మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి ధరమ్ ను ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి తరలించగా అనంతరం అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలో అతన్ని పరీక్షించిన వైద్యులు అంతర్గత గాయాలివే కాకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేస్తున్నారు.
ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచిస్తున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం అతని ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారంటూ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు కథనాలు రాస్తూన్నటువంటి మీడియా పై తీవ్రస్థాయిలో ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్ హాట్సాఫ్ బ్రదర్… నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు రాతలు రాస్తూ ఆ వార్తలను అమ్ముకొని బతుకుతున్న అందరూ బాగుండాలి వారికి ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నా అంటూ ట్విట్టర్ వేదికగా పలు మీడియా సంస్థలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ కి టీవీ9 జర్నలిస్ట్ దొంతు రమేష్ స్పందిస్తూ ఆయన ట్వీట్ కు రీట్వీట్ చేశారు.
ఈ మధ్యకాలంలో మీడియా వాళ్ళని విమర్శించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.. తప్పుడు కథనాలతో హింసను ప్రేరేపిస్తూ సినిమాలు తీసి మీరు కోట్లు సంపాదించవచ్చు కానీ, మేము వార్తలు రాస్తే మాత్రం తప్పుడు వార్తలు అంటూ ప్రచారం చేస్తారు. మీరు అతివేగంతో వెళ్లి ప్రమాదానికి గురి కావడమే కాకుండా మరికొందరు ప్రాణాలను కూడా ముప్పు తెస్తున్నారంటూ రమేష్ హరీష్ శంకర్ ట్వీట్ కి బదులిచ్చారు.
హాట్స్ ఆఫ్ తమ్ముడు @IamSaiDharamTej హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్
నీ ఆక్సిడెంట్ వంకతో …. తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి
వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏;— Harish Shankar .S (@harish2you) September 11, 2021
ఈ క్రమంలోనే హరీష్ శంకర్ స్పందిస్తూ నేను “తప్పుడు వార్తలు” రాసే వారికి అంటూ క్లియర్ గా చెప్పాను. మరి మీరు ఎందుకు అనవసరంగా భుజాలు తడుముకున్నారు అంటే.. మీరు తప్పుడు రాతలు రాస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా అంటూ హరీష్ శంకర్ వెల్లడించారు. మేము హింసాత్మక చిత్రాలను చేస్తే మాకు సెన్సార్ ఉందిమేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము మరి మీరు ఎవరికీ సమాధానం చెప్పుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నేను మీ వ్యవస్థను తప్పు పట్టడం లేదు మీ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాను అంటూ ఈ విధంగా హరీష్ శంకర్ టీవీ9 జర్నలిస్ట్ రమేష్ మధ్య సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ ట్వీట్స్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.