కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం అందరినీ తీవ్ర విషాదంలోకి తోసేసింది. ఈ క్రమంలోనే ఆయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు సినీ నటులు ఒక్కసారిగా షాక్ కి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ గుండెపోటు రావడంతో మృతి చెందిన పునీత్ భౌతికకాయాన్ని ప్రస్తుతం కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.

ఈ క్రమంలోనే ఆయన పార్థివదేహాన్ని ఆఖరి చూపు చూడటం కోసం ఎంతో మంది అభిమానులు సినీ ప్రముఖులు అక్కడికి తరలి వస్తున్నారు. ఇదిలా ఉండగా పునీత్ భార్య అశ్విని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి జర్మనీలో ఉన్నత చదువులు చదువుతోంది. ఈ క్రమంలోనే జర్మనీలో ఉన్న తనకు తన తండ్రి మరణ వార్త తెలియగానే ఒక్కసారిగా కన్నీరుమున్నీరవుతున్న ఇండియాకు బయలుదేరారు.
ప్రస్తుతం పునీత్ దేహాన్ని ప్రేక్షకుల సందర్శనార్థం ఉంచారు. అయితే ఆయన అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ అనే విషయం గురించి అధికారికంగా తెలియజేయలేదు.ఈయన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని పలువురు భావిస్తున్నప్పటికీ ఆయన పెద్ద కుమార్తె వచ్చిన తర్వాతనే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.
కన్నడ సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ బాలనటుడిగా 13 సినిమాలలో నటించి ఉత్తమ బాలనటుడుగా నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా అప్పు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.































