Sravana Bhargavi : సోషల్ మీడియా జమానాలో ఎవరు ఎప్పుడు ఏ న్యూస్ తో వైరల్ అవుతుంటారో ఎవరికీ తెలియదు. తెలుగులో సింహ సినిమాలోని సింహమంటి చిన్నోడే పాటతో బాగా పాపులరిటీ తెచ్చుకున్న సింగర్ శ్రావణ భార్గవి ఆ మధ్య తన భర్త హేమ చంద్ర కు దూరంగా ఉంటోందని, ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఈ జంట కొద్ది రోజులు బాగా వైరల్ అయ్యారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ స్వయంగా సోషల్ మీడియా ద్వారా మేము విడిపోలేదు కలిసే ఉన్నాం దయచేసి మమ్మల్ని విడదీయొద్దు అంటూ పోస్టు చేసారు.

ఇపుడు లైగర్ సినిమా ద్వారా…
ఇక విడాకుల గోల పూర్తయ్యాక మళ్ళీ శ్రావణ భార్గవి మరోసారి సోషల్ మీడియాలో నానింది. ఈసారి వివాదం లో చిక్కుకుంది. యూట్యూబ్ ఛానెల్ లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటూ పాటలు పాడుతూ, కబుర్లు చెబుతూ ఉండే శ్రావణ భార్గవి మంచి ఫాలోయింగ్ ని కలిగివుంది. అయితే కొద్ది రోజుల క్రితం అన్నమయ్య కీర్తన ‘ఒక పరి ఒక పరి’ అంటూ పాట పాడి ఆ పాటను భక్తి తో కాకుండా శృంగార రసం ఒలకబోస్తూ కీర్తనను కించపరిచింది అంటూ అన్నమయ్య వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక వివాదం ముదిరి సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి కొద్ది రోజులు బాగా వైరల్ అయింది.

చివరకు తానే వెనక్కు తగ్గి వీడియోను యూట్యూబ్ లో తన ఖాతానుండి తొలగొంచింది. ఇక వివాదం సద్ధుమణిగి అందరూ మర్చిపోయారు. అయితే ఇపుడు మరోసారి శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈసారి వివాదాల జోలికి పోకుండా చాలా రోజుల తరువాత హుషారైనా పాట పాడి అభిమానులను అలరించింది. లైగర్ సినిమాలో తెలుగు వెర్షన్ కోసం ‘ఆఫత్’ అనే పాటను సినిమాలో ఆలపించింది శ్రావణ భార్గవి. పెళ్లయ్యాక పాప పుట్టాక ఎందుకో శ్రావణ భార్గవి పాటలు పాడటం తగ్గించింది, అందునా సినిమా పాటలను తగ్గించింది. చాలా గ్యాప్ తరువాత లైగర్ లో పాట పడింది. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ పాటను ఆలపించి అందరినీ అలరించింది.






























