సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటించడంతో పాటు, వాస్తు దోషాలు కూడా ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఎలాంటి చిన్న పని ప్రారంభించిన వాస్తుప్రకారం ఆలోచించి ఆ పనులను చేస్తుంటారు. మన సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజూ ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే మన ఇంట్లో ధూపం వేయడం సర్వసాధారణం. ఈ విధంగా ఎవరి సాంప్రదాయాలకు తగ్గట్టుగా వారు దుపాన్ని వేసి భగవంతుని స్మరిస్తుంటారు.

ధూపం వేయడం ద్వారా మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు, నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.ఈ విధంగా మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటం ద్వారా మనస్సుకు ఎంతో ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది.అయితే మన ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఈ ధూపం వేయటం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్పూరం, లవంగం కాల్చి ఆ ధూపాన్ని ఇల్లంతా వేయాలి. ఆ తరువాత దేవుడికి పూజలు నిర్వహించి కర్పూర హారతిని ఇవ్వాలి. ఈ విధంగా కర్పూర హారతి ఇవ్వడం వల్ల మన ఇంటిలో ఏర్పడిన వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా, మన ఇంట్లో ధన నష్టం కూడా వాటిల్లదు. అదేవిధంగా మన ఇంట్లో నిప్పులపై గుగ్గిల్ ధూపం వేయడం వల్ల ఇల్లంతా ఎంతో సువాసనభరితంగా ఉండటమే కాకుండా మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారికి నయమవుతుంది.ఆవు పిడకలపై పసుపుపచ్చని ఆవాలను వేసి ధూపం వేయడం ద్వారా మన ఇంట్లో ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.































