Tag Archives: Alekhya Reddy

Alekhya Reddy: తండ్రిని తలుచుకున్న తారకరత్న కుమార్తె… ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి!

Alekhya: నందమూరి తారకరత్న గత ఏడాది జనవరి 27వ తేదీ గుండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర సందర్భంగా ఈయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులో దాదాపు 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.

ఇలా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తారకరత్న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తారక రత్న మరణ వార్త నుంచి అభిమానులు కుటుంబ సభ్యులు ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అలేఖ్య రెడ్డి తరచూ తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి.

ఇకపోతే తాజాగా అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు ఇందులో భాగంగా తన పిల్లలు తన తండ్రి ఫోటో వద్దకు వెళ్లి ఆయనని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అలేఖ్య రెడ్డి షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో విజయ సాయి రెడ్డి రావడంతో పిల్లలు ముగ్గురు వెళ్లి తనని హత్తుకున్నారు.

ప్రేమ వివాహం…

ఇక తారకరత్న అలేఖ్య రెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడంతో నందమూరి కుటుంబం తనని ఇంటికి దూరం చేశారు. ఇలా భర్తనే సర్వసరంగా బతుకుతున్నటువంటి అలేఖ్య రెడ్డి భర్త మరణంతో ఒక్కసారిగా కృంగిపోయారు. ఇప్పటికీ ఈమె తరుచూ తన భర్త లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Alekhya Reddy: తారకరత్నను తలుచుకొని ఎమోషనల్ అయినా అలేఖ్య రెడ్డి… ఆనంద సమయంలో మీరు లేరంటూ?

Alekhya Reddy: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు హాస్పిటల్లో మరణంతో పోరాడుతూ చివరికి మృతి కౌగిలిలో బంధి అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే తారకరత్న మరణించి ఇన్ని నెలలు అవుతున్న తన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఈ బాధ నుంచి బయటపడలేదు.

తరచూ ఈమె తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఇలా తారకరత్న మరణించిన సమయంలో అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రేమించిన వాడిని కుటుంబ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని తనతో పాటు వచ్చినటువంటి అలేఖ్య రెడ్డికి తారకరత్న దూరం అవడంతో ఈ నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

ఇలా తరచూ తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు అయితే నేడు మరోసారి తారకరత్నను తలుచుకొని ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది ఇకపోతే నేడు తారకరత్న కవల పిల్లలు అయినటువంటి తాన్యారామ్ , రేయా ల పుట్టినరోజు. దీంతో బాగోద్వేగమైన ఒక పోస్టును షేర్ చేశారు.

Alekhya Reddy: ఇంద్రధనస్సు కంటే నువ్వే అందంగా ఉంటావు…


ముందుగా తన పెద్ద కుమార్తె తన తండ్రికి పువ్వులు పెడుతుండగా ఇద్దరు చిన్నారులు తనకు సహాయం చేస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఆనంద సమయంలో మీరు మాతో లేరు కానీ పిల్లల ముఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. వర్షం కురిసే రోజు ఇంద్రధనస్సు కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ప్రొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము.. మా ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను పెట్టింపు చేయాలని కోరుకుంటున్నాము. అద్భుతమైన మన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Tarakaratna: ఇంకా భర్త జ్ఞాపకాలలోనే అలేఖ్య రెడ్డి… తండ్రి కొడుకుల ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్!

Tarakaratna: నందమూరి తారక రత్న నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనకు తెలిసిందే. ఇలా గుండెపోటుకి గురైనటువంటి ఈయన బెంగుళూరు నారాయణ హృదయాలయాలో దాదాపు 23 రోజుల పాటు మృత్యులతో పోరాడి చివరికి మృత్యువు కౌగిలిలో బందీ అయ్యారు. ఈ విధంగా ఫిబ్రవరి 18వ తేదీ తారకరత్న మరణించారు. తారకరత్న మరణించి దాదాపు 6 నెలలు అవుతుంది.

ఈ విధంగా తారకరత్న మరణించి ఇన్ని నెలలు అవుతున్నప్పటికీ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి మాత్రం తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. తన భర్తను తలుచుకుంటూ తనతో గడిపిన ఆ క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా తారకరత్న గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇందులో తారకరత్న ఫోటోతో పాటు తన కుమారుడు తనయ్ రామ్ ఫోటోని కూడా షేర్ చేశారు. తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమా లుక్ కి సంబంధించిన ఫోటోతో పాటు ప్రస్తుతం తన కుమారుడు తనయ్ రామ్ ఫోటోని కూడా ఈమె షేర్ చేస్తూ లైక్ ఫాదర్ లైక్ సన్ అంటూ కామెంట్ చేశారు.

Tarakaratna: ఎమోషనల్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్…


ఇలా ఈ ఫోటోలలో తారకరత్న తనయ్ రామ్ ఇద్దరు ఒకే పోలికలతో ఉండడంతో ఈ ఫోటో చూసినటువంటి నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిస్ యు సో మచ్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tarakaratna: తారకరత్న మరణించి 100 రోజులు… వైరల్ అవుతున్న అలేఖ్య రెడ్డి పోస్ట్..?

Tarakaratna: నందమూరి వారసుడు నందమూరి తారక రత్న మూడు నెలల క్రితం మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటు రావటం వల్ల 23 రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తారకరత్న మరణం నందమూరి కుటుంబంతో పాటు సినిమా ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదాన్ని మిగిలింది. ముఖ్యంగా తారకరత్న మరణాన్ని ఆయన భార్య అలేఖ్యరెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.

తారకరత్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి ఇలా అనూహ్య పరిణామాల వల్ల తారకరత్న మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికి తారకరత్నని తలుచుకుంటూ సోషల్ మీడియాలో తరచూ ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా అలేఖ్య రెడ్డి షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తారకరత్న మరణించి 100 రోజుల సందర్భంగా భర్తని తలుచుకుంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

ఈ క్రమంలో వేర్వేరు టాటూలకు సంబంధించిన ఫోటోలను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా తారకరత్నని తలచుకుంటూ తన ” ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన ఏ ఘటనకు కూడా నేను ప్రిపేర్ గా లేనని ఆమె తెలిపింది.
తారకరత్న మరణం మరచిపోలేకపోకపోతున్నాను. తారకరత్న మరణం వల్ల తన హృదయం ఇప్పటికీ దుఃఖిస్తోందని తెలిపింది .

Tarakaratna: బాధలకు అలవాటు పడ్డాను…


నువ్వు మరణించావని, ఇక జీవితంలో తిరిగి రావని నాకు తెలుసు. నా జీవితంలో వచ్చినా తేడా ఏంటంటే.. నేను ఇప్పుడు బాధకు బాగా అలవాటు పడ్డాను అంటూ అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. నువ్వూ మమ్మల్ని వదిలేసి వెళ్ళినా మా హృదయాలను మాత్రం వదిలి వెళ్ళలేవు అంటూ కన్నీరు పెట్టుకుంది. అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Alekhya Reddy: భర్త చివరి కోరిక తీర్చనున్న అలేఖ్య రెడ్డి…. గుడివాడ ఎన్నికల బరిలో అలేఖ్య!

Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య ఒంటరైన విషయం మనకు తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో నందమూరి కుటుంబం తారకరత్నను ఇంటికి దూరంగా ఉంచారు. ఈ క్రమంలోనే తారకరత్న తన భార్య అలేఖ్య ముగ్గురు పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవారు అయితే తారకరత్న గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా తారకరత్న మరణంతో అలేఖ్య ఎంతో కృంగిపోయారు. తన భర్తను తలుచుకుంటూ తన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ బాధను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా అలేఖ్యకు సంబంధించిన ఓ వార్త సినీ రాజకీయ రంగాలలో తీవ్ర చర్చలకు కారణమైంది. అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికలలో గుడివాడ ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తారకరత్న సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా రాజకీయాలలో కొనసాగాలని భావించారు. ఈ క్రమంలోని గుడివాడ నుంచి తాను పోటీ చేయాలనే నిర్ణయించుకున్నారట అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే తారకరత్న అనుకోకుండా గుండెపోటుకి గురై మరణించడంతో ఆ కోరిక అలాగనే ఉండిపోయిందట.

Alekhya Reddy: ఎమ్మెల్యే అభ్యర్థిగా అలేఖ్య రెడ్డి…


ఈ క్రమంలోనే తన భర్త చివరి కోరికను తీర్చడం కోసం అలేఖ్య రెడ్డి ఎన్నికల బరిలో దిగబోతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే అలేఖ్యను గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చంద్రబాబునాయుడు ఏ విధంగాను అధికారిక ప్రకటన తెలియజేయలేదు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Alekhya Reddy: చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పోస్ట్ వైరల్!

Alekhya Reddy: నందమూరి వారసుడు నందమూరి తారక రత్న ఇటీవల మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న తారకరత్న టిడిపి తరఫున పోటీ చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రకి మద్దతుగా యువగళం పాదయాత్రలో పాల్గొని మొదటి రోజే గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులో చికిత్స తీసుకుంటూ ప్రాణాలతో పోరాడిన తారకరత్న చివరికి తుది శ్వాస విడిచాడు.

తారకరత్న మరణం ఆయన భార్య ఆలేఖ రెడ్డికి తీరని లోటుని మిగిల్చింది. తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డి జీవితం శూన్యంలో మారిపోయింది. ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న వీరిద్దరిని ఇరు కుటుంబాలు దూరం పెట్టాయి. ఈ క్రమంలో అందరి ప్రేమాభిమానాలకు దూరమైన వీరిద్దరూ ఒకరికి ఒకరు ప్రాణంగా జీవించారు. అయితే తారకరత్న హఠాత్మరణంతో అలేఖ్య రెడ్డి జీవితంలో శూన్యం మిగిలింది.

తారకరత్న ఈ లోకంలో లేడనే విషయాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతోంది . ఈ క్రమంలో తరచూ తారకరత్ననే తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. తారకరత్నని తలుచుకుంటూ భర్త మీద తనకి ఉన్న ప్రేమని అలేఖ్య తెలియజేస్తూ పోస్ట్ షేర్ చేసింది.

Alekhya Reddy: ఈ జన్మకు నా జీవితం ఇంతే…

ఈ క్రమంలో ” ఈ జన్మకు నువ్వే నా ప్రపంచం..నా జీవితం అంతా నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా…నా శ్వాస ఉన్నంత వరకు కూడా నిన్నే ప్రేమిస్తుంటాను ” అని అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తారకరత్న తో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్నని తలచుకుంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అంతే కాకుండా అలేఖ్య రెడ్డికి కూడా ధైర్యం చెబుతున్నారు.

Tarakaratna Wife: ఒక్క క్షణం కూడా మర్చిపోలేను ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి.. వీడియో వైరల్!

Tarakaratna Wife: నందమూరి తారకరత్న మరణ వార్త ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురై దాదాపు 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే..

ఇలా ఈయన మరణించి దాదాపు రెండు నెలలు అవుతున్న ఇప్పటికీ ఈయన మరణ వార్త నుంచి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కోలుకోలేదని తెలుస్తుంది. తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మధ్యలోనే వదిలి వెళ్లిపోవడంతో ఈమె ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

ఇలా తన భర్త మరణంతో ఎంతో కృంగిపోతున్న అలేఖ్య రెడ్డి తరచు సోషల్ మీడియా వేదికగా తన భర్తతో తనకు ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న గురించి ఎన్నో విషయాలను తెలియచేసిన అలేఖ్య రెడ్డి తాజాగా తన భర్త తన పిల్లలతో ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ కు సంబంధించిన వీడియో షేర్ చేశారు.

Tarakaratna Wife: ఈ బాధ నుంచి బయటపడాలి…


ఇక ఈ వీడియోని ఈమె షేర్ చేస్తూ నిన్ను గుర్తు చేసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇలా ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై ఎంతోమంది స్పందిస్తూ తొందరగా మీరు ఈ బాధ నుంచి బయటపడాలి అంటూ ఈమెకు ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tarakaratna Daughter: తండ్రితో కలిసి ఆడుకున్న చివరి వీడియోని షేర్ చేసిన తారకరత్న కుమార్తె… వైరల్ అవుతున్న వీడియో!

Tarakaratna Daughter: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మరణించిన విషయం మనకు తెలిసింది. అయితే ఈయన మరణించినప్పటికీ ఈయన కుటుంబ సభ్యులు తన మరణ వార్త నుంచి బయటపడలేకపోతున్నారు.కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తారకరత్న ఇలా ప్రేమించిన అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోవడంతో అలేఖ్య రెడ్డి తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

ఇలా తన భర్త జ్ఞాపకాలనుంచి బయటపడలేనటువంటి అలేఖ్య తన పెద్ద కుమార్తె నిషిక తరచూ తారకరత్న గురించి తనతో వారికి ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.తాజాగా తారకరత్న కుమార్తె నిషిక తన తండ్రితో కలిసి ఆడుకున్నటువంటి చివరి క్షణాలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న హిందూపురం వెళ్లే ముందు తనతో కలిసి వీడియో గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన వీడియోని నిషిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హిందూపురం వెళ్లడానికి ముందు తన తండ్రి తనతో కలిసి ఆడిన గేమ్ అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు.

Tarakaratna Daughter: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నిషికా…

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు మిస్ యు సో మచ్ తారక్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈయన లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో గుండెపోటుకు గురయ్యారు. ఇలా 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసింది.

Tarakaratna: బాలయ్య కొండలా అండగా నిలిచారు.. చాలా మిస్ అవుతున్నా… అలేఖ్య ఎమోషనల్ పోస్ట్!

Tarakaratna: నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. ఇలా ఈయన మరణించడంతో తన భార్య అలేఖ్యరెడ్డి ఎంతో కృంగిపోయారు. ఇక ఈయన మరణించి దాదాపు నెలరోజులు కావస్తున్న ఇంకా తన భర్త మరణం నుంచి అలేఖ్య రెడ్డి బయటపడలేదని తెలుస్తుంది.

ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి తన పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా మిగిలిపోయారు. అయితే తనకు ఎలాంటి కష్టం రాకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటానని బాలయ్య హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె బాలయ్య తన కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

బాలకృష్ణ తన ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలుతోపాటు తారకరత్న ఫోటోని కూడా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోని అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… మా కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే…మేం కష్టంలో ఉన్నప్పుడు కొండల మాకు అండగా నిలిచారు. నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు ఒక తండ్రిగా నీ వెంటే ఉన్నారు. ఇక నువ్వు ఆస్పత్రి బెడ్ పై ఉన్నప్పుడు పక్కనే కూర్చుని ఒక తల్లిలా లాలి పాడారు.

Tarakaratna: నీకోసం కన్నీళ్లు పెట్టుకున్నారు…

ఎవరు లేని సమయంలో నీకోసం ఏడ్చారు. తన సిల్లీ జోక్స్ తో నిన్ను నవ్వించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీ చివరి క్షణం వరకు ఆయన నీ వెంటే ఉన్నారు. ఓబు నువ్వు మరికొన్ని రోజులు బ్రతికి ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఈ సందర్భంగా అలేఖ్య తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Alekhya Reddy: ఇదే మా చివరి ప్రయాణం… తారకరత్నతో ఆఖరి క్షణాలను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య!

Alekhya Reddy: నందమూరి తారక రత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఇప్పటికీ ఆ విషయం నుంచి బయట పడలేకపోతున్నారు.అతి చిన్న వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో అలేఖ్య రెడ్డి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఏకధాటిగా కంటతడి పెడుతున్నారు.

ఈ క్రమంలోనే తన భర్తతో తనకు ఉన్నటువంటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె ఇదే మా చివరి ప్రయాణం ఇదే మా ఆఖరి ఫోటో అంటూ ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న మరణించడానికి కొద్ది రోజుల ముందు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు.

ఇలా స్వామివారిని దర్శించుకున్నటువంటి అలేఖ్య తారకరత్న వారి పిల్లలతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..తనతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని నేను అసలు ఊహించుకోలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటే గుండె ముక్కలవుతుంది.


Alekhya Reddy: బంగారం అని పిలిస్తే వినాలని ఉంది…

ఇదంతా ఓ కళ అయితే ఎంత బాగుంటుందో నువ్వు ఒక్కసారి అమ్మ బంగారు అంటూ పిలిస్తే వినాలని ఉంది అంటూ ఈమె తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు తొందరగా అలేఖ్య రెడ్డి ఈ బాధ నుంచి బయటపడే ధైర్యాన్ని తనకు ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరిని ఎంతగానో కలిచి వేస్తుంది.