Rajamouli: ప్రముఖ సినీ రచయితగా విజయేంద్రప్రసాద్ అందరికీ సుపరిచితమే. సినీ రచయితగా మాత్రమే కాకుండా రాజమౌళి తండ్రిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలన్నింటికీ కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు. బాహుబలి 1,2 నుంచి నేడు విడుదలైన RRR వరకు ఈయన అద్భుతమైన కథను అందించారు.

ఈ విధంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన సినిమా కథలలోఒక సినిమా కథ విషయంలో రాజమౌళి చాలా హర్ట్ అయ్యారు అని ఆ రోజు తన తండ్రి చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారు అని వెల్లడించారు. ఏం జరిగింది అనే విషయానికి వస్తే… విజయేంద్రప్రసాద్ రచించిన భజరంగీ భాయ్ జాన్ కథ సల్మాన్కు చెప్పాననగానే రాజమౌళి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని వెంటనే కన్నీళ్లు పెట్టుకున్నారు అని తెలిపారు.

ఆ విధంగా రాజమౌళి కళ్ళలో నీళ్ళు చూసి కథ మన దగ్గరే ఉంది చెయ్యనా అని చెప్పగా రాజమౌళి వద్దు వారికి ఇచ్చేయమని చెప్పారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఒకరోజు రాజమౌళి తన వద్దకు వచ్చాడు.ఆ సమయంలో బాహుబలి సినిమా 2 వేల మంది ఆర్టిస్టులతో మంచి ఎండలో ఒక ఫైట్ సన్నివేశం జరుగుతుంది.
నేనే తీసే వాడిని…
అలా బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో మంచి కాక మీద ఉన్నప్పుడు రాజమౌళి తన వద్దకు వచ్చి 15 రోజుల ముందు లేదా తర్వాత అడిగి ఉంటే ఈ కథ నేను తీసేవాడిని కదా అన్నారని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ తనకు రాజమౌళికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.


























