ణ గారు కారణం కాబట్టి ఆయన పిల్లలకు ఆమె ఆస్థిలో కొంతమంది రాసిచ్చింది. మహేష్ కు కొంత ఆస్తి విజయనిర్మల గారి నుండి వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చారు.

































