Sakshi Singh: ఇండియన్ కూల్ కెప్టెన్ ధోని ధోని ఎంటర్టైన్స్ అనే పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం మనకు తెలిసిందే. నిర్మాణంలో మొట్టమొదటిసారిగా LGM అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ధోని వైఫ్ సాక్షి సింగ్ కూడా రంగంలోకి దిగారు.ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాదులో ప్రెస్మీట్ నిర్వహించే ఈ సినిమాను ప్రమోట్ చేసారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధిలు అడిగే ప్రశ్నలకు సాక్షి సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఈమెను ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి స్టార్స్ తో సినిమా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాక్షి సమాధానం చెబుతూ.. నేను ఇంకా ఇండస్ట్రీలోకి ఇప్పుడే అడుగు పెట్టాను. పవన్ కళ్యాణ్ ప్రబాస్ వీరంతా కూడా పెద్ద స్టార్స్. వీరికి రెమ్యూనరేషన్ ఇచ్చే అంత మని నా దగ్గర లేదని సమాధానం చెప్పారు.

Sakshi Singh: ఆరోజు కోసమే ఎదురు చూస్తున్నాను…
ఫ్యూచర్లో మీ భర్త ధోని హీరోగా ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఆ రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పారు. అన్ని కుదిరితే ధోని హీరోగా తన నిర్మాణంలో సినిమా రావచ్చని ఈ సందర్భంగా సాక్షి సింగ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
































