Tag Archives: akhil

Upasana: అఖిల్ పనికి తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాసన… అందుకే ఆ ఫ్యామిలీని దూరం పెట్టారా?

Upasana: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో భార్యగా, మెగా కోడలుగా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఉపాసన ఏ విషయం గురించి మాట్లాడినా ఆచితూచి అడుగులు వేస్తూ మాట్లాడుతుంటారు. ఇలా ఎంతో బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించే ఉపవాసన అక్కినేని అఖిల్ విషయంలో మాత్రం చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది.

అసలు అఖిల్ పై ఉపాసనకు కోపం ఏంటి ఎందుకు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే విషయానికి వస్తే… అఖిల్ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. ఇక వీరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది.అయితే కొన్ని కారణాలవల్ల వీరి నిశ్చితార్థం ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా శ్రియ భూపాల్ తో అఖిల్ నిశ్చితార్థం బ్రేకప్ కావడానికి గల కారణం అఖిల్ అని తెలుస్తుంది. ఆయనకున్న హెడ్ వెయిట్ కారణంగా శ్రియ భూపాల్ తో పెద్ద ఎత్తున గొడవ పెట్టుకున్నారని అందుకే ఈ నిశ్చితార్థం ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థం ఆగిపోవడంతో కుటుంబ పరువు మొత్తం పోయిందని ఉపాసన పెద్ద ఎత్తున అఖిల్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

Upasana: ఉపాసన కజిన్ సిస్టర్…

వీరినిచ్చితార్థం ఆగిపోతే ఉపాసన కుటుంబ పరువు పోతుందని ఎందుకు బాధపడాలి అనే విషయానికి వస్తే అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నటువంటి శ్రియ భూపాల్ మరెవరో కాదు స్వయంగా ఉపాసన కజిన్ సిస్టర్. ఇలా ఉపాసన కజిన్ సిస్టర్ పట్ల అఖిల్ వ్యవహరించిన తీరు వల్ల ఆమె విసుగు చెందారని అందుకే అఖిల్ అంటే ఉపాసనకు ఏ మాత్రం పడదని తెలుస్తుంది. కేవలం అఖిల్ మాత్రమే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా ఉపాసన దూరం పెట్టారని తెలుస్తోంది.ఇక శ్రీయ భూపాల్, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఉపాసన సీమంతపు వేడుకలలో కూడా శ్రీయ భూపాల్ పెద్ద ఎత్తున హంగామా చేశారు.

Akhil: రెమ్యూనరేషన్ లేకుండానే అఖిల్ ఏజెంట్ సినిమాలో నటించారా…. అసలు విషయం చెప్పిన ప్రొడ్యూసర్!

Akhil: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మొదట ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయటానికి ప్రయత్నాలు చేశారు . కానీ కొన్ని కారణాలవల్ల ప్రస్తుతం కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఏజెంట్ సినిమాకి అఖిల్ రెమ్యూనరేషన్ గురించి నిర్మాత అనిల్‌ సుంకర అసలు విషయం బయట పెట్టాడు. 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమాకి అఖిల్ రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పనిచేసినట్లు నిర్మాత అనిల్ సుంకర వెల్లడించాడు. ఎందుకంటే ఏజెంట్ సినిమా నిర్మాణంలో అఖిల్ తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా భాగమయ్యారని, ఆయన మొదట్నుంచి భాగస్వామిగానే ఉన్నారని అనిల్ సుంకర తెలిపారు.

ఏజెంట్ కోసం పనిచేసిన అందరు వాళ్ల మొత్తం పారితోషికం తీసుకుంటే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉంటుందని ఆయన తెలిపాడు.ఇలా ఏజెంట్ కోసం అఖిల్, సురేందర్ రెడ్డి ఇద్దరు కూడా పారితోషికం తీసుకోకుండా తన పారితోషికాన్ని ప్రొడక్షన్‌ రూపంలో వదులుకున్నారని తెలిపారు. .అఖిల్‌, సురేందర్‌రెడ్డి పారితోషికం తీసుకోకుండానే ఈ సినిమాకి పనిచేసినట్లు అనిల్ సుంకర పరోక్షంగా తెలిపాడు.

Akhil: ఏజెంట్ నిర్మాణంలో భాగమైన అఖిల్….

ఇప్పటివరకు అఖిల్ కి సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ అనిల్ అఖిల్ తో ఇలా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా చేయటం రిస్క్ తో కూడుకున్న పని. అయితే యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న కథ కావడంతో సినిమా నెమ్మదిగా పాన్‌ ఇండియా రేంజ్‌లో రీచ్‌ అవుతుందని నమ్మకం ఉండటంతో ఈ బడ్జెట్‌ పెద్ద సమస్య కాదని, థియేట్రికల్‌గా, డిజిటల్‌ పరంగా సినిమా సేఫ్‌లోనే ఉంటామని మేకర్స్ భావించి బడ్జేట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తోంది.

Nagarjuna: ఆ క్షణం అఖిల్ వల్ల అమల చాలా ఇబ్బంది పడింది… నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna: అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కినేని నాగార్జున వారసుడిగా ‘ అఖిల్ ‘ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోలేదు. ఇక ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏప్రిల్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. వరంగల్‌లోని రంగలీలా మైదానంలో ఏజెంట్ ప్రీ రీలిజ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్‌‌గా వచ్చారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ..” ‘అఖిల్‌ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, తను వాళ్లమ్మ కడుపులో ఉండగానే.. తన ఎనర్జీ లెవల్స్‌ ఏంటో మాకు చూపించాడని తెలిపాడు. అఖిల్ కి 8 నెలల వయసు ఉన్నపుడే విపరీతమైన ఎనర్జీ ఉండేదని.. పడుకోకుండా ఎప్పుడూ పరుగెత్తుతూ ఉండేవాడు. దాంతో మేం కంగారు పడి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. ఆయన అఖిల్‌ను సాయిల్ మీద పడుకోబెట్టమని సలహా ఇచ్చారు.

Nagarjuna: అఖిల్ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకి తీశారు…

అలా తనలోని ఎనర్జీని బయటకు లాగాలని డాక్టర్ సూచించారని నాగర్జున తెలిపాడు. ఈ సినిమాలో కూడా అఖిల్ ఎనర్జీని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అలానే బయటకు తీశారు అంటూ అఖిల్ ఎనర్జీ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇలా అఖిల్ గురించి నాగార్జున చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Akhil: నాగచైతన్య – శోభిత రిలేషన్ పై రియాక్ట్ అయిన అఖిల్ …. ఏమన్నారో తెలుసా?

Akhil: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పటినుండి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అఖిల్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోగా గుర్తింపు పొందటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్ సినిమా ద్వారా హీరోగా మారిన అఖిల్ మొదటి సినిమాతోనే పరాజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత అఖిల్ నటించిన సినిమాలు చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక ప్రస్తుతం అఖిల్ ఆశలు అన్ని ఏజెంట్ సినిమా పైనే పెట్టుకున్నాడు.
అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న అఖిల్ ఏజెంట్ సినిమా విశేషాల గురించి మీడియాతో పంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఈ ప్రెస్ మీట్ లో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల రిలేషన్ గురించి ప్రశ్న ఎదురవగా అఖిల్ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సమావేశంలో..” మీ అన్నయ్య అఖిల్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు. ఫోటోలో ఒక అమ్మాయితో కనిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. మరి మీ పరిస్థితి ఏంటి? ఒక విలేఖరి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు అఖిల్ స్పందిస్తూ..” ప్రస్తుతం నా పరిస్థితి విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలుగా నా జుట్టు వాడిని మెయింటైన్ చేయటానికి టైం సరిపోవటం లేదు.

Akhil: సినిమాల పైనే నా దృష్టి


ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల పైనే అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే నాగచైతన్య శోభిత ధూళిపాల రిలేషన్ గురించి అఖిల్ స్పందించకపోవడం గమనార్హం. సమంతతో విడిపోయిన తర్వాత శోభిత తో నాగచైతన్య రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఇటు నాగచైతన్య అటు శోభిత కూడా స్పందించలేదు. దీంతో ఈ వార్తలు నిజమేనంటూ కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Akkineni Family: ఒకేసారి అక్కినేని కుటుంబంలో జరుగునున్న మూడు పెళ్లిళ్లు… స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న నాగార్జున!

Akkineni Family: ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. ఇక అక్కినేని వారసుల సినీ కెరియర్ గురించి పక్కన పెడితే వీరి వ్యక్తిగత విషయానికి వస్తే అక్కినేని కుటుంబంలో ఎక్కువగా విడాకుల కథనాలు మనకు వినపడుతుంటాయి.

నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని తనకు విడాకులు ఇచ్చి తిరిగి నటి అమలను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈయన పెద్ద కుమారుడు నాగచైతన్య కూడా సమంతను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు. చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం జరుపుకొని బ్రేకప్ చెప్పుకున్నారు.ఇక అల్లుడు సుమంత్ సైతం కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్నారు. ఇక మేనకోడలు సుప్రియ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుంటున్నారు.

ఇలా అక్కినేని ఫ్యామిలీలో విడాకులు తీసుకున్నటువంటి వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే వీరి విషయంలో నాగార్జున స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది నెలల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో వరుసగా మూడు పెళ్లిళ్లు జరగబోతున్నాయని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే విడాకులు ఇచ్చిన తన పెద్ద కుమారుడు నాగచైతన్య తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయడానికి నాగార్జున సిద్ధంగా ఉన్నారని సమాచారం.


Akkineni Family:మూడు పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్న నాగ్…

ఇక అఖిల్ కిసైతం విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లి చేయడానికి నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మేనకోడలు సుప్రియ నటుడు అడవి శేష్ తో రిలేషన్ లో ఉన్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ ఏడాదిలోనే ఈ ముగ్గురు పెళ్లిళ్లు చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

Niharika -Akhil: నిహారిక అఖిల్ జంటగా ఓ షార్ట్ ఫిలింలో నటించారని మీకు తెలుసా?

Niharika -Akhil: మెగా డాటర్ నిహారిక అక్కినేని వారసుడు అఖిల్ గురించి అందరికీ సుపరిచితమే ఇద్దరు కూడా భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి సెలబ్రిటీలే. అయితే అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నిహారిక సైతం పలు సినిమాలలో నటించిన హీరోయిన్ గా గుర్తింపు రాకపోవడంతో ఈమె వెబ్ సిరీస్ లలో నటిస్తూ వాటిని నిర్మిస్తూ నిర్మాతగా స్థిరపడ్డారు.

ఇక అఖిల్ ఇండస్ట్రీకి అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈయన ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అఖిల్ అనిల్ సుంకర నిర్మాణంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుందని చెప్పినప్పటికీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని తెలుస్తుంది.

ఇకపోతే నిహారిక అఖిల్ విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి ఒక షార్ట్ ఫిలిం లో నటించారని విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అఖిల్ తన మొదటి సినిమా అఖిల్ సినిమాలో నటించక ముందే నిహారికతో కలిసి ఒక షార్ట్ ఫిలింలో నటించారని సమాచారం ఇక ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న వారికి తప్ప ఎవరికీ తెలియదు.తాజాగా ఒక కుకింగ్ షోలో పాల్గొన్నటువంటి నిహారిక ఈ విషయాన్ని తెలియజేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది.

Niharika -Akhil: డబ్బు కన్నా పరువే ముఖ్యం…

ఇకపోతే ఈ షార్ట్ ఫిలిం విడుదలకు నోచుకోలేదంటూ నిహారిక షాక్ ఇచ్చారు. తమకు డబ్బు కన్నా పరువే ముఖ్యమని అందుకే ఈ షార్ట్ ఫిలిం విడుదల చేయలేదంటూ నిహారిక తెలియజేశారు.అయితే నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఎంతో బిజీగా మారారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం విడుదల చేస్తే తప్పకుండా మంచి వ్యూస్ రాబడుతుందని అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Nagarjuna: అమల నటన చూసి కంటతడి పెట్టుకున్న నాగార్జున.. సెంటిమెంట్ ను పండించిన అమల!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్యగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే. వివాహానికి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఇలా కుటుంబ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అమల చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె తాజాగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో సందడి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న అమల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమా 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో పలువురు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ చూడటానికి నాగార్జున, అఖిల్, అమల, డైరెక్టర్ హను రాఘవపూడి, చందు మొండేటి వంటి ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.

Nagarjuna: అమల నటనకు ఎమోషనల్ అయిన అఖిల్..

ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల ఎంతో అద్భుతంగా నటించిందని ఈమె తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా సినిమా చేశారంటూ ఈయన చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఇక మదర్ సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఈ సినిమా చూసిన అఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని,ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా నాగార్జున సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు.

Prabhas: ప్రభాస్ అన్నతో చాలా కష్టం.. వద్దన్నా వదిలిపెట్టడు అఖిల్ కామెంట్స్ వైరల్!

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ చిత్ర బృందానికి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ తో పాటు నటించిన ఎంతోమంది నటీనటులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ ఫుడీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తినడమే కాకుండా అందరికీ అలాంటి భోజనమే పెడతారంటే ఎంతో మంది ప్రభాస్ ఆతిథ్యం గురించి వెల్లడించారు.

తాజాగా ప్రభాస్ ఏర్పాటు చేసే విందు గురించి అమల శర్వానంద్ అఖిల్ ముచ్చటించారు.శర్వానంద్ అమల నటించినటువంటి ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్ 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అఖిల్ కలిసి ఈ ముగ్గురు అమ్మ చేతి వంట అనే ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రస్తావన వచ్చింది.

ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి అఖిల్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభాస్ అన్నాను కలిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పగా వెంటనే శర్వానంద్ అవును అంటూ తనకు వత్తాసు పలికారు. ఈ క్రమంలోనే అఖిల్ మాట్లాడుతూ ప్రభాస్ అన్న వద్దు బాబోయ్ అని మొరపెట్టుకున్న ఆయన మాత్రం తినేవరకు వదిలిపెట్టరు అంటూ అఖిల్ అమలకు చెప్పుకొచ్చారు.

Prabhas: ప్రభాస్ తో విందు భోజనం అంటే అట్లుంటది మరి…

ఇలా ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదల కాగా అఖిల్ ప్రభాస్ ఆదిత్యం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఖిల్ మాత్రమే కాకుండా ఇదివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇలా అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు అట్లుంటది మరి మా హీరోతో అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Nagarjuna: నేను స్టార్ హీరో అయ్యాను అంటే కారణం వాళ్లే.. కింగ్ నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని వారసుడిగా ఎనిమిది నెలల వయసులోనే వెలుగునీడలు అనే సినిమాలో కెమెరా ముందుకు వచ్చారు. నాగేశ్వరరావు నటించిన ఈ సినిమాలో నాగార్జున బాల నటుడిగా నటించారు. అనంతరం సుడిగుండాలు అనే సినిమాలో కూడా ఈయన బాలనటుడిగా నటించి సందడి చేశారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో బాలనటుడిగా మెప్పించిన ఈయన అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలలో నటించి మెప్పించారు. అన్ని జానర్లలో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో నాగార్జున ఒకరు.ఇకపోతే ఈయన హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో అతిథి పాత్రలో నటించారు అయితే ఈయన అతిథి పాత్రలో నటించిన సినిమాలు కూడా మంచి హిట్ కావడం విశేషం.

నాగార్జున త్రిమూర్తులు, రావుగారిల్లు, ఘటోత్కచుడు, నిన్నే ప్రేమిస్తా, స్టైల్, తకిట తకిట, దొంగాట, అధిపతి, అఖిల్, సైజ్ జీరో, ప్రేమమ్ సినిమాలలో గెస్ట్ రోల్స్ లో మెప్పించారు.ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించడమే కాకుండా పలు సినిమాలలో అతిథి పాత్రలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్న క్రెడిట్ నాగార్జునకి దక్కిందని చెప్పాలి. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున తన కెరీర్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

Nagarjuna: డైరెక్టర్లే కారణమా…

తాను స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు గల కారణం తన డైరెక్టర్లేనని ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు.డైరెక్టర్లు ఎంతో విభిన్నమైన కథలను సిద్ధం చేసి తన పాత్రలను భిన్నంగా చూపించడం వల్లే తాను మంచి విజయాలను అందుకొని ఈ స్థాయిలో ఉన్నానని నాగార్జున ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈయన ప్రస్తుతం ది ఘోస్ట్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.

 

Aadi -Akhil: ఢీ 14 కోసం హైపర్ ఆది, అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Aadi -Akhil: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఢీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ కొనసాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, అఖిల్, నవ్యస్వామి, రవి కృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

ఇక ఢీకార్యక్రమంలో మెంటర్ గా ఉన్నటువంటి హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఒక కాల్ షీట్ కి ఏకంగా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈయన జడ్జెస్ తో పాటుగా ఈ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.

Aadi -Akhil: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అఖిల్…

ఇకపోతే ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సైతం మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అఖిల్ ఈ కార్యక్రమంలో కొనసాగుతూ కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. సాధారణంగా ఒకసారి మల్లెమాల వారి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిని తిరిగి తీసుకోరు. కానీ అఖిల్ మాత్రం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి బిగ్ బాస్ లో పాల్గొని, తిరిగి ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అఖిల్ ఒక వారానికి సుమారు రెండున్నర లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక్కో కాల్ షీట్ కి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.