Rakul Preeth Singh: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సందీప్ కిషన్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా మంచి హిట్ అవ్వటంతో టాలీవుడ్ లో ఆమెకు మంచి మంచి అవకాశాలు దక్కాయి. ఈ క్రమంలో తెలుగు తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.
రకుల్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్న రకుల్ ప్రీత్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు లభించాయి. బాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు రావడంతో ఈ అమ్మడు ముంబైకి తన మఖాం మార్చేసింది. దీంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.
ఇక ఇటీవల హిందీలో రకుల్ నటించిన “ఛత్రీవాలి” సినిమా ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమాలో రకుల్ సురక్షితమైన శృంగారానికి సంబంధించిన పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్ గా నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో రకుల్ మాట్లాడుతూ. శృంగారం గురించి బహిర్గతంగా మాట్లాడటానికి ఎవరు ఇష్టపడరు. కానీ ప్రస్తుత కాలంలో పిల్లలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుందని భావించి ఈ సినిమాలో నటించినట్లు రకుల్ వెల్లడించింది.
Advertisement
ఇక ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం కోసం తాను పడిన కష్టాల గురించి కూడా రకుల్ వెల్లడించింది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ..” నేను కాండీవాలిలో ఉండేదాన్ని. కానీ సినిమా అవకాశాల కోసం నా ట్రైనర్ తో కలిసి ఒక కేఫ్ లో కూర్చొని సినిమాలో అవకాశాలు పొందటానికి ఎక్కడికి వెళ్లాలి? ఆడిషన్ ఎలా ఇవ్వాలి ? అన్న విషయాల గురించి చర్చించుకునేదాన్ని. ఆ సమయంలో బ్యాగులో బట్టలు పెట్టుకుని తిరుగుతూ ఎక్కడికైనా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కారులోనే బట్టలు మార్చుకొని ఆడిషన్స్ కి వెళ్లేదాన్ని.
కొన్ని ఆడిషన్స్ లో నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసి షూటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా నన్ను రిజెక్ట్ చేసి వేరొక హీరోయిన్ ని తీసుకునేవారు. ఇలా ప్రతిసారి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయేది. అయితే కష్టపడకుండా అన్ని దక్కాలని కోరుకునే మనస్తత్వం నాకు లేదు. ఏ పనిలో అయిన విజయంసాధించాలంటే కష్టపడాల్సిందే. అందుకే పోరాటం అనే పదం నాకు నచ్చదు. ఇలా ప్రతిసారి అవకాశాలు వచ్చి చేజారి పోయినా కూడా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను. అలా చేయడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను” అంటూ తన ఎక్స్పీరియన్స్ గురించి రకుల్ చెప్పుకొచ్చింది.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.