Singer B. Vasantha : బొడ్డుపల్లి బాల వసంత అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు కానీ బి.వసంత అనగానే సింగర్ గా ఆమె పాడిన అలనాటి పాటలు ఎన్నో గుర్తుకు వస్తాయి. ‘చందమామ రావే జాబిల్లి రావే’ అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ తెలుగు లోగిల్లలో వినిపిస్తుంది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ ఇలా సుమారు 8 భాషలలో సుమారు పదివేలకు పైగా పాటలు పాడిన వసంత గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ అప్పటి రోజుల్లో ఎలా రిలేషన్స్ ఉండేవి లాంటి విషయాలను తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ఒక ఊపు ఊపుతున్న సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ వసంత గారి సొంత చెల్లి కొడుకు కావడం విశేషం.

బాధ్యతలన్నీ నా మీదే… అప్పట్లో రెమ్యూనరేషన్…
వసంత గారి స్వస్థలం గుంటూరు కాగా తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ అలానే ఫోటో గ్రాఫర్. ఇక తల్లి వీణ విద్వాంసురాలు కావడం వల్ల వసంత గారికి సంగీతం, గానం మీద చిన్నపటి నుండే ఆసక్తి వచ్చింది. ఇక సంగీతం నేర్చుకున్న వసంత గారు తండ్రి ప్రోత్సాహంతో చెన్నై లో సినిమాల్లో పాడటానికి వెళ్లారు. ఇక సింగర్ గా సినిమాల్లోను అలానే బయట కచేరిల్లో పడుతూ కుటుంబ బాధ్యత వసంత గారు తీసుకున్నారు. వసంత గారు ఇద్దరు చెల్లెళ్లను చదివించి పెళ్లి చేసాక తాను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. భర్త సుధాకర్ గారు వ్యాపారం చేస్తున్నా వసంత గారి కెరీర్ కోసం హైదరాబాద్ లో వ్యాపారాలను వదిలి చెన్నై కి వచ్చి వసంత గారి షెడ్యూల్ చూసేవారట. ఇక ఎన్నో పాటలు పాడినా అనుకున్నంత గుర్తింపు మాత్రం రాలేదంటూ వసంత గారు బాధపడ్డారు.

మాధవపెద్ది, పెండ్యాల, కే వి మహదేవన్, ఘంటసాల, బాలసుబ్రమణ్యం ఇలా అప్పటి అందరి సింగర్స్ తోనూ అలానే మ్యూజిక్ డైరెక్టర్స్ తోనూ పనిచేసిన వసంత గారు బాలసుబ్రమణ్యం గారి మరణం బాధించిందని ఆరోజు చాలా ఏడ్చానంటూ చెప్పారు. అప్పుడే ఎందుకు వెళ్లిపోయారు, మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాల్సి ఉంది అపుడే ఎందుకు పోయారు అని బాగా ఏడ్చానంటూ తెలిపారు. ఇక థమన్ గురించి మాట్లాడుతూ నేను సాధించలేనిది తాను సాధించాడంటూ గర్వపడుతున్నాను అంటూ తెలిపారు.































