Tag Archives: actor naresh

Actor Naresh: నటుడు నరేష్ ఇంటి పై దాడి… రమ్య రఘుపతి పై ఫిర్యాదు చేసిన నటుడు నరేష్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు. అయితే ఇలా ఈయన రిలేషన్ లో ఉంటూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి వచ్చే పెద్ద ఎత్తున వివాదం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా తన వ్యక్తిగత కారణాలవల్ల నరేష్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ మీడియా వార్తల్లోనూ హాట్ టాపిక్ గా మారారు.ఇకపోతే ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ రమ్య పెట్టే టార్చర్ తాను భరించలేక తనకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. అలాగే ఆమె ఆస్తి కోసమే తనను పెళ్లి చేసుకుందని రమ్య పూర్తిగా డబ్బు మనిషి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రమ్య డబ్బు కోసం తనపై ఓసారి హత్య ప్రయత్నం కూడా చేసిందని నరేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన మరోసారి గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో భాగంగా తన ఇంటి పై దాడి జరగడానికి గల కారణం రమ్య రఘుపతి అంటూ ఆమె పేరును కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఈయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Actor Naresh:వాహనాలపై దాడి..

ఈ విధంగా దాడి ఘటనలో భాగంగా నరేష్ కేరవాన్ తో పాటు ఇతర వాహనాల అద్దాలు మొత్తం పగిలిపోయాయని ఈయన తెలియజేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నరేష్ ఇంటిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇలా రమ్య రఘుపతి తన ఇంటిపై దాడి చేయించింది అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలపై రమ్య రఘుపతి ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Actor Naresh: మరోసారి సైబర్ పోలీసులను ఆశ్రయించిన నరేష్…. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నరేష్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ తరచూ తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా మూడు వివాహాలు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం మరొక నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు అయితే ఈ విషయం గురించి తరచూ నరేష్ వార్తల్లో ఉండడమే కాకుండా వీరి రిలేషన్ పై ఎంతోమంది పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ఎన్నో రకాల ట్రోల్స్ మీమ్స్ రావడమే కాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్ మీడియా సంస్థలు కూడా వీరి వ్యక్తిగత జీవితం గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ వార్తలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్తలపై రియాక్ట్ అయినటువంటి నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నటువంటి సదరు చానల్ పై ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఈయన ఫిర్యాదు చేయడంతో ఎంతవరకు విచారణకు వచ్చాయనే విషయం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అనంతరం నరేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Actor Naresh: పరువు నష్టం దావా వేస్తా….

కొందరు ఉద్దేశపూర్వకంగా తన వ్యక్తిగత విషయాల గురించి దుష్ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఇలా తను పరువు ప్రతిష్టలను ఇలా కించపరిచేలాగా ప్రవర్తించిన వారిని సాక్షాదారాలతో సహా బయట పెడతానని, వారిపై పరువు నష్టం దావా కేసు వేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి అలాగని మా బెడ్ రూమ్ బాత్రూంలోఇలా మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నారు అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఈయన ట్రోలర్స్ మీమర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actor Naresh: పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోబోతున్న నరేష్… మూడో భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా?

Actor Naresh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అనే విషయానికి వస్తే అది పవిత్ర నరేష్ నాల్గవ వివాహం అని చెప్పాలి. ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఆరు పదుల వయసులో మరొక నటి పవిత్ర లొకేషన్ వివాహం చేసుకోబోతున్నానని అధికారికంగా వెల్లడించారు.అయితే ఇప్పటికే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇవ్వడం గమనార్హం.

ఇకపోతే నరేష్ పవిత్ర ఇద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలోనే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరొక మహిళతో ఎలా అక్రమ సంబంధం పెట్టుకొని తనని పెళ్లి చేసుకుంటాడని పెద్ద ఎత్తున వివాదం సృష్టించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరికి విడాకులు మంజూరు అవడంతోనే నరేష్ నాలుగో పెళ్లి గురించి ప్రకటించారని తెలుస్తుంది.

ఇలా రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చిన అనంతరం నరేష్ తనకు భరణం కింద మొత్తంలో చెల్లించారనే విషయం గురించి ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నరేష్ రమ్య రఘుపతికి ఐదు కోట్ల రూపాయల భరణం చెల్లించినట్లు సమాచారం.

Actor Naresh: ఐదు కోట్ల రూపాయల భరణం అందుకున్న రమ్య రఘుపతి…

నరేష్ తన తల్లి విజయ్ నిర్మల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తిని అందుకున్నారు.అయితే ఈయన ఆస్తిలో రమ్య రఘుపతి కుమారుడికి వాటా ఉంటుందని అయితే ఈమెకు మాత్రం భరణం కింద 5 కోట్ల రూపాయలు చెల్లించారని వార్తలు వస్తున్నాయి.రమ్య రఘుపతి నరేష్ పవిత్ర వ్యవహారంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంది. అయితే ఈమె ఐదు కోట్ల రూపాయల తీసుకొని విడాకులు ఇవ్వడానికి ఎలా కాంప్రమైజ్ అయ్యారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Actor Naresh: సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లు ఖాళీ.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. కరోనా కారణంగా సినిమా నిర్మాణ పనులు ఆగిపోయి నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు బయటకి వచ్చి థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు.

థియేటర్లు మూతపడటంతో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటిటిలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి నెలలు గడుస్తున్నా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగటమే. బాగా డబ్బున్న వారికి ఈ టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలంటే మినిమం 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు.

ఇటీవల ఈ విషయంపై నటుడు వి కె నరేష్ స్పందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో ఉన్న రిలేషన్ వల్ల వివాదంలో నిలిచిన నరేష్ చాలాకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఇటీవల నరేష్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రజలు థియేటర్లలో సినిమా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నరేష్ స్పందిస్తూ…సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారు. ఇటీవల విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని వెల్లడించాడు.

Actor Naresh: పాప్ కార్న్ పెప్సీ రేట్లు పెరగడం కూడా..

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకపోవటానికి టికెట్ రేట్లు పెరగటం ముఖ్య కారణం కావచ్చు .కానీ అదొక్కటే కారణం కాదు. సినిమా టికెట్ రేట్లతో పాటు సినిమా థియేటర్లలో అమ్ముతున్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు రూ.20, రూ.30 లకు దొరికే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధర ఇప్పుడు రూ.200, రూ.300 అయ్యింది. అందువల్ల ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు రావటానికి ఆసక్తి చూపరు. వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. అని నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

Venu Swamy: ముందే చెప్పాను కదా నరేష్.. మీకు విడాకులు ఖాయం అని.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

Venu Swamy: వేణు స్వామి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. సినీ సెలెబ్రెటీల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున ఈయన వార్తల్లో నిలిచారు. సమంత నాగచైతన్య విషయంలో ఈయన చెప్పిన జోస్యం నిజం అవడంతో అప్పటినుంచి ఈయన చెప్పే మాటలు వినే వారి సంఖ్య అధికమయింది.ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన ఈయన తాజాగా నటుడు నరేష్ రమ్య రఘుపతి పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద అభిమానిని వేణు స్వామి వెల్లడించారు. ఈ క్రమంలోనే తరచూ వారి ఇంట్లో ఎన్నో పూజలు కూడా చేశానని వేణు స్వామి తెలిపారు. ఇకపోతే 2014 సంవత్సరంలో అనుకుంటా ఒకసారి విజయనిర్మల కృష్ణ గారి జాతకాలు చూసినప్పుడు 2020 సంవత్సరంలో వారిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని తాను జాతకం చెప్పినట్లు వేణు స్వామి వెల్లడించారు.ఈ విషయం విన్న విజయనిర్మల ఎంతో భయపడిందని అయితే తాను భయపెట్టాలనే ఉద్దేశంతో అలా చెప్పలేదని వారి జాతకం అలాగే ఉందని వేణు స్వామి తెలిపారు.

తాను చెప్పిన విధంగానే విజయనిర్మల చనిపోయారు. ఇక వీరి జాతకాలు చెబుతున్న సమయంలో నరేష్ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయనకు రమ్య రఘుపతి తో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే నరేష్ రమ్య జాతకం చూసిన తాను వీరిద్దరు పెళ్లి చేసుకున్నా విడిపోతారని చెప్పాను. అయితే నరేష్ వీటిని పట్టించుకోకుండా రమ్యను పెళ్లి చేసుకున్నారు.

విడిపోతారని ముందే చెప్పిన వినలేదు..

ప్రస్తుతం ఫలితం మనం చూస్తున్నాము అంటూ వేణు స్వామి తెలిపారు. నరేష్ రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్న విడిపోతారని నాకు తెలుసు. ఈ విషయం వారికి చెప్పిన వినలేదు అందుకే వీరి పెళ్లిని తాను చేయలేదని ఈ సందర్భంగా నరేష్ పెళ్లి విడాకుల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Actor Krishna: కుటుంబ పరువు పోతుంది.. నరేష్ పవిత్ర వ్యవహారంపై కృష్ణ సీరియస్?

Actor Krishna: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి మీడియా వార్తల్లో ఫ్రంట్ లైన్ లో ఉంటుంది. నరేష్ విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈ క్రమంలోనే నటుడిగా కమెడియన్ గా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో విడుదుడుకులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో ఈయన రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ఇక ఈ వ్యాఖ్యలపై నటి పవిత్ర లోకేష్ స్పందిస్తూ మేము రిలేషన్ లో ఉన్న విషయం కృష్ణ గారి ఫ్యామిలీకి కూడా తెలుసు. ఆ ఫ్యామిలీ సపోర్ట్ మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా వీరి వ్యవహారం రోజు రోజుకు వైరల్ కావడంతో సీన్లోకి నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. ఇక రమ్య ఎంట్రీ ఇవ్వడంతో వీరి వివాదం తారస్థాయికి చేరింది. రమ్య ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడికి కూడా ప్రయత్నం చేశారు. ఈ విధంగా వీరి మధ్య గొడవల కారణంగా కృష్ణ ఫ్యామిలీ కూడా ప్రస్తావనలోకి వచ్చింది. దీంతో కృష్ణ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

తన పేరు ప్రస్తావన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణ..

నరేష్ పవిత్ర వ్యవహారం వల్ల కృష్ణ గారి పేరుతో పాటు ఆయన కుటుంబం గురించి కూడా వార్తల్లో రావడంతో కృష్ణ కుటుంబ పరువు పోతుందని భావించి నరేష్ ను మందలించడమే కాకుండా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నరేష్ పై కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారనేది మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Naresh -Pavithra: ఓకే రూమ్ లో ఉండి మాట్లాడిన నరేష్ పవిత్ర.. ఇదే సాక్ష్యం అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Naresh -Pavithra: నటి పవిత్ర లోకేష్ నరేష్ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో సీన్లోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ ఈమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

Naresh -Pavithra: ఓకే రూమ్ లో ఉండి మాట్లాడిన నరేష్ పవిత్ర.. ఇదే సాక్ష్యం అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

ఇకపోతే నరేష్ రమ్య పవిత్ర లోకేష్ మధ్య వ్యవహారం తీవ్ర స్థాయిలో ముదిరిపోయింది. మాటలతోనే కాకుండా ఏకంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇకపోతే మైసూర్ లో ఒక హోటల్లో నరేష్ పవిత్ర లోకేష్ ను రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక రమ్య మీడియా సమావేశంలో భాగంగా నరేష్, పవిత్ర గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Naresh -Pavithra: ఓకే రూమ్ లో ఉండి మాట్లాడిన నరేష్ పవిత్ర.. ఇదే సాక్ష్యం అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

ఈ క్రమంలోనే రమ్య చేస్తున్న వ్యాఖ్యలపై నరేష్ పవిత్ర లోకేష్ స్పందిస్తూ రెండు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలు వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియోలపై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ చేస్తూ… సినిమా డైలాగ్స్ వాడుతూ… ట్రోలర్స్ భయంంకరంగా  ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు.

వీడియోలతో మరోసారి వార్తల్లో నిలిచిన నరేష్ పవిత్ర లోకేష్…

పవిత్ర నరేష్ ఇద్దరు ఓకే గదిలో ఉండి ఈ వీడియోలు సపరేట్ గా చేశారని, వీరు షేర్ చేసిన వీడియోలలో ఒకటే బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ నెటిజన్లు ఈ విషయాన్ని గుర్తించి ట్రోల్ చేస్తున్నారు. వీరీ బ్యాగ్రౌండ్ మాత్రమే కాకుండా వీరిద్దరూ, ఓకే సోఫాలో కూర్చుని వీడియోలు చేశారని, రెండు వీడియోలలో ఒకే సోఫా ఉందంటూ నెటిజన్ లు వీరిపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Ramya Raghupathi: నరేష్ పవిత్ర గురించి శపథాలు చేస్తున్న రమ్య.. ఎలా కలిసి ఉంటారో నేను చుస్తానంటూ కామెంట్స్!

Ramya Raghupathi: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే కన్నడ చిత్ర పరిశ్రమలోనూ నటి పవిత్ర లోకేష్, నరేష్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రమ్య నరేష్ మూడవ భార్య అయితే ఎనిమిది సంవత్సరాల క్రితమే పలుగొడవల కారణంగా రమ్య నరేష్ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఈ విధంగా తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ వీరిద్దరికీ విడాకులు మాత్రం కాలేదు.

Ramya Raghupathi: నరేష్ పవిత్ర గురించి శపథాలు చేస్తున్న రమ్య.. ఎలా కలిసి ఉంటారో నేను చుస్తానంటూ కామెంట్స్!

ఈ క్రమంలోనే నరేష్ నటి పవిత్ర లోకేష్ తో ఎంతో చనువుగా ఉన్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది.

Ramya Raghupathi: నరేష్ పవిత్ర గురించి శపథాలు చేస్తున్న రమ్య.. ఎలా కలిసి ఉంటారో నేను చుస్తానంటూ కామెంట్స్!

ఇప్పటివరకు వీటి మధ్య మాటల యుద్ధం జరిగినా,ఆదివారం నరేష్ పవిత్ర మైసూర్ లోని ఒక రెస్టారెంట్లో అడ్డంగా రమ్య చేతికి దొరికిపోయారు. ఇలా రెస్టారెంట్లో వీరిద్దరిని చూసిన రమ్య ఆగ్రహంతో ఊగిపోయి ఏకంగా వారిపై చెప్పుతో దాడికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోని ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

నరేష్ పవిత్ర జంటకు అండగా నిలిచిన పోలీసులు…

వీరి వ్యవహారం గురించి రమ్య మాట్లాడుతూ.. తాను ఇంకా నరేష్ నుంచి విడాకులు తీసుకోలేదని, అలా నేను విడాకులు తీసుకోకుండా నే నరేష్ మరుగు మహిళతో ఎలా తిరుగుతారు? నేను ఆయనకు విడాకులు ఇవ్వడం అందరి ముందు అతనిని వివాహం చేసుకున్నాను, ఇలా విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ నరేష్ తో తిరగడం భవ్యం కాదంటూ మండి పడ్డారు. అదేవిధంగా వీరికి పోలీసులు కూడా అండగా నిలబడడం ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తా..అంటూ నరేష్ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తూ శపథాలు చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actor Naresh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్ ఉంది.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: నటుడు నరేష్ వ్యక్తిగత విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నరేష్ ప్రగతి విషయం హాట్ టాపిక్ గా మారింది. నరేష్ ప్రగతి సహజీవనం చేస్తున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Naresh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్ ఉంది.. నరేష్ కామెంట్స్ వైరల్!

రమ్య తన భర్తతో ఇంకా విడాకులు కాలేదని, తనకు నరేష్ కి మధ్య గొడవలు రావడానికి కారణం పవిత్ర లోకేష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రమ్య చేసిన వ్యాఖ్యలపై నరేష్ స్పందిస్తూ అసలు విషయం ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా నరేష్ స్పందిస్తూ రమ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Naresh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్ ఉంది.. నరేష్ కామెంట్స్ వైరల్!

రమ్య ఏనాడు తనకు భార్యగా వ్యవహరించలేదని, ఒకరోజు ఇంట్లో ఫంక్షన్ జరిగితే రమ్య ఏకంగా మేల్ క్యాబర్ డాన్సర్లు పిలిపించుకుందని నరేష్ వెల్లడించారు. అదేవిధంగా చెప్పుకోవడానికి అభ్యంతరకరంగా ఉండేలా తను ప్రవర్తించేదని, రమ్య తన కార్ డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందని ఈ సందర్భంగా నరేష్ తన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిస్థితి చేయి దాటిపోవడంతోనే విడాకులు….

రమ్య ఇలాంటి పనులు చేస్తూ ఉండగా,ఇదేంటని అడిగితే ఏవేవో చెత్త వివరణలు ఇచ్చింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో తనకు విడాకుల నోటీసులు పంపానని నరేష్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం నరేష్ రమ్య గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై రమ్య స్పందన ఏవిధంగా ఉంటుందో తెలియాల్సి ఉంటుంది.

Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలం నుంచి పెళ్లి విడాకులు సహజీవనం అంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇక ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆ పెళ్లిళ్లు కాస్త పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?

ఇక వీరి గురించి వస్తున్న ఈ వార్తలపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ మీ ఇద్దరి సహజీవనానికి కృష్ణ ఫ్యామిలీ అనుమతి కూడా ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించారు. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో నరేష్ మూడో భార్య రమ్య ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేష్ ఇప్పటికీ తన భర్త అని స్పష్టం చేశారు. ఇంకా మా ఇద్దరికీ విడాకులు రాలేదని రమ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actor Naresh: నేనింకా ఆయనకు విడాకులు ఇవ్వలేదు.. నరేష్ మూడవ భార్య రమ్య కామెంట్స్ వైరల్?

నటుడు నరేష్ తో తనకి ఇంకా సంబంధం తెగిపోలేదని మా ఇద్దరికీ ఇంకా విడాకులు రాలేదని,తాను ఇప్పటికీ విడాకుల పేపర్లపై సంతకం పెట్టలేదు కనుక తను నా భర్త అని చెప్పుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని రమ్య వెల్లడించారు. ఇకపోతే పవిత్ర లోకేష్ రమ్య గురించి కూడా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తను నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తన కుటుంబం గురించి తాను చూసుకుంటే మంచిదని తెలిపారు.

తను ఇప్పటికీ నా భర్త..

తను రఘువీరా రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తాను ఎప్పుడు కూడా తన కుటుంబం గురించి ఎక్కడ ప్రస్తావించలేదని ఈ సందర్భంగా రమ్య నరేష్ తో ఉన్న బంధం గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక రమ్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్య వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.