Tag Archives: Gopichand

Salaar: సలార్ పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో ఆ టాలీవుడ్ హీరోని తీసుకోవాలనుకున్నారా… ఏమైందంటే?

Salaar: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం సలార్. ఈ సినిమా ఎన్నో అంచనాలను ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే ఈ సినిమాలో జగపతిబాబు ఆయన కొడుకు మెయిన్ విలన్లుగా కనిపించబోతున్నారు ఇక జగపతిబాబు కొడుకు పాత్రలో మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పృధ్విరాజ్ పాత్రలో టాలీవుడ్ హీరో అయితే బాగుంటుందని ప్రభాస్ డైరెక్టర్ కి సలహా ఇచ్చారట అయితే డైరెక్టర్ మాత్రం చాలా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

ప్రభాస్ తన ఆప్తమిత్రుడు అయినటువంటి హీరో గోపీచంద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో తీసుకోవాలని సూచించారట ఇదివరకు వీరిద్దరూ వర్షం సినిమాలో హీరో విలన్లుగా నటించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ప్రశాంత్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇద్దరూ కూడా తెలుగువారే అయితే మార్కెట్ పరంగా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాదని చెప్పడంతో ప్రభాస్ ఈ విషయంలో సైలెంట్ అయ్యారట.

Salaar: రెండు భాగాలుగా సలార్…


ఈ విధంగా ప్రభాస్ గోపీచంద్ పేరును సూచించగా ఆయన మాత్రం మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ మొదటి సారి హీరోయిన్ గా నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ramabanam: రామబాణం సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.. గోపీచంద్ ఫస్ట్ ఛాయిస్ కదా?

Ramabanam: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రామబాణం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు మే ఐదవ తేదీ వచ్చింది. ఇలా మే ఐదవ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేక పోయినప్పటికీ పరవాలేదు అనిపించుకుంది.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హైదీ నటించారు.జగపతిబాబు కుష్బూ వంటి సెలబ్రిటీలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం లౌక్యం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీ వాస్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేశారు. ఇక ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమా కథ సిద్ధం చేసుకునే సమయంలోనే ఈ సినిమాకు బాగా ఎత్తు, లావు ఉన్నటువంటి హీరో అయితే కరెక్ట్ గా సరిపోతారని భావించి ఈ కథను సిద్ధం చేశారట అయితే ఈయన అప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ సిద్ధం చేశారని తెలుస్తుంది. అయితే కథ మొత్తం పూర్తయిన తర్వాత హీరో వరుణ్ తేజ్ ను కలిసి ఈ సినిమా కథ వినిపించారట.

Ramabanam: వరుణ్ తేజ్ ఫస్ట్ ఛాయిస్…


కథ మొత్తం విన్నటువంటి వరుణ్ తేజ్ ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉండడమే కాకుండా చాలా ఎమోషన్స్ ఉండటంతో అలాంటి ఎమోషన్స్ సన్ని వేశాలలో నటించడానికి తాను పెద్దగా సూట్ అవునన్న ఉద్దేశంతో ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది..ఇలా వరుణ్ తేజ్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో అలాంటి కటౌట్ ఉన్నటువంటి హీరో అయిన గోపీచంద్ కు ఈ సినిమా కథను వినిపించి రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ వరుణ్ తేజ్ అని ఆయన రిజెక్ట్ చేస్తేనే గోపీచంద్ ఈ సినిమాలో నటించారని తెలుస్తుంది.

Gopichand: ప్రభాస్ కి విలన్ గా నటించడానికి సై అంటున్న గోపీచంద్… ఆ కండిషన్ మాత్రం తప్పనిసరి!

Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన తాజాగా రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా నేడు విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇలా గోపీచంద్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను తెలియజేశారు.

ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు నటి కుష్బూ వంటి వారందరూ నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక తాజాగా గోపీచంద్ జగపతిబాబు ఇద్దరు కలిసి హీరో నవదీప్ తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్ కు నవదీప్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మరోసారి ప్రభాస్ తో విలన్ గా నటించే అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించారు.

ఇలా నవదీప్ అడిగిన ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ…ప్రభాస్ తో విలన్ గా చేసే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు. అయితే తన పాత్ర మాత్రం నిజం వర్షం జయం సినిమాలలో మాదిరిగా నా పాత్ర కథను ఎలివేట్ చేసే విధంగా ఉండాలని కండిషన్ పెట్టారు ఇలా ఉంటేనే నటిస్తానని తెలిపారు. తామిద్దరం కలిసి ఇదివరకే వర్షం సినిమాలో నటించామని అదే తరహాలోనే నా పాత్ర ఉండాలని తెలిపారు.

Gopichand: ప్రభాస్ తో ఢీ కొట్టడానికి సిద్ధమైన గోపీచంద్…

ఇలా ప్రభాస్ తో ఢీకొట్టే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానంటూ గోపీచంద్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతాయి. అయితే తెరపై వీరిద్దరూ పోటీకి సిద్ధమైనప్పటికీ తెర వెనక మాత్రం ఇద్దరు కూడా ప్రాణ మిత్రులే అనే విషయం మనకు తెలిసిందే. వ్యక్తిగతంగా ప్రభాస్ గోపీచంద్ కూడా మంచి స్నేహితులు. ఇక వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు.

Gopichand: దర్శకుడు శ్రీవాస్,హీరో గోపీచంద్ మద్య గొడవ… క్లారిటీ ఇచ్చిన గోపిచంద్…?

Gopichand: మ్యాచ్ హీరో గోపీచంద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ‘ రామబాణం ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాగా రామబాణం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. ఈ సినిమా ప్రమోషన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్ పనులలో సినిమా యూనిట్ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా శ్రీవాస్, గోపీచంద్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలపై తాజాగా గోపీచంద్‌ క్లారిటీ ఇచ్చారు. రామబాణం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న గోపీచంద్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో దర్శకుడు శ్రీవాస్ తో గొడవ గురించి గోపీచంద్ వద్ద ప్రస్తావించారు.

గోపీచంద్ ఈ విషయం పై స్పందిస్తూ..”మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సినిమా షూట్‌ చేస్తున్నప్పుడు కొన్ని సీన్ల నిడివి ఎక్కువగా ఉంది. అప్పుడు శ్రీవాస్‌ను పిలిచి.. ”ఒకవేళ షూట్‌ చేసినా ఎడిటింగ్‌లో తీసేసే అవకాశం ఉంది” అని చెప్పాను. దానికి ఆయన.. ”అలా కాదు షూటింగ్ చేద్దాం. ఒకవేళ అప్పటికప్పుడు కావాలంటే మళ్లీ ఫుటేజీ రాదు కదా” అని బదులిచ్చాడు.

Gopichand: సీన్ నిడివి ఎక్కువగా ఉందని చెప్పాను..

నేను ఎంత చెప్పినా వినలేదు. దాంతో నేను పట్టించుకోలేదు. తీరా చూస్తే ఎడిటింగ్‌ టేబుల్‌పైకి వెళ్లాక మొత్తం ఆ సన్నివేశాలను ఎడిటర్‌ కట్‌ చేసేశారు. ఇదే మా మధ్య జరిగింది. దీన్నే అందరూ గొడవలు అయ్యాయని రాసేశారు” అంటూ గోపీచంద్‌ క్లారిటీ ఇచ్చాడు. గోపిచంద్, డింపుల్ హయతీ జంటగా నటించిన రామబాణం మే 5 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Gopichand: ఇండస్ట్రీకి వచ్చి నువ్వేం పీకావ్… హీరో గోపీచంద్ సూటిగా ప్రశ్నించిన డైరెక్టర్?

Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి గోపీచంద్ ఈ మధ్యకాలంలో వరుస ఫెయిల్యూర్ సినిమాలను చవిచూస్తున్నారు అయితే తాజాగా ఈయన లక్ష్యం లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా డైరెక్టర్ తేజ గారితో కలిసి గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తేజ గారు ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ గోపీచంద్ నుంచి సమాధానం రాబట్టారు.

ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తేజ ప్రశ్నిస్తూ రామబాణం సినిమా టైటిల్ బాలయ్యతో అనౌన్స్ చేయించారు. ఎందుకు అంటూ ప్రశ్నలతో మొదలుపెట్టారు.నాతో సినిమా చేస్తానని హీరోయిన్ సెట్ కాకపోతే వేరే సినిమాకు వెళ్ళవు తర్వాత నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అని ప్రశ్నించగా అందుకు గోపీచంద్ వివరణ ఇచ్చుకున్నారు.

Gopichand: మీ నాన్న ఎంతో గొప్పోడు…


ఇక రామబాణం డైరెక్టర్ తో గొడవలు గురించి కూడా ఈ సందర్భంగా తేజ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఇక గోపీచంద్ తండ్రి ఇండస్ట్రీలో ఓ గొప్ప డైరెక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇక తన తండ్రి గురించి ప్రశ్నిస్తూ…మీ నాన్న ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మరి నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఏం పీకావ్ అంటూ సూటిగా గోపీచంద్ ను ప్రశ్నించారు.మరి ఈ ప్రశ్నలన్నింటికీ ఈయన ఎలాంటి సమాధానాలు చెప్పారు అనే విషయం తెలియాలి అంటే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాలి.

Don Seenu: రవితేజ నటించిన డాన్ శీను సినిమా మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా?

Don Seenu: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలలో డాన్ శీను సినిమా ఒకటి. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నటువంటి రవితేజ అనంతరం గోపీచంద్ డైరెక్షన్లో మరో రెండు సినిమాలు చేశారు. ఈ సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకుంది.

ఇకపోతే డాన్ శీను సినిమాలో ముందుగా నటించే అవకాశం రవితేజకు రాలేదని ఈ సినిమాకు ఈయన పస్ట్ ఛాయిస్ కాదని తాజాగా గోపీచంద్ ఓ సందర్భంలో వెల్లడించారు. ముందుగా ఈ సినిమా కోసం ప్రభాస్ నుసంప్రదించగా అప్పటికే ఆయన డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు అలాగే ఆయన నటించిన బుజ్జిగాడు సినిమా కూడా ఇదే కోవకు చెందినది కావడంతో ఈ సినిమాను ప్రభాస్ రిజెక్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రభాస్ ఈ సినిమాకి నో చెప్పడంతో డైరెక్టర్ గోపిచంద్ మలినేని హీరో గోపీచంద్ వద్దకు వెళ్లారు. ఇక ఈయన కూడా అప్పుడు వాంటెడ్,గోలీమార్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కానీపక్షంలో గోపీచంద్ ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమాకు ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేయడంతో మరింత ఆలస్యం చేస్తే బాగుండదని భావించిన గోపీచంద్ ఈ సినిమా కథను రవితేజకు వినిపించారని తెలియజేశారు.

Don Seenu: 77 రోజులలోనే షూటింగ్ పూర్తి…

ఈ సినిమా కథ విన్నటువంటి రవితేజ వెంటనే సినిమాకు ఓకే చెప్పడంతో కేవలం 77 రోజులలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామని ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని తెలియజేశారు. ఇలా రవితేజతో తన జర్నీ డాన్ శీను తో ప్రారంభమైందని తర్వాత బలుపు, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలను కూడా చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

Gowri Pandit: గోపీచంద్ సరసన నటించి హిట్ అందుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Gowri Pandit: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతో మంది యువతీ యువకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేశం నలువైపుల నుండి ప్రతి ఏటా ఎంతోమంది హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది వరుస విజయాలతో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలో కొనసాగుతుంటే.. మరి కొంతమంది సరైన హిట్లు లేక ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.

ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం హిట్ అందుకున్న కూడా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అలా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో గౌరీ పండిట్ కూడా ఒకరు.
గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమాలో గౌరీ పండిట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో హీరోయిన్ గా గౌరీ పండిట్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ

సినిమా తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాలలో నటించింది. ఇక 2012లో విడుదలైన హౌస్ ఫుల్ సినిమా తర్వాత గౌరీ పండిట్ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పింది. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక వివాహం తర్వాత వెంటనే బాబు పుట్టడంతో సినిమాలకు పూర్తిగా దూరమైన గౌరీ పండిట్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

Gowri Pandit:కుటుంబంతో హ్యాపీగా ఉన్న గౌరీ పండిట్..

తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా గౌరీ పండిట్ తన కొడుకుతో తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పటికి ఇప్పటికీ గౌరీ పండిట్ ని పోల్చుకోవటం కష్టంగా మారింది. ఎందుకంటే అప్పటి కన్నా ఇప్పుడు మరింత అందంగా ఉంది. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇస్తే సెకండ్ హీరోయిన్ గా కూడా చాన్స్ అందుకోవడం గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు.

Prabhas: థియేటర్లో బాలయ్య టాక్ షో… ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదుగా?

Prabhas: బుల్లితెరపై ఎన్నో టాక్ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటిసారిగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ వచ్చింది.ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో ఆదరణ సంపాదించుకోవడంతో రెండవ సీజన్ కూడా అంతే ఘనంగా అదే అంచనాలు నడుమ ప్రారంభించారు.

ఇకపోతే రెండవ సీజన్లో ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తి కాగా ఐదవ ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు, గ్లింప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా హాజరు కానున్నారు.

ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందా ప్రభాస్ బాలకృష్ణ మధ్య ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయనే విషయం గురించి అందరికీ ఆత్రుత నెలకొంది.అయితే ఈ ఎపిసోడ్ ఆహాలో డిసెంబర్ 31వ తేదీ ప్రసారం చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 31వ తేదీ అప్పటికే కొత్త సంవత్సరం వేడుకలు కూడా ప్రారంభమవుతాయి కనుక అప్పుడైతే బాగుంటుందని మేకర్స్ ఆలోచించారని సమాచారం.

Prabhas: డిసెంబర్ 31న స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్…

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక సినిమాకు సంబంధించిన ట్రైలర్ టీజర్ విడుదల చేయాలంటే థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలకృష్ణ టాక్ షోని కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇలా ఈ ఎపిసోడ్ కనక థియేటర్లో విడుదల చేస్తే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది అనడంలో సందేహం లేదు.మరి థియేటర్ లో ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందనే విషయం గురించి త్వరలోనే స్పష్టత రానుంది.

Gopichand: హీరో గోపీచంద్ రెండో కుమారుడిని చూశారా ఎంత ముద్దుగా ఉన్నాడో.. వైరల్ అవుతున్న వియాన్ ఫోటోస్!

Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, విలన్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు గోపీచంద్. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఈయన ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు..

ఇకపోతే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే గోపీచంద్ తాజాగా తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీనియర్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మని గోపీచంద్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడికి తన తండ్రి కృష్ణ గారి పేరును పెట్టుకున్నారు.

ఇక గోపీచంద్ రెండవ కుమారుడు పేరు వియాన్.తాజాగా తన రెండవ కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఈ ఫోటోలు చూసి బాబు ఎంతో క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Gopichand: వైరల్ అవుతున్న వియాన్ ఫొటోస్

సాధారణంగా అందరి హీరోలు మాదిరిగా గోపీచంద్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరు. కేవలం తన సినిమాలకు సంబంధించిన విషయాలను అలాగే తన పిల్లల పుట్టిన రోజు వేడుకల సమయంలో మాత్రమే వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటారు. ఎక్కువగా ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఇక తాజాగా మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Hero Nithin: షూటింగ్ లో దద్దమ్మ అంటూ నితిన్ ను అందరి ముందే దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్.. ఎవరంటే?

Hero Nithin: జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్.తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సదా సరసన నటించిన నితిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టడంతో ఈయనకు వరుస అవకాశాలు వచ్చాయి.ఇలా జయం సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే మొదటి సారి తేజ దర్శకత్వంలో నటించిన నితిన్ కు దర్శకుడు తేజ నుంచి చేదు అనుభవాన్ని కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. తేజ తన పని పట్ల ఎంత నిబద్ధతగా పనిచేస్తారో మనకు తెలిసిందే.తనకు కరెక్ట్ గా అనిపించే ఎక్స్ప్రెషన్స్ రాకపోయినా ఆ సన్నివేశం సరిగా రాకపోయినా ఏకంగా సెలబ్రిటీలపై ఈయన చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలోనే జయం సినిమా సమయంలో నితిన్ ఒక ఎక్స్ప్రెషన్స్ సరిగా పెట్టకపోవడంతో ఈయన ఎక్కువ టేకులు తీసుకున్నారట.ఇలా ఎక్కువ టేకులు తీసుకున్నప్పటికీ సరైన ఎక్స్ప్రెషన్ రాకపోవడంతో దద్దమ్మ ఇది చేయడం కూడా రాదా నీకు అంటూ అందరి ముందే తేజ తనని అవమానించారని తెలుస్తోంది. ఈ విధంగా నితిన్ ను అందరి ముందు తేజ అలా తిట్టడంతో అక్కడే ఉన్నటువంటి గోపీచంద్ సదా షాక్ అయ్యారట.

Hero Nithin: ఇప్పటికే ఆ మాటలు గుర్తుకు వస్తాయి…

ఇలా తేజ నితిన్ తిట్టడంతో చివరికి ఈయన తన ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వడంతో షాట్ ఓకే అయ్యిందని తెలిపారు. ఇకపోతే ఇప్పటికీ ఈ సినిమాని నితిన్ టీవీలో చూసినప్పటికీ ఆ సన్నివేశం రాగానే ఈయనకు దర్శకుడు తేజ తిట్టిన మాటలు గుర్తుకు వస్తాయని ఓ సందర్భంలో నితిన్ వెల్లడించారు.