ఏపీలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలన్ని నేడు తెరుచుకోనున్నాయి. కరోనా సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. విద్యార్థులు, ఉపాద్యాయులు వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా విద్యార్థులు ఉండకుండా చూస్తారు. విద్యార్థులు పాఠశాలకు అనుమతించడంపై తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి కూడా తప్పనిసరి. ఇక స్కూలు వదిలిన సమయంలో 10 నిమిషాల వ్యవధితో తరగతుల వారీగా విద్యార్థులను బయటకు పంపిస్తారు. స్కూలు అసెంబ్లీ, గ్రూప్ డిస్కషన్స్, గెమ్ పిరియడ్, స్పోర్ట్సు వంటివి పూర్తిగా రద్దు చేశారు.































