ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతోంది ఈటీవీ. తాజాగా ‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటూ కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మేఘన యాంకర్ గాను.. రాజీవ్ కనకాల జడ్జిగాను చేస్తున్నారు.

యాంకర్గా ఉన్న మేఘన మాత్రంఓ రేంజ్లో రెచ్చిపోతోంది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ డ్యాన్సులతో వయ్యారాలను ఊపేస్తోంది. ఆమె వయ్యారాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందులో జబర్దస్త్ షోలాంటి స్కిట్లు, డ్యాన్స్ పర్ఫామెన్స్, స్టాండప్ కామెడీలు ఉంటాయి.
తాజాగా వచ్చిన ప్రోమోలో ఏముందంటే.. ఢీ షోలో పాపులర్ అయిన అక్సాఖాన్ ప్రదర్శన ఆకట్టుకుంది. యాంకర్ గా రెచ్చిపోదం బ్రదర్ కు వచ్చానంటూ చెప్పుకొచ్చింది. కానీ దానికి తగ్గట్టు సమాధానం ఇచ్చిన యాంకర్ మేఘనాకు అక్సాఖాన్ కౌంటర్ ఇచ్చారు. ఇది ఎవరో కావాలనే రాసి నా మీదకు వదిలారంటూ యాంకర్ మేఘనా చెప్పింది. ఇది కూడా కామెడీలో భాగమే.
దీనిలో జబర్దస్ట్ కమెడియన్ వెంకీ కామెడీ పీక్ కి తీసుకెళ్లింది. అంతే కాకుండా జబర్దస్త్ షో లో రాకెట్ రాఘవ టీంలో పనిచేసే కంటెస్టెంట్ ల కామెడీ కూడా అదిరిపోయింది. తొందరపడకు అనే పదాన్ని కామెడీగా ఉపయోగించారు. ఇక ఈ ప్రోమోలో ప్రతీ ఒక్కరూ రెచ్చిపోయారు. ఈ షో సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారం అవుతుంది.
































