Senior Journalist Durga Kumar : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా ప్రభుత్వాల మీద పక్క రాష్ట్రపు ప్రభావం పడుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రములో ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ సై అన్నాడు. నవంబర్ 30న తెలంగాణ ప్రజానీకం వారికి కావాల్సిన నాయకుడికి వారి భవిష్యత్ కోసం ఓటు అస్త్రాన్ని ఉపయోగించుకున్నారు. అయితే ఎలక్షన్ ప్రచారాలు, హారాహోరి అన్నీ సద్ధుమణిగి ఇపుడు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలయింది. ఫలితం రావడానికి కాస్త సమయమే ఉన్నా కాంగ్రెస్ దే గెలుపు, బిఆర్ఎస్ దే మరోసారి తెలంగాణ అంటూ సర్వేలు మొదలయ్యాయి. అయితే కాంగ్రెస్ వస్తుందనే ఎక్కువ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రభావం ఏపీ రాజకీయాల మీద ఎలా ఉండనుందో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ వివరించారు.

రేవంత్ సీఎం అయితే జగన్ పరిస్థితి అంతే…
దుర్గా కుమార్ గారు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఆంధ్ర రాజకీయాల మీద ముఖ్యంగా జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించారు. ఎన్నికల వేళ కావాలనే సీఎం జగన్ కృష్ణ నీటి జలాల విషయంలో రాజకీయం చేసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కి మేలు చేకూర్చేలా చేసినట్లయింది. ఈ విషయం అలాగే ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ కెసిఆర్ మీద గుర్రుగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇపుడు ఈ విషయంలో కూడా గుర్రుగా ఉన్నాడు.

ఇపుడు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి సీఎం అయితే మాత్రం జగన్ హైదరాబాద్ ఆస్తుల మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదీ కాక రేవంత్ ముందు నుండి చంద్రబాబు విధేయుడు. అలా చంద్రబాబు, రేవంత్ ద్వారా ఎలాంటి మాస్టర్ ప్లాన్స్ వేస్తాడో వేచి చూడాలి అంటూ తెలిపారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో అది ఖచ్చితంగా ఏపీ రాజకీయాల మీద ప్రభావం చూపనుంది అంటూ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ తెలిపారు.

































