ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మికకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కేవలం దక్షిణాది సినిమాల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు విషయంలో తన తల్లిదండ్రులు చాలా బాధ పడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ రష్మిక మాత్రం పలు సినిమా షూటింగులు అంటూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడపడంతో తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారని తెలిపింది. కొద్ది రోజులపాటు షూటింగ్స్ వాయిదా వేసుకోమని తనకి చెబుతున్నట్లు తెలిపారు.
కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకోవడం మన చేతుల్లో ఉంది కానీ షూటింగ్స్ వాయిదా వేయడం మన చేతుల్లో లేదు కనుక ఈ అమ్మడు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఓ సందర్భంలో తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, అమితాబ్తో గుడ్ బైతోపాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.
అదే విధంగా తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో స్థాయి లో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “ఆడాళ్ళు మీకు జోహార్లు”అనే చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నారు.






























