Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి సమంత నాగచైతన్య విడిపోయి సుమారు నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వీరి విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారింది. ఇలా విడాకులు తీసుకోబోతున్నట్లు ఈ జంట ప్రకటించడంతో వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

వీరి గురించి వస్తున్న వార్తలపై అక్కినేని కుటుంబం కానీ సమంత కానీ ఏమాత్రం స్పందించలేదు. అయితే ఈ విషయం గురించి మరిచిపోయిన ఈ జంట పూర్తిగా వారి దృష్టిని కెరియర్ పై పెట్టారు. ఈ క్రమంలోనే సమంత వరస సినిమాలతో బిజీగా ఉండగా నాగచైతన్య కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా వీరిద్దరు పూర్తిగా కెరియర్ పై దృష్టిసారించిన విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో రావడంతో వీరి విడాకుల ఈ విషయంపై నాగార్జున స్పందించారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున అసలు విషయం బయట పెట్టారు.
పరువు, మర్యాద గురించి చైతన్య ఆలోచించాడు..
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ముందుగా సమంతనే చైతన్యను విడాకులు అడిగిందని తెలిపారు. సమంత నిర్ణయాన్ని గౌరవించిన నాగచైతన్య విడాకులు ఇచ్చారని, అయితే సమంత ఈవిధంగా విడాకులు అడగడానికి గల కారణం తనకు తెలియదని నాగార్జున చెప్పారు. విడాకుల వల్ల తాను ఎక్కడ బాధ పడతానోనని నాగచైతన్య పరువు మర్యాద గురించి ఎక్కువగా ఆలోచించారని ఈ సందర్భంగా నాగచైతన్య విడాకుల గురించి నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.































