Sunitha : సునీత 15 ఏళ్ళ వయసుకే ‘గులాబీ’ సినిమాలోని ‘ఈవేళలో నీవు’ అనే పాటతో కెరీర్ ను ప్రారంభించి మొదటి పాట తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం లలో దాదాపు ఇప్పటివరకు 3000 పాటలు పాడింది. సింగర్ గానే కాకుండా అనేక సినిమాలలో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే సునీత సింగర్ గా ఎంత బిజీ గా వున్నా సోషల్ మీడియా లో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో సునీతకు 3.5 మిలియన్ ఫాలోయర్స్ వున్నారు. ఇక సునీత ఎప్పటికప్పుడు ఫోటోలు, రీల్స్ అంటూ అభిమానులకు చేరువగా వుంటారు. తాజాగా తన భర్త రామ్ వీరపనేని తో వున్న ఒక వీడియోని అభిమానులతో పంచుకుంది.

ముస్కురానే కి వజహ్ తుమ్ హో అంటూ…
సునీత మ్యాంగో అధినేత రామ్ వీరపనేనిని 2021 జనవరి 9న పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తాజాగా సునీత తన భర్తను కౌగలించుకుని, చిరునవ్వులు చిందిస్తూ తీసుకున్న ఫోటోకి ఒక మ్యూజిక్ ట్రాక్ ను యాడ్ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

సిటీలైట్స్ అనే బాలీవుడ్ సినిమాలోని “ముస్కురానే కి వజహ్ తుమ్ హో” అనే పాటను ఆ ఫొటోకు జత చేశారు. ఈ పాటకు అర్ధం “నా మొఖంలో చిరునవ్వుకు కారణం నీవే” అని. అంటే సునీత తన సంతోషానికి కారణం ఆమె భర్త అని ఈ వీడియో ద్వారా తెలియజేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లి తెగ వైరల్ అవుతోంది.































