ఈ ఏడాది జనవరిలో మా డైరీ ఆవిష్కరణ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు… రాజశేఖర్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు చిరంజీవి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవి మాట్లాడే సమయంలో పలుమార్లు అడ్డుపడ్డారు రాజశేఖర్. ఒకానొక సమయంలో మైక్ లాక్కునేందుకు ప్రయత్నించిన రాజశేఖర్ పై చిరు అసహనానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై అదే సభలో చిరు రాజశేఖర్ పై ఘాటు వ్యాఖలే చేసారు. ఆ సభకు హాజరైన మిగిలిన అతిధులు కూడా ఈ విషయంపై రాజశేఖర్ ను తప్పుపట్టారు.

రాజశేఖర్ పై క్రమశిక్షణ కమిటీ కూడా వేశారు. అదేరోజు కోపంతో తన ఎగ్జిక్యూటివ్ పదవికి రాజినామా చేసారు హీరో రాజశేఖర్. ఇది జరిగి నెలలు గడుస్తున్నా రాజశేఖర్ కు చిరు మీద కోపం పోయినట్టులేదు. తాజాగా మరోసారి రాజశేఖర్ చిరుని టార్గెట్ గా అనిపిస్తుంది. ప్రత్యక్షంగా కాకపోయినా చిరుని రాజశేఖర్ పరోక్షంగా టార్గెట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

తాజగా రాజశేఖర్ నటించిన “అర్జున” చిత్రం మూవీ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇందులో “పార్టీ ఓపెన్ చేయగానే టికెట్లు అమ్ముకుని, పని అయిపోయాక పార్టీ అమ్ముకోడానికి కాదురా పెట్టింది పార్టీ” అనే డైలాగ్ రాజశేఖర్ చెప్పడంతో… ఈ డైలాగ్ చిరుని ఉద్దేశించే రాజశేఖర్ ఈ డైలాగ్ చెప్పాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అసలు నిజం ఏంటో రాజశేఖర్ ఆండ్ కో..కె తెలియాలి.































