Tag Archives: karthikeya 2

Karthikeya 2: ప్రముఖ థియేటర్ లో కార్తికేయ 2 సినిమా నిలిపివేత.. కారణం అదేనా?

Karthikeya 2: డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లో రన్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.

ఇక ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన టాలీవుడ్ సినిమాలలో టాప్ టెన్ పొజిషన్లో పేరు సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా విజయం పై గుజరాత్ ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు.ఇలా ఎంతో విజయవంతంగా ఈ సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా హైదరాబాద్లోనే ప్రముఖ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేశారు.

హైదరాబాద్ లోని ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ‘కార్తికేయ 2’ చిత్రానికి చిన్న బ్రేక్ వేయబోతున్నారు. ఇలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి బ్రేక్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది.సెప్టెంబర్ రెండవ తేదీ పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో ఒకటవ తేదీ స్పెషల్ షోలో భాగంగా జల్సా సినిమాని ఈ థియేటర్లో విడుదల చేయనున్నారు.

Karthikeya 2: జల్సా కోసం కార్తికేయ 2 కి బ్రేక్..

ఈ విధంగా జల్సా సినిమా ప్రదర్శన నిమిత్తం కార్తికేయ సినిమాకు బ్రేక్ పడింది.ఇక ఈ స్పెషల్ షో అనంతరం యధావిధిగా కార్తికేయ సినిమా ప్రదర్శన అవుతుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి థియేటర్ యాజమాన్యంతో అనుమతి కూడా తీసుకున్నట్లు వెల్లడించారు కేవలం పవన్ కళ్యాణ్ సినిమా కోసమే కార్తికేయ సినిమాకు కాస్త విరామం ఇచ్చారని తెలుస్తోంది.

Tolly wood Top Most Profitable Movies: బాహుబలి నుంచి కార్తికేయ 2 వరుకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాలీవుడ్ సినిమాలివే?

Tolly wood Top Most Profitable Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో సినిమాలు విడుదలవుతూ పెద్ద ఎత్తున బాక్సాఫీస్ వద్ద భారీ   కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు విడుదలవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే బాహుబలి సినిమా నుంచి తాజాగా విడుదలైన కార్తికేయ 2 సినిమా వరకు ఏ సినిమా ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఇక్కడ తెలుసుకుందాం…

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల బిజినెస్ చేయగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 860 కోట్ల షేర్స్ రాబట్టింది. ఇక బాహుబలి ది బిగినింగ్ తెలుగులో 191 కోట్ల రూపాయల షేర్స్ రాబట్టింది. అన్ని భాషలలో కలిపి 311 కోట్ల షేర్స్ రాబట్టింది. రెండు భాగాలు కలిపి నిర్మాతలకు 694 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా అన్ని ఏరియాలలో కలిపి 451 కోట్లకు అమ్మారు. ఇక అన్ని ఏరియాలలో కలిపి ఈ సినిమా 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 613.06 కోట్ల షేర్స్ రాబట్టింది.

అలా వైకుంఠపురం: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా 85 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా ఈ సినిమా మొత్తంగా 160.37 కోట్ల రాబట్టింది. నిర్మాతలకు 75.88 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

ఎఫ్2: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 34.5 కోట్ల జరుపుకోగా ఓవరాల్ గా ఈ సినిమా 80 కోట్ల రూపాయల వరకు షేర్స్ రాబట్టింది.

పుష్ప: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకువచ్చింది.

Tolly wood Top Most Profitable Movies: మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు:

మహేష్ బాబు రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా . 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 139 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 39.36 కోట్ల లాభాలను అందుకుంది

కార్తికేయ2: నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా ఇటు సౌత్ ఇండస్ట్రీలోను అటు నార్త్ ఇండస్ట్రీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా 36 కోట్ల షేర్ రాబట్టింది.ఇక ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో టాప్ టెన్ స్థానంలో కొనసాగింది.

Actor Naresh: సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లు ఖాళీ.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో అన్ని రంగాలతో పాటు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. కరోనా కారణంగా సినిమా నిర్మాణ పనులు ఆగిపోయి నటీనటులందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా తగ్గు ముఖం పట్టిన తర్వాత కూడా ప్రేక్షకులు బయటకి వచ్చి థియేటర్లలో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు.

థియేటర్లు మూతపడటంతో ఓటీటీ లకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపటం లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటిటిలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి నెలలు గడుస్తున్నా కూడా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు ముఖ్య కారణం సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగటమే. బాగా డబ్బున్న వారికి ఈ టికెట్ రేట్లు పెద్ద సమస్య కాదు. కానీ ఒక మధ్య తరగతి కుటుంబం సినిమా చూడాలంటే మినిమం 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అందువల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం లేదు.

ఇటీవల ఈ విషయంపై నటుడు వి కె నరేష్ స్పందించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రతో ఉన్న రిలేషన్ వల్ల వివాదంలో నిలిచిన నరేష్ చాలాకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. ఇటీవల నరేష్ ఈ విషయం గురించి స్పందిస్తూ ప్రజలు థియేటర్లలో సినిమా చూడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నరేష్ స్పందిస్తూ…సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకి వచ్చి సినిమాలు చూస్తారు. ఇటీవల విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయని వెల్లడించాడు.

Actor Naresh: పాప్ కార్న్ పెప్సీ రేట్లు పెరగడం కూడా..

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడకపోవటానికి టికెట్ రేట్లు పెరగటం ముఖ్య కారణం కావచ్చు .కానీ అదొక్కటే కారణం కాదు. సినిమా టికెట్ రేట్లతో పాటు సినిమా థియేటర్లలో అమ్ముతున్న పాప్ కార్న్, కూల్ డ్రింక్ రేట్లు కూడా బాగా పెరిగాయి. ఒకప్పుడు రూ.20, రూ.30 లకు దొరికే పాప్ కార్న్, కూల్ డ్రింక్ ధర ఇప్పుడు రూ.200, రూ.300 అయ్యింది. అందువల్ల ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు రావటానికి ఆసక్తి చూపరు. వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. అని నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

Karthikeya 2: మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన కార్తికేయ… ఎంత వసూలు రాబట్టిందంటే?

Karthikeya 2: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదలయ్యే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సినిమాలను సైతం పక్కకు నెట్టి ఈ సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబడుతుందని చెప్పాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం 5 థియేటర్లలో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ల సంఖ్య 3 వేలకు పైగా పెరగడంతో ఈ సినిమాకి ఎలాంటి స్పందన లభించిందో అర్థమవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా,అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలను వెనక్కినట్టే కార్తికేయ దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే గత వారం రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు 60.12 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కృష్ణాష్టమిని అద్భుతంగా క్యాష్ చేసుకొని భారీ వసూలను రాబట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సాధారణ హీరోగా కొనసాగుతున్నటువంటి నిఖిల్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సత్తా చాటడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Karthikeya 2: నిఖిల్ కెరియర్ లోనే భారీ హిట్ సినిమా…

ఇది నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక వసూలను సాధించిన సినిమాగా నిలిచిపోతుంది.ఇక ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ విధమైనటువంటి కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం సైతం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ సినిమా తరచూ వాయిదా పడుతూ వచ్చినప్పటికీ చివరికి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుందనే చెప్పాలి.

Karthikeya 2: కార్తికేయ 2 సినిమా హిట్ అవుతుందని దిల్ రాజు భయపడ్డారు.. వైరల్ అవుతున్న తమ్మారెడ్డి కామెంట్స్!

Karthikeya 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 సినిమా ఇష్యూ గురించి ఈయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా వాయిదా పడటం వెనుక దిల్ రాజు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిఖిల్ సైతం పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా నిఖిల్ తాను ఎక్కడ దిల్ రాజు పేరు ఉపయోగించలేదని ఈ సినిమా ఇంత మంచి విజయం అయిందంటే అందుకు దిల్ రాజే కారణం అంటూ ఒక్కసారిగా మాట మార్చారు.

ఇక ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుందంటే మరొక సినిమాని వాయిదా వేసుకోమని చెప్పడం ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు కూడా తన సినిమా విడుదలవుతుందని కార్తికేయ2 టీమ్ కి ఫోన్ చేసి సినిమా వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారని ఈయన వెల్లడించారు.ఈ విధంగా దిల్ రాజు వంటి వారి ఈ సినిమా వాయిదా వేసుకోమని ఫోన్ చేశారంటే నిజంగా నిఖిల్ ఎంతో గర్వపడాలని ఈయన వెల్లడించారు.

Karthikeya 2: కార్తికేయ2 విజయాన్ని ముందే ఊహించారా…

దిల్ రాజు గారు కార్తికేయ 2సినిమా హిట్ అవుతుందని ముందే ఊహించారు. అందుకే సినిమాని వాయిదా వేసుకోమని ఫోన్ చేసి ఉంటారని ఈయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా హిట్ కాదని తెలిస్తే వాయిదా వేసుకోమని చెప్పే అవసరం దిల్ రాజుకి ఉండదంటూ తెలిపారు. ఈ విధంగా దిల్ రాజు కార్తికేయ 2 సినిమా విజయవంతం అవుతుందని ముందే ఊహించి ఈ సినిమాకి భయపడి నిఖిల్ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారంటూ తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Sitaramam Movie: సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..?

Sitaramam Movie: తెలుగు సినిమాలకు ఆగస్టు నెల బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల మొదట్లో విడుదలైన బింబిసారా, సీతారామం, కార్తికేయ 2సినిమాలు విడుదలయి ఇప్పటికి భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి.ఇకపోతే హను రాఘవపూడి దర్శకత్వంలో క్లాసికల్ ప్రేమ కథ చిత్రంగా వచ్చిన సినిమా సీతారామం.

ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటించాల్సిన అవకాశం సరాసరి దుల్కర్ సల్మాన్ కు దక్కలేదు.కొందరు టాలీవుడ్ హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఇలాంటి సూపర్ హిట్ సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చింది.

మరి ఇలాంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ సినిమా కథను ముందుగా డైరెక్టర్ హను రాఘవపూడి రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వినిపించారట. ఈయన కిఈ సినిమా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని ఒకానొక సమయంలో డైరెక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక విజయ్ దేవరకొండ కాదనడంతో ఈ సినిమా కథతో డైరెక్టర్ హీరో రామ్,నానికి కూడా వినిపించారట.

Sitaramam Movie: ఆ సినిమాల కోసం హిట్ సినిమాని వదులుకున్న హీరోలు…

ఈ విధంగా నాని రామ్ కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో ఈ అవకాశం దుల్కర్ సల్మాన్ కు వెళ్ళింది. ఇలా ఈ సినిమాతో మలయాళ నటుడు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో మన టాలీవుడ్ హీరోలు మాత్రం డిజాస్టర్ సినిమాలు చేయడం కోసం ఈ సూపర్ హిట్ సినిమాని చేతులారా వదులుకున్నారని చెప్పాలి. నాని నటించిన అంటే సుందరానికి సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు ఇక రామ్ నటించిన దివారియర్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఈ హీరోలు సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి.

Balakrishna: హిందీలో భారీ వసూళ్లను రాబడుతున్న కార్తికేయ 2… హార్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్.. కారణం అదేనా?

Balakrishna: హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 సినిమా హిందీలో కూడా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీలో దాదాపు మూడు కోట్లకు చేరువలో కలెక్షన్లను రాబడుతుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా కృష్ణుడు ద్వారక నేపథ్యంలో తెరకెక్కడంతో బాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందని తెలుస్తోంది.మొత్తానికి ఊహించని విధంగా ఈ సినిమా ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను మంచి విజయాలను అందుకుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమా హిందీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో బాలకృష్ణ అభిమానులు కాస్త హర్ట్ అయినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా తెలుగులో ఎలాంటి విజయమందుకుందో మనకు తెలిసిందే. కార్తికేయ2 సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేసినప్పుడు బాలకృష్ణ సినిమా ఎందుకు విడుదల చేయలేదని బాధపడుతున్నారు.

ఇకపోతే ఈ సినిమా హిందీలో డబ్ చేసి విడుదల చేయకపోవడానికి ఓ కారణము ఉందని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైంది అప్పటికి ఇంకా థియేటర్లు పూర్తిస్థాయిలో రన్ కాలేదు. కోవిడ్ నేపథ్యంలో నార్త్ ఇండస్ట్రీలో థియేటర్లో పూర్తిగా మూసివేసి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయలేకపోయారని తెలుస్తోంది.

Balakrishna: పూర్తిస్థాయి థియేటర్లు రన్ కాలేదు..

ఒకవేళ హిందీలో డబ్ చేసినప్పటికీ భారీ బిజినెస్ చేసి వసూళ్లను రాబట్టలేకపోతుందన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయలేదు. అందుకే ఈ సినిమాని హిందీలో విడుదల చేయలేకపోయారు. ఒకవేళ ఈ సినిమాని కనుక హిందీలో విడుదల చేసి ఉంటే అక్కడ కూడా వసూళ్ల సునామీ సృష్టించేదని చెప్పాలి. ఇక అఖండ తర్వాత బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Actor Nikhil: కార్తికేయ 2విడుదల విషయంలో దిల్ రాజు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్?

Actor Nikhil: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ2. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ తిరిగి ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైనప్పటినుంచి మంచి టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడుతున్నప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా థియేటర్లు దొరక్కుండా చేశారంటూ నిఖిల్ బాధపడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని నిఖిల్ సినిమా విడుదల విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు హస్తం కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ…ఈ సినిమా విడుదల వాయిదా విషయంలో దిల్ రాజు ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పాలంటే ఆయన మద్దతు వల్లే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి అంటూ నిఖిల్ దిల్ రాజు గురించి వస్తున్న వార్తలపై ఖండించారు. ఇకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రకారం ఒకే రోజే ఇద్దరి హీరోల సినిమాలు విడుదలయితే కలెక్షన్ల పరంగా పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయని చెప్పడం వల్లే తాను మరోసారి తన సినిమాని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని నిఖిల్ తెలిపారు.

Actor Nikhil: మంచి సినిమా తరచూ వాయిదా పడటం బాధ కలిగించింది…

ఇకపోతే ఒక మంచి సినిమా ఇలా తరచూ వాయిదా పడటంతోనే తాను బాధపడ్డానని, తాను ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నా సినిమా విడుదలకు ఫలానా వాళ్లు కారణమంటూ ఎక్కడ ప్రస్తావించలేదని ఈయన వెల్లడించారు. మొత్తానికి అనుపమ నటించిన ఈ సినిమా కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం నిఖిల్ దిల్ రాజు గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Karthikeya 2: కార్తికేయ 2 విజయాన్ని ఆ టాలీవుడ్ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారా… కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో?

Karthikeya 2: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చితక సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరోలను స్టార్ సెలబ్రిటీలు అణిచి వేస్తుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. అయితే హీరో నిఖిల్ విషయంలో ఇదే జరిగిందని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

నిఖిల్ పెద్ద హీరో కాకపోయినప్పటికీ చివరికి ఆయన నటించిన సినిమాలను విడుదల చేయడానికి కూడా థియేటర్లో దొరక్కుండా చేసి ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని,వాళ్ల సినిమాలను విడుదల చేయడం కోసం తన సినిమాని పలుసార్లు వాయిదా వేశారని తనకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుతూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా తన సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలని పంతం పట్టిన హీరోకి థియేటర్లు దొరకపోవడంతో ఎంతో బాధను అనుభవించారు.

అయితే నిఖిల్ సినిమాని వాయిదా వేసి తమ సినిమాలను విడుదల చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇకపోతే తరచు వాయిదా పడుతూ ఆగస్టు 13వ తేదీ విడుదలైన నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పరుగులు పెడుతుంది. ఇలా నిఖిల్ అందుకున్న ఈ విజయం కొందరు సెలబ్రిటీలు ఓర్వలేకపోతున్నారనేది వాస్తవం.ఈ సినిమాని విడుదల చేయకుండా ఎలా అయితే అడ్డుకొని తమ సినిమాలను విడుదల చేసుకున్నారు.

Karthikeya 2: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కార్తికేయ 2..

ఆ సినిమాలకు మించి హిట్ అందుకోవడంతో ఎంతోమంది కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫలితం అంటూ పలువురు నెటిజన్లు నిఖిల్ సినిమా గురించి, ఆయనని ఇబ్బందులు పెట్టిన వారి గురించి కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ ఎన్నో అవంతరాలు నడుమ తన సినిమాను థియేటర్లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఇదే స్థాయిలో విజయాన్ని అందుకోవడం విశేషం.

Anupama Parameswaran: రాజమౌళి కాళ్లపై పడిన అనుపమ పరమేశ్వరన్.. వైరల్ అవుతున్న వీడియో !

Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళికి సినిమా అంటే ఎలాంటి ఫ్యాషన్ ఉందో మనకు తెలిసిందే. ముఖ్యంగా థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టమని ఇదివరకు ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఇక ఈ చిత్ర బృందం ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చుని వీక్షించారు.ఇదే సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే కీరవాణి కుటుంబ సభ్యులకు కూడా అదే థియేటర్లో సినిమా చూశారు.

సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులు కారు పార్కింగ్ దగ్గర చేరుకోగానే అక్కడ వీరిని చూసిన అనుపమ పరమేశ్వర ఒక్కసారిగా వారి వద్దకు వెళ్లి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ను ఆశీర్వదించిన రాజమౌళి సినిమా చాలా బాగుందని తన నటన మరింత అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.

Anupama Parameswaran: సినిమాపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..

ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కీరవాణి కుటుంబ సభ్యులను కూడా అనుపమ పరమేశ్వరన్ పరామర్శించారు. ఇక ఈ విషయాన్ని ఈమె తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుపమ వ్యవహారంపై నేటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.