బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో జబర్దస్త్. మొదట జబర్దస్త్ గా మొదలైన ఈ షో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ గా కూడా మొదలైంది. వారంలో రెండు రోజులు ప్రేక్షకులకు పండగ వాతావరణమే అని చెప్పొచ్చు. ఈ షోలకు వచ్చే రేటింగ్స్ ఎప్పుడూ టాప్ లో ఉంటాయి. అయితే జబర్దస్త్ లో రోజా జడ్జిగా మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం.

మధ్యలో రోజా బిజీగా ఉండటంతో హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహిరించిన విషయం తెలిసిందే. తర్వాత మళ్లీ రోజా జడ్జిగా వ్యవహరించారు. తాజాగా ఈ వారం మరోసారి రోజా జడ్జి స్థానంలో కనిపించలేదు. ఆమె స్థానంలో మరోసారి ఇంద్రజ కనిపించారు. దీని వెనుక కారణాలు ఏంటో తెలుసుకుందాం. రోజా ఆంధ్రప్రదేశ్ లోని నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
అటు రాజకీయాలను చూసుకుంటూ.. ఇటు జబర్దస్త్ షోలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే ఆమెపై అంతక ముందు విమర్శలు కూడా వచ్చాయి. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటూ.. ఇలాంటి షోలు చేస్తుండటంపై కొంతమది విమర్శలు చేశారు. దానికి రోజా కూడా సమాధానం చెప్పారు. ఎన్ని అడ్డంకులు వచ్చానా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చింది.
బిజీ షెడ్యూల్ లో భాగంగా కొన్ని సందర్భాల్లో షోకి హాజరు కాకపోవచ్చు.. కానీ.. షోని మాత్రం వదిలిపెట్టనంటూ చెప్పింది. ప్రస్తుతం ఈమె రాజకీయంగా బిజీ ఉండటంతో కొన్ని షోల వరకు బ్రేక్ వచ్చిందని.. తర్వాత మళ్లీ జాయిన్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె స్థానంలో ఇంద్రజ కొనసాగుతన్నారు.































