Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా అల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన వరుస సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాల క్రితం సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో ఈయన తీవ్ర గాయాలు పాలు అవ్వడమే కాకుండా దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ క్షేమంగా బయటపడ్డారు.

ఇలా ప్రమాదం నుంచి బయటపడిన సాయిధరమ్ తేజ్ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోని ఈయన విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి ధరంతేజ్ బైక్ ప్రమాదం గురించి స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రమాదాన్ని తాను ఒక పీడకలలా భావించలేదని దానిని ఒక స్వీట్ మెమరీగా భావిస్తున్నానని తెలిపారు.
తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత తాను చాలా విషయాలు నేర్చుకున్నాను ముఖ్యంగా మాట విలువ తెలుసుకున్నాను. ప్రమాదానికి ముందు తాను ఎక్కువగా మాట్లాడే వాడిని కానీ మాటకు ఉన్న విలువ ప్రమాదం తర్వాతే తెలిసిందని తెలిపారు.ఇక హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అభిమానులు నాకోసం ప్రార్థించిన వారందరినీ చూసి తనకు చాలా సంతోషం వేసిందని ఇది కదా నేను సంపాదించిన అసలు సిసలైన ఆస్తి అని సంతోషం వేసిందని తెలిపారు.

Sai Dharam Tej: మళ్లీ బైక్ ఎక్కకూడదు అనుకున్నా…
మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరమని తన తల్లి చెప్పి, బైక్ ఎక్కించిందని చెప్పుకొచ్చాడు. ఈ క్షణంలో బ్రతకాలి వర్తమానంలో బ్రతకాలి అనే విషయాలను తెలుసుకున్నానని అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా గడపాలని ఫిక్స్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా సాయి ధరంతేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































