Tag Archives: ANR

Actress Rajashree: ఆ సంఘటనతో పదేళ్లు బయటికి రాలేదు… కన్నీటి కష్టాలను బయటపెట్టిన నటి!

Actress Rajashree:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే హీరోయిన్లు ఎప్పుడో ఒకసారి ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే. అయితే కొందరి హీరోయిన్లు అవకాశాలు రాక దూరం కాగా మరికొందరు తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు సీనియర్ నటి రాజశ్రీ.

అయితే చాలా కాలం తర్వాత ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తన జీవితంలో తనకు ఎదురైన కన్నీటి కష్టాలను గురించి తెలియజేశారు.ఎన్టీఆర్ ఏఎన్నార్ కాంతారావు వంటి హీరోల సరసన నటించిన ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఆమెకు పెళ్లి చేశారు.

ఈ విధంగా హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్న తనకు హైదరాబాద్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడితో పెళ్లి జరిగిందని అలా కోడలిగా తాను ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు తనని అందరూ చాలా అదృష్టవంతురాలు అంటూ పొగిడారని ఈమె తెలియజేశారు.ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లడంతో తాను ఇండస్ట్రీ వైపు తిరిగి చూడలేదని తెలియజేశారు.

Actress Rajashree: ఒక్కసారిగా జీవితం తలకిందులైంది…

ఇలా తన జీవితం ఆనందంగా ఉంటుంది అనుకున్న సమయంలోనే తన భర్త చనిపోయారని ఇలా తన భర్త చనిపోవడంతో ఒక్కసారిగా తన జీవితం మొత్తం తలకిందులుగా మారిందని తెలిపారు.ఈ సంఘటనతో తాను దాదాపు పది సంవత్సరాలు పాటు బయట ప్రపంచమే చూడలేదని రాజశ్రీ వెల్లడించారు.ఇలా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన కన్నీటి కష్టాలను బయటపెట్టినటువంటి ఈమె ప్రస్తుతం తన పిల్లలు మనవళ్ళతో చాలా సంతోషంగా గడుపుతున్నానని తెలియజేశారు.

NTR -ANR: ఎన్టీఆర్ ఏఎన్నార్ ఇద్దరిలో ఎవరి వారసత్వం గొప్పది.. కడ వరకు ఎవరు సంతోషంగా ఉన్నారు?

NTR -ANR: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు స్వర్గీయ నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు గారి సినీ చరిత్ర ఎలాంటిదో మనకు తెలిసిందే.అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అయితే నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనకంటూ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇకపోతే గత కొద్దిరోజులుగా అక్కినేని నందమూరి వివాదం కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం పై స్పందించిన బాలకృష్ణ తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని చెప్పినప్పటికీ మరొక కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. అక్కినేని వివాదం పై స్పందించిన బాలకృష్ణ ఏఎన్ఆర్ గారు తన పిల్లలతో కన్నా నాతోనే మంచిగా ఉండేవారు ఆయనకు అక్కడ ప్రేమ లేదు అంటూ వ్యాఖ్యానించారు.

ఇలా బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలతో మరో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది దీంతో అక్కినేని ఎన్టీఆర్ వారసులలో ఎవరు వారసులు బాగా చూసుకున్నారు చివరి వరకు ఎవరు సంతోషంగా ఉన్నారనే ప్రశ్నలను తెరపైకి తీసుకువచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజులలో వరకు తన కుటుంబంతోను పిల్లలతో కలిసి సంతోషంగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చివరి క్షణాలలో ఒంటరి అయ్యి ఎంతో మానసిక క్షోభను అనుభవించారు.

NTR -ANR: చివరి క్షణాలలో మానసికక్షోభతో మరణించిన ఎన్టీఆర్…

ఏఎన్ఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరి మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయం తప్ప మరేదీ లేదని కేవలం రాజకీయాల కోసం వెన్నుపోటు పొడిచిన బావ చెంత చేరి కన్నతండ్రిని కూడా దూరం పెట్టిన ఘనత నందమూరి ఫ్యామిలీది అంటూ అక్కినేని అభిమానులు ఈ విషయం పై స్పందించారు. ఎన్టీఆర్ గారికి చివరి రోజులలో తిండి కూడా పెట్టకుండా ఆయనని ఒంటరి చేసి చాలా మానసికంగా ఇబ్బంది పెట్టారంటూ అక్కినేని అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Actress Jamuna: మూడేళ్లపాటు హీరోయిన్ జమునని బ్యాన్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్… ఎందుకో తెలుసా..?

Actress Jamuna: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అలనాటి అందాల నటి జమున గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషలలో స్టార్ హీరోల సరసన 180 కి పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జమున ఆ తర్వాత హీరోయిన్ గా మారి మంచి మంచి పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ముఖ్యంగా సత్యభామ పాత్రకు జమున పెట్టింది పేరు. సత్యభామ పాత్రలకు జమున తప్ప మరి ఏ హీరోయిన్ సెట్ అవ్వదు అనేంతగా ఆ పాత్రలో లీనమైపోయినటించేది..ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జమున గారు తన సినిమా విశేషాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరు స్టార్ హీరోలు తనని మూడు సంవత్సరాలు పాటు బ్యాన్ చేసిన విషయం కూడా వెల్లడించింది.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు మూడేళ్ల పాటు బ్యాన్‌ విధించారు. పొగరు, పెద్దలకు గౌరవం ఇవ్వదు.. లేట్‌గా వచ్చినా సారీ చెప్పదు, హీరోలకు వంగి వంగి దండాలు పెట్టదు అనే సిల్లీ రీజన్స్ వల్ల ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆమెను మూడు సంవత్సరాల పాటు వారి సినిమాలలో నటించకుండా బ్యాన్ చేశారు. ఈ క్రమంలో ఆమె గురించి వార్తాపత్రికల ద్వారా తప్పుడు ప్రచారాలు కూడా చేశారు.
అయితే జమున మాత్రం ఈ తప్పుడు ప్రచారాల గురించి ఎప్పుడూ భయపడలేదు.

Actress Jamuna:జమునకు పొగరు అని బ్యాన్ చేసిన ఎన్టీఆర్.. ఏఎన్ఆర్…

ఆ ఇద్దరు హీరోలు మూడు సంవత్సరాలు పాటు ఈమెను బ్యాన్ చేసినా కూడా మిగిలిన హీరోలు జమున గారితో నటించడానికి జమున డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఆ సమయంలో కూడా జమున చేతిలో ఐదారు సినిమాలు ఉండేవి. అయితే ఆ తర్వాత కొంతకాలానికి చక్రపాణి గారు గుండమ్మ కథ అనుకున్నప్పుడు.. ఆ సినిమాలో సరోజ పాత్రకు జమున ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. జమున ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారిని క్షమాపణలు కోరుతున్నట్లు ఒక లేక రాయమని చెప్పటంతో జమున అందుకు నిరాకరించింది. దీంతో ఓ రోజు చక్రపాణి గారు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, జమున ముగ్గురినీ కూర్చోబెట్టి అందరూ కలిసి పనిచేయండి అని మందలించారు. ఇలా గుండమ్మ కథ వారి ముగ్గురిని మళ్లీ కలిపింది.

Balakrishna: బాబాయ్ పై ప్రేమ గుండెల్లో అలాగే ఉంది.. అక్కినేని వివాదం పై స్పందించిన బాలయ్య!

Balakrishna: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలోనూ చిత్ర పరిశ్రమలోను ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే కారణమని చెప్పాలి.బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని తొక్కినేని అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇలా ఈ విషయంపై అక్కినేని వారసులు నాగచైతన్య అఖిల్ కూడా స్పందించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందించారు.

ఈ క్రమంలోనే తాజాగా హిందూపురంలో పర్యటించిన బాలయ్య అక్కినేని వివాదం పై స్పందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో ఈయన చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా వచ్చినవే కానీ ఎవరిని కించపరచాలని తాను మాట్లాడలేదని తెలిపారు.నేను ఏఎన్ఆర్ గారిని బాబాయి అంటూ ఆప్యాయంగా పిలుస్తాను తన పిల్లల కన్నా ఆయనకు నేనంటేనే చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు.

Balakrishna: ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు లాంటివారు..

తన తండ్రి ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకోగా తన బాబాయ్ ఏఎన్ఆర్ గారి నుంచి పొగడ్తలకు పొంగి పోకూడదు అనే విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారు.నాన్న చనిపోయిన తర్వాత ఆయన పేరు పై జాతీయ అవార్డును ప్రకటించడంతో ఆ అవార్డును మొదటిసారిగా ఏఎన్ఆర్ గారికి అందించామని తెలిపారు.ఆయనపై ప్రేమ ఇప్పటికీ నా గుండెల్లో అలాగే ఉంది బయట ఏం జరిగినా తనకు సంబంధం లేదని ఈ సందర్భంగా బాలకృష్ణ అక్కినేని వివాదం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Sr. NTR: బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆటలో అదరగొట్టిన సీనియర్ ఎన్టీఆర్… వైరల్ అవుతున్న వీడియో!

Sr. NTR: మనదేశంలో క్రికెట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా క్రికెట్ ఆటపై తమ అభిమానాన్ని కనపరుస్తూ ఉన్నారు.అయితే క్రికెట్ కేవలం క్రికెటర్స్ మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీల మధ్య కూడా సీసీఎల్‌ లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత 40 సంవత్సరాలుగా సెలబ్రిటీల మధ్య సీసీఎల్‌ జరిగి ఇందులో వచ్చిన డబ్బులను పలు చారిటీ ట్రస్టులకు విరాళంగా అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే 1978 సంవత్సరంలో జరిగినటువంటి సీసీఎల్‌ మ్యాచ్ కు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య ఈ లీగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు వాటి ఎంతోమంది నటులు పాల్గొన్నారు.

ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కూడా ఈ సీసీఎల్‌ లో పెద్ద ఎత్తున పోటీకి దిగారు. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ బ్యాట్ చేతబట్టి ఓ రేంజ్ లో క్రికెట్ అదరు కొట్టాడని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బౌలింగ్ వేయగా సీనియర్ ఎన్టీఆర్ తన బ్యాట్ కు పని చెప్పారు.

Sr. NTR: అమితాబ్ బౌలింగ్ కి బ్యాటింగ్ చేసిన ఎన్టీఆర్..

ఇలా ఎన్టీఆర్ ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన పరుగులు పెట్టే విషయంలో కూడా ఎన్టీఆర్ తన మేనరిజం చూపించారు.ప్రస్తుతం అప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా వీరి క్రికెట్ పై ఓ లుక్ వేసెయ్యండి.

NTR -ANR: ఎన్టీఆర్ తో ఆ హిట్ సినిమా చేయడానికి ఇష్టపడని ఏఎన్ఆర్.. చివరికి ఏమైందంటే?

NTR -ANR:తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు ఒకరు.ఈ హీరోలు విడివిడిగానే సినిమాలు చేస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేవి అలాంటిది ఈ ఇద్దరు హీరోలు కలిసిన నటించే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అప్పట్లో ఇలా మల్టీ స్టార్ సినిమాలు ఎన్నో వచ్చాయి.

ఇక ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన సినిమాలలో అప్పుచేసి పప్పు కూడు అనే సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోలు ఉన్నారు. అయితే ఒక పాత్రకు ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు మరొక పాత్రకు ఏఎన్ఆర్ ను తీసుకోవాలని ముందుగా కథ ఆయనకు చెప్పకుండా కథ మొత్తం సిద్ధం చేసిన తర్వాత ఏఎన్ఆర్ కు కబురు వెళ్ళింది.

ఈ సినిమా కథ చెప్పగానే ఏఎన్ఆర్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగా చూపించలేదు. అప్పటికే భూకైలాస సినిమా ఫలితం ఏఎన్ఆర్ మదిలో చెక్కర్లు కొడుతోంది దీంతో ఈ సినిమాలో అన్నగారిని చేయమనండి తర్వాత తాను ఒక సినిమా చేస్తానని చెప్పి ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో ఏఎన్ఆర్ నటించకపోవడంతో ఆయన స్థానంలో కొంగర జగ్గయ్యకు అవకాశం కల్పించారు.

తెలుగు తమిళంలో దుమ్ములేపిన చిత్రం…

ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలకు ఈ సినిమాలో అవకాశం కల్పించి ఈ సినిమాని నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించిన సందడి చేశారు. ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఏఎన్నార్ ఒక అద్భుతమైన సినిమాని రిజెక్ట్ చేశారని చెప్పాలి.

Hero Kathi Kantharao Sons : 400 సినిమాలలో నటించిన ఒకప్పటి స్టార్ హీరో పిల్లలు.. దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు !

Hero Kathi Kantharao Sons : సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలుగా ఓ వెలుగు వెలిగి చివరికి దీన పరిస్థితిలో మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారి చివరి రోజులలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారు.ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో నటుడు కాంతారావు ఒకరు.

ఈ విధంగా నాలుగు వందల సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఈయన పిల్లలు ప్రస్తుతం సాయం చేయాలని కోరుతున్నారు.తన తండ్రి సినిమాలలో నటిస్తూ సినిమాలపై మక్కువతో తన ఆస్తులు అన్ని అమ్మి సినిమాలు చేశారని ఇలా సినిమాలలో నష్టపోవడం వల్ల ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు.

ఒకప్పుడు తమకు మద్రాసులో పెద్ద బంగ్లాలు కూడా ఉండేవి అయితే ప్రస్తుతం తల దాచుకోవడానికి నిలువ నీడ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము అదే ఇంట్లో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తమపట్ల చొరవ చూపి ఇల్లు కేటాయించాలనీ వేడుకున్నారు.

Star Hero: ఎన్టీఆర్ ఏఎన్నార్లకు పోటీగా నటించిన కాంతారావు…

సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో జన్మించిన కాంతారావు సినిమాలపై మక్కువతో నాటకాలు వేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారికి ఏమాత్రం తీసిపోకుండా సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కాంతారావు పిల్లలు ప్రస్తుతం దీన పరిస్థితిలో ఉండి ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

Sr.NTR: ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఎన్టీఆర్ అంతలా బాధపడ్డారా.. ఎన్టీఆర్ ను కృంగదీసిన సినిమా ఏంటో తెలుసా?

Sr.NTR: సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొందరి కోసం రాసుకున్న కథలు ఆ హీరో హీరోయిన్లతో కాకుండా కొన్ని అనీవార్య కారణాలవల్ల ఇతరులతో చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా కొన్నిసార్లు కొంతమంది కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసి బాధపడిన సందర్భాల్లో ఉన్నాయి మరి కొన్నిసార్లు ఈ సినిమా చేయకపోవడమే మంచిదైందని సంతోషపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ విధంగా సీనియర్ ఎన్టీఆర్ తన సినిమా షెడ్యూల్ కారణంగా కొన్నిసార్లు కాల్ షీట్స్ లేకపోవడంతో ఎంతో అద్భుతమైన సినిమాలను మిస్ చేసుకున్నారని చెప్పాలి. ఇలా మిస్ చేసుకుని బాధపడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఏఎన్ఆర్ నటించిన భక్తతుకారం సినిమాలో నటించాల్సిన ఛాన్స్ ముందుగా ఎన్టీఆర్ కి వచ్చిన ఈయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నారట.

ఇకపోతే ఎన్టీఆర్ సినీ కెరియర్ లో శ్రీకృష్ణ పాండవీయం సినిమా ఎంతో ప్రత్యేకమైనది. ఈ సినిమాను అన్నగారే నిర్మించి ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా రావడంతో ఈ సినిమా అతనికి ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. అయితే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల చేసినప్పటికీ కలెక్షన్లపై భారీ దెబ్బ పడిందని తెలుస్తోంది.

Sr.NTR: అలా బాలీవుడ్ అవకాశాలు కోల్పోయారా..

ఈ విధంగా ఈ సినిమా కలెక్షన్ల పైతీవ్రమైన ప్రభావం చూపడంతో ఎన్టీఆర్ ఎంతో మధన పడ్డారని ఏకంగా రెండు నెలల పాటు ఈ సినిమా గురించి తనలో తానే మదనపడుతూ బాధపడ్డారని తెలుస్తోంది. ఇక ఈయన పౌరాణిక చిత్రాలు కాకుండా సాంఘిక సినిమాలలో నటించడం కోసం ఎన్టీఆర్ గారికి తన పొట్ట ఒక సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలోనే చాలామంది తన పొట్టను తగ్గించుకోవాలని సూచించారట. అయితే ఉదయం షూటింగ్ కి వెళ్లి రాత్రి రావడంతో ఆయనకు ఎక్సర్సైజ్ చేసే తీరిక లేక కొన్ని బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది.

Actress Savitri: మహానటి సావిత్రికి చివరి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎందుకు సాయం చేయలేదో తెలుసా?

Actress Savitri: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర సంపాదించుకున్న మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోలు అందరూ సరసన నటించిన పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈమె కాల్ షీట్ల కోసం ఎదురు చూసేవారంటే ఈమెకు అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె రహస్యంగా జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహమైన తర్వాత ఈమె జీవితం పూర్తిగా మారిపోయింది. తాను సంపాదించిన దానిలో ఎంతో దానా ధర్మాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈమె చివరి క్షణాలలో మాత్రం దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని తెలుస్తోంది. ఇలా తనవాళ్లేనని నమ్మి ఉన్న ఆస్తులను మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా సినిమా అవకాశాలు రాకపోవడంతో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పూర్తిగా తాగుడుకు బానిసయ్యి చివరి క్షణాలను ఎంతో దుర్భరంగా గడుపుతూ తుది శ్వాస విడిచారు.

Actress Savitri: తన మొండి వైఖరి అందరినీ దూరం చేసిందా…

ఇలా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందిన ఈమె చివరికి ఏ ఒక్కరి సహాయ సహకారం తీసుకోలేదని చెప్పాలి.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను అందుకున్న సావిత్రికి చివరికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా సహాయం చేయలేదని తెలుస్తుంది. అయితే ఇలా వీరు సహాయం చేయకపోవడానికి ఒక కారణం ఉందని, అది కేవలం సావిత్రి మొండి వైఖరి కారణమంటూ ఇండస్ట్రీ టాక్.ఈమె తాగుడుకు బానిసైన సమయంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎన్నోసార్లు తను ఆ వ్యసనానికి దూరం కావాలని సూచించారట అయినప్పటికీ ఈమె తన మొండి వైఖరిని ఏమాత్రం మానుకోకపోవడంతో చివరి రోజులలో కూడా ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు కూడా ఆమెను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

Balakrishna: ఆ టాలీవుడ్ హీరోల స్టామినా తగ్గిపోయిందా… బాలయ్య మాత్రమే ఫామ్ లో ఉన్నారా?

Balakrishna:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి వారి తర్వాత జనరేషన్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలు. ఇక ఈ జనరేషన్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. అయితే చిరంజీవి కన్నా ముందుగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానంలో కొనసాగారు బాలయ్య.

అయితే బాలయ్య నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఊహించని విధంగా సుమన్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. అయితే కొన్ని కారణాల వల్ల సుమన్ అతి తక్కువ సమయంలోనే ఫెయిడౌట్ అయ్యారు.ఇక మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ వచ్చారు.ఇక వీరి వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరి హవా కొంతమేర తగ్గిందని చెప్పాలి.

ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత కొన్ని రోజులపాటు సినిమాకు విరామం ప్రకటించారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయని నిరూపించాయి. ఇక నాగార్జున బాలకృష్ణ పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉంది. ఇక నిన్న విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు రూ.16.68 కోట్ల షేర్ రాబట్టింది.

Balakrishna: ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య..

అదేవిధంగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా రూ.2.42 కోట్ల రూపాయలు రాబట్టింది వెంకటేష్ ఈ మధ్యకాలంలో వరుస మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఈయన సినిమాలు కూడా ఎప్పుడు మొదటి రోజు 10 కోట్ల షేర్స్ రావట్లేదు.ఇక మిగిలినది నందమూరి నటసింహం బాలకృష్ణ ఈయన తాజాగా నటించిన చిత్రం అఖండ. అఖండ సినిమా విడుదల అయినా మొదటి రోజు ఏకంగా రూ. 18.04 కోట్ల షేర్ ను రాబట్టింది.దీన్ని బట్టి చూస్తే సీనియర్ హీరోలలో బాలకృష్ణనే ఫుల్ ఫామ్ లో ఉన్నారని మిగిలిన హీరోల హవా తగ్గిపోయిందని తెలుస్తుంది.