Actress Madhavi Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన నటి మాధవి రెడ్డి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా మాధవి రెడ్డి తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఏమాత్రం తీరిక లేకుండా సినిమా షూటింగ్ లో పాల్గొనేదానిననీ కనీసం సర్జరీ చేయించు కోవడానికి కూడా తనకు వీలు లేకుండా పోయిందని తెలిపారు.

సర్జరీ రేపు ఉదయం జరుగుతుంది అనగా రాత్రి వరకు షూటింగ్ లో పాల్గొన్నానని, సర్జరీ అయిన ఐదు రోజులకి తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారని అప్పటి సంగతులను మాధవి రెడ్డి వెల్లడించారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ చదివేటప్పుడు తిరుపతి మహిళా యూనివర్సిటీలో రోజా ఇద్దరు ఒకటే క్లాస్ మేట్స్ అని తెలియజేశారు. ఈ క్రమంలోనే అప్పటి సంగతులను మాధవి గుర్తుచేసుకున్నారు.

మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో శివప్రసాద్ గారు రోజాతో ప్రేమ తపస్సు సినిమా చేశారని మాధవి రెడ్డి తెలిపారు. ఆ సమయంలో నువ్వు నల్లగా ఉన్నావు పనిమనిషి పాత్రకు కరెక్టు గా సెట్ అవుతావని రోజాను ఏడిపించేవాళ్ళమని మాధవి రెడ్డి ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
డిగ్రీ క్లాస్ మేట్స్….
ఇలా డిగ్రీ తర్వాత రోజా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించారు.అయితే హీరోయిన్ అయిన తర్వాత తనని మోడ్రన్ మహాలక్ష్మి కార్యక్రమంలో కలుసుకున్నానని ఆ సమయంలో వెళ్లి డిగ్రీలో మీ క్లాస్మేట్ అని పలకరించగా రోజా కూడా గుర్తుపట్టి పలకరించి ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఏంటి అని మాట్లాడమని ఈ సందర్భంగా మాధవి రెడ్డి రోజా గురించి వెల్లడించారు.































