Allu Arjun: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయ్యే అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి.

ఇక ఈ సినిమా నిర్మాణంలో భాగంగా మేకర్స్ భారీ విజువల్ ఎఫెక్ట్ ఉపయోగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ చేంజింగ్ సన్నివేశం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సన్నివేశంలో అల్లుఅర్జున్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే. అయితే ఈ సన్నివేశం కోసం ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.

ఈ సన్నివేశంలో లారీ లేకుండానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సన్నివేశానికి ఓ ట్రాలీపై లారీ ముందు భాగం డోర్ వరకు సెట్ ను నిర్మించారు. ఆ తర్వాత కావాల్సిన సన్నివేశాన్ని చిత్రీకరించి. మిగిలినది మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తూ ఎక్కడ తేడా కొట్టకుండా ఎంతో అద్భుతంగా గ్రాఫిక్ వర్క్ పూర్తి చేసారు.
పుష్ప 2 పెరిగిన అంచనాలు
ఈ సన్నివేశంతో పాటు పుష్పరాజ్ నదిలో ఎర్రచందనం దుంగలను పడేసే సన్నివేశం కూడా విజువల్ ఎఫెక్ట్స్ తో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.మొత్తానికి ఈ సినిమాలు భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎంతో అద్భుతంగా జరిగి సినిమా మొత్తం ఎంతో నేచురల్ గా చిత్రీకరించారని చెప్పాలి. పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకుంటుందని తెలుస్తోంది.
































