serial Actress Madhavi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇందులో వసు రిషి క్యూట్ లవ్ స్టోరీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సీరియల్ ద్వారా రిషి పెద్దమ్మగా ఎంతో ఫేమస్ అయ్యారు నటి దేవయాని అలియాస్ మిర్చి మాధవి.

మిర్చి మాధవిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె ఈ సీరియల్లో దేవయాని పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తూ మెప్పించినటువంటి ఈమె నిజజీవితంలో మాత్రం అయిన వాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిందని తాజాగా తాను మోసపోయిన విషయం గురించి బయట పెడుతూ ఎవరు కూడా ఇలా మోసపోవద్దు అంటూ అందరికీ హెచ్చరించారు.
అయినవాళ్లే తనని నమ్మించి సుమారు 5 లక్షల వరకు మోసం చేశారని ఈమె తెలియజేశారు.తనకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గురించి పెద్దగా అవగాహన లేదు అయితే తనకు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని చెప్పి సుమారు 5 లక్షల వరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయించి నాకు తెలియకుండా ఆ డబ్బులు మొత్తం వాళ్లు సొమ్ము చేసుకుని తనని మోసం చేశారని తెలిపారు.

serial Actress Madhavi: ఐదు లక్షలు నష్టపోయాను…
ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తనకు డబ్బును నష్టపోయాననే బాధ కన్నా నమ్మిన వాళ్లే తనని దారుణంగా మోసం చేశారని ఈమె బాధపడ్డారు.ఇక స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేనటువంటి వారు ఇతరులను నమ్మి తనలాగా మోసపోవద్దని అందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి అంటూ ఈ సందర్భంగా ఈమె తాను నష్టపోయిన డబ్బు గురించి తెలియజేశారు.ఇక ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
































