ఇన్స్టాగ్రామ్లో సమంత అరుదైన ఘనత సాధించింది. ఈ నటి 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ను అధిగమించింది. ఇది సౌత్లోని హీరోయిన్లలో అత్యధిక ఫాలోయింగ్లో ఒకటి. టాలీవుడ్ మేల్ స్టార్స్లో అత్యధిక ఫాలోయింగ్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండకు ఉన్నారు. వీళ్లకు దాదాపు 14 మిలియన్ల మంది ఫాలోవర్లతో అత్యధిక ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.

ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ ఆ ఇద్దరు హీరోల ఫాలోవర్స్ ను దాటేసింది. ఆమె ఇప్పటికే బ్రాండ్ ఎండార్స్మెంట్లతో ఇన్స్టాలో తన ఫాలోయింగ్ను మానిటైజ్ చేస్తోంది. ఈ ఫీట్ ను సాధించడినికి ఆమకు ఇది ఎందగానో ఉపయోగపడింది. ఇక ఆమె నాగచైతన్యతో విడాలకుల ప్రకటన తర్వాత ఆమె తన కెరీర్ లో దూసుకుపోతోంది. తాజగా పుష్ప సినిమాలో ఆమె ఓ ఐటెం సాంగ్ ను చేస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ సభ్యులువ విడుదల చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
దీనికి ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. రామోజీ ఫిల్మ్సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఇక ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాలని చూస్తోంది.
సమంత ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్లతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్ విజయంతో ఈ ముద్దుగుమ్మకు మరికొన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఆమెకు హాలీవుడ్ లో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలిమ్స్ సమంతతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
































