Producer Chittibabu : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపక్షం తెలుగు దేశమైనా అధికారపక్షం విమర్శలు మాత్రం జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీదే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంతవరకు విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం లేదు సొంతంగా ఆలోచించలేడు అంటూ విమారుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. ఇక రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స వంటి వారి నోటికి అదుపు లేకుండా ఉంది. ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో పాల్గొనడం గురించి వైసీపీ పార్టీ నేత మంత్రి రోజా మెగా ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్ మీద ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మాట్లాడారు.

రోజా నీ గతం గుర్తు చేసుకో…
మెగా ఫ్యామిలీ ఎవరికి సహాయం చేసారో ఎవరికీ తెలియదు అంటూ రోజా చేసిన విమర్శలకు ప్రొడ్యూసర్ చిట్టిబాబు మాట్లాడుతూ నీ గతం గుర్తు చేసుకుని మాట్లాడు అంటూ విమర్శించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎవరికీ సహాయం చేయలేదు అని మాట్లాడేముందు నువ్వేం సహాయం చెస్తున్నావు, ఒక రాష్ట్ర మంత్రి గా ఎటువంటి పనులు చేస్తున్నావో చెప్పు అంటూ ఫైర్ అయ్యారు. వాళ్ళు ఏం చేసారో ప్రజలు చూస్తున్నారు వారికి అన్నీ తెలుసు, ముందు నీ నోటి దురుసు తగ్గించుకో, లేకపోతే ఈ సారి ఎన్నికలలో నువ్వు గెలవలేవు అంటూ మాట్లాడారు.

జగన్ దగ్గర మెప్పు కోసం మెగా ఫ్యామిలీని తిట్టడం చేస్తున్నారు కొంతమంది ఏపీ మంత్రులు, మీ ప్రభుత్వం పని అయిపోయింది సర్వత్ర వ్యతిరేకత మొదలవడంతో ఏం చేయాలో తెలియక ప్రతిపక్షాల మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు అంటూ మాట్లాడారు చిట్టిబాబు. డబ్బులిస్తున్నారని జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి ప్రోగ్రామ్స్ చేసావు ఒకసారి గతం గుర్తు చేసుకో అంటూ మాట్లాడారు చిట్టిబాబు.
































