Ramya Raghupathi: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలోనూ నటి పవిత్ర లోకేష్, నరేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రమ్య నరేష్ మూడవ భార్య అయితే ఎనిమిది సంవత్సరాల క్రితమే పలుగొడవల కారణంగా రమ్య నరేష్ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఈ విధంగా తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ వీరిద్దరికీ విడాకులు మాత్రం కాలేదు.

ఈ క్రమంలోనే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో ఎంతో చనువుగా ఉన్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది.

ఇప్పటివరకు వీటి మధ్య మాటల యుద్ధం జరిగినా,ఆదివారం నరేష్ పవిత్ర మైసూర్ లోని ఒక రెస్టారెంట్లో అడ్డంగా రమ్య చేతికి దొరికిపోయారు. ఇలా రెస్టారెంట్లో వీరిద్దరిని చూసిన రమ్య ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా వారిపై చెప్పుతో దాడికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోని ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
నరేష్ పవిత్ర జంటకు అండగా నిలిచిన పోలీసులు…
వీరి వ్యవహారం గురించి రమ్య మాట్లాడుతూ.. తాను ఇంకా నరేష్ నుంచి విడాకులు తీసుకోలేదని, అలా నేను విడాకులు తీసుకోకుండా నే నరేష్ మరుగు మహిళతో ఎలా తిరుగుతారు? నేను ఆయనకు విడాకులు ఇవ్వడం అందరి ముందు అతనిని వివాహం చేసుకున్నాను, ఇలా విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ నరేష్ తో తిరగడం భవ్యం కాదంటూ మండి పడ్డారు. అదేవిధంగా వీరికి పోలీసులు కూడా అండగా నిలబడడం ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తా..అంటూ నరేష్ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తూ శపథాలు చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























