దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే ఇల్లు, స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఎస్బీఐ ఈ నెల 30వ తేదీన మెగా వేలం నిర్వహిస్తోంది. ఈ వేలంలో పాల్గొనడం ద్వారా హోమ్, ఫ్లాట్, షాప్ లను మార్కెట్ రేటుతో పోల్చి చూస్తే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

డిసెంబర్ 30వ తేదీన ఆన్ లైన్ మెగా వేలం జరగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. వేలంపాటకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ సైట్ https://bank.sbi/web/sbi-in-the-news/auction-notices/bank-e-auctions ద్వారా తెలుసుకోవచ్చు. సమీపంలో స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదిస్తే ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
వేలంలో పాల్గొనే ఆసక్తి ఉండే వాళ్లు ముందుగా కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. మొదట కొంత డబ్బును డిపాజిట్ చేస్తే మాత్రమే ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు. దేశంలోని అగ్రికల్చరల్ ప్రాపర్టీలు, ఇండస్ట్రీయల్, కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. బ్యాంక్ కు వెళ్లి పూర్తి వివరాలు తెలియజేసి ఈ వేలం పాటకు రిజిష్టర్ చేసుకోవచ్చు.
ఎస్బీఐ వేలం ద్వారా ప్రాపర్టీలను కొనుగోలు చేసినా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇల్లు, షాప్ కొనుగోలు చేయాలనే ప్లాన్ ఉన్నవాళ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సులభంగా ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేయవచ్చు. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదిస్తే ఎస్బీఐ వేలం ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి.































