Tag Archives: kollywood hero

Sreeleela: బడా స్టార్స్ తో సినిమా చేస్తున్న శ్రీ లీలకు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

Sreeleela: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్రీ లీల. మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈమె నటనతో అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఈమె రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో శ్రీ లీల నటనకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు అందరి సరసన సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆరేడు సినిమాల షూటింగ్ పనులలో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నటువంటి శ్రీ లకు ఫేవరెట్ హీరో ఎవరు అనే సందేహం అందరికీ కలిగింది.

Sreeleela: సూర్య అంటే అంత ఇష్టమా….


మరి శ్రీ లీల ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ఫేవరెట్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నటుడు సూర్య.సూర్య తన అభిమాన హీరో అని ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలని ఈమె ఆశపడుతున్నారట. ఇలా ఇంతమంది హీరోలతో నటిస్తున్న ఈమెకు సూర్య తన ఫేవరెట్ హీరో కావడానికి కారణం ఆయన యాక్టింగ్ స్కిల్స్ నచ్చడమే కాకుండా ఆయన చేస్తున్నటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు కారణమని తెలుస్తుంది.

Actor Suriya: ఆస్కార్ ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు సూర్య.. ఫోటో వైరల్!

Actor Suriya: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సెలబ్రిటీలకు వివిధ రకాల పురస్కారాలతో వారిని సత్కరించడం సర్వసాధారణం అయితే చిత్ర పరిశ్రమలో అన్నిటికన్నా ఎంతో కీలకంగా అందించే అవార్డులలో ఆస్కార్ అవార్డు ఒకటి. ప్రతి ఏడాది ఈ ఆస్కార్ అవార్డు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇలా ప్రతి ఏడాది జరిగే ఆస్కార్ వేడుకలలో భారతీయ చిత్రాలు పోటీ పడకపోవడంతో పెద్దగా వీటిని ఎవరు పట్టించుకునే వారు కాదు. ఇక ఈ ఏడాది లాస్ ఏంజెల్స్ లో జరగబోయే 95వ ఆస్కార వేడుకలలో భాగంగా మన తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ ఆస్కార్ అవార్డు వేడుకలపై పడింది. ఈ ఆస్కార్ వేడుకలను చూడటం కోసం పరిచోట్ల బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఆస్కార్ అవార్డులను ఎంపిక చేయడం కోసం పలువురు సెలబ్రిటీలకు ఆస్కార్ ఓటును కూడా కల్పించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ నటుడు సూర్య సైతం ఈ ఓటు హక్కును కలిగి ఉన్నారు.ఇలా ఓటు హక్కు కలిగినటువంటి సెలబ్రెటీలు ఆన్లైన్ ద్వారా ఈనెల రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఓటు హక్కు వినియోగించుకొని అవకాశాన్ని కల్పించారు.

Actor Suriya: తెలుగు సినిమాకి ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు…

ఈ క్రమంలోనే నటుడు సూర్య తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విధంగా సూర్య ఓటు హక్కును ఉపయోగించుకున్నట్లు స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇక సూర్య తప్పకుండా మన తెలుగు సినిమాకి తన ఓటు వేసి ఉంటారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

Rajinikanth -Kamal Hassan: 18 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ బరిలో పోటీకి సై అంటున్న హాలీవుడ్ స్టార్ హీరోలు?

Rajinikanth -Kamal Hassan: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులుగా స్టార్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమల్ హాసన్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఈ ఇద్దరు హీరోల వయసు పెరుగుతున్న కొద్ది వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో కమల్ హాసన్ కాజల్ అగర్వాల్ రకుల్ హీరో హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ చివరి దశకు చేరుకుంది.

ఇకపోతే రజినీకాంత్ సైతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా మోహన్ లాల్ వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా కూడా చివరి దశ షూటింగ్ కు చేరుకుంది. ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.

Rajinikanth -Kamal Hassan: 2005 లో పోటీపడిన కమల్.. రజిని

కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం ఒకే రోజున కమల్ హాసన్ రజినీకాంత్ సినిమాలు రెండు విడుదలకు సిద్ధం కాబోతున్నాయని సమాచారం. అయితే సుమారు 18 సంవత్సరాలు తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ బరిలో పోటీకి దిగబోతున్నారు. 2005 వ సంవత్సరంలో రజనీకాంత్ నటించిన చంద్రముఖి కమల్ హాసన్ నటించినముంబై ఎక్స్ప్రెస్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఇందులో చంద్రముఖి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Vijay Thalapathy: కోలీవుడ్ నటుడు విజయ్ ఆస్తులు విలువ ఎంతో తెలుసా… భారీగా సంపాదించిన నటుడు విజయ్!

Vijay Thalapathy: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ తలపతి ఒకరు.కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈయన సినిమాలను విడుదల చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాకు ఈయన ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఇలా ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి విజయ్ భారీగానే ఆస్తులను కూడా సంపాదించి పెట్టారని తెలుస్తోంది. పలు మీడియా సర్వేల ప్రకారం విజయ్ నికర ఆస్తి విలువ సుమారు 445 కోట్ల రూపాయలనీ తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈయన భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారు.

Vijay Thalapathy: తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్న విజయ్…


ఇక ఈయన హీరోగా నటించిన మాస్టర్ సినిమా తెలుగులో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అనంతరం ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన నటించిన వారసుడు సినిమా ప్రేక్షకులను సందడి చేస్తోంది.

Meghana Raj: భర్త పేరును టాటూగా వేయించుకొని ఆ వార్తలకు చెక్ పెట్టిన నటి మేఘన రాజ్!

Meghana Raj: కన్నడ సినీ నటుడు చిరంజీవి సర్జా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయన నటి మేఘన రాజ్ అనే అమ్మాయిని 2018న వివాహం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఊహించని విషాదం చోటుచేసుకుంది.

2020 జూన్ 7వ తేదీ చిరంజీవి సర్జ గుండెపోటుతో మరణించడం అందరిని ఒక్కసారిగా శోక సంద్రంలోకి నెట్టి వేసింది. ఇదిలా ఉండగా చిరంజీవి సర్జ మృతి చెందే సమయానికి మేఘన గర్భవతి కావడం విశేషం.అయితే తన భర్త మరణించిన అనంతరం తన భర్త ప్రతిరూపాన్ని కడుపులో మోస్తూ తానే ప్రాణంగా బ్రతికిన మేఘన ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడుతూ కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ విధంగా ఈమె పలు సినిమాలలో నటిస్తూనే కొన్ని బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ విధంగా మేఘన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో ఈమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున తన పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాను ఎలాంటి పెళ్లి చేసుకోలేదని ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు.

Meghana Raj: మణికట్టుపై టాటూతో క్లారిటీ ఇచ్చిన నటి..

మేఘన రాజ్ సోషల్ మీడియా వేదికగా తన భర్త పేరుతో పాటు తన కుమారుడి పేరు వచ్చేలా టాటూ వేయించుకున్నారు.ఇలా మణికట్టుపై తన కొడుకు భర్త పేరును టాటూగా వేయించుకున్న ఈమె ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫరెవర్ అంటూ లవ్ సింబల్ తో ఈ ఫోటోని షేర్ చేశారు. ఇలా ఎప్పటికీ వారు తన గుండెల్లో నిలిచిపోతారంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన ఈ పోస్ట్ తో తాను రెండో పెళ్లి చేసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Nithya Menon : ఇండస్ట్రీలో నాకు శత్రువులు ఎక్కువ.. వారి మాట వినకపోతే దేనికైనా వెనకాడరు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నిత్యామీనన్

Nithya Menon: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలో పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి నిత్యామీనన్.ఇలా కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె వరస సినిమాలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఇకపోతే కొద్ది రోజులుగా నిత్యమీనన్ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో తనని ఓ వ్యక్తి కొత్త ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేస్తూ సతాయించాడని తనని ప్రేమిస్తున్నాడు అంటూ ఈమె ఆరోపించారు. ఇలా తనని ఎన్నో వేధింపులకు గురి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిత్యమీనన్ గురించి వార్తలు వచ్చాయి. ఇలా ఏదో ఒక విషయం ద్వారా నిత్యామీనన్ సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యమీనన్ పూర్తిగా ఈ వార్తలను ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో చాలామంది శత్రువులు ఉన్నారని తెలిపారు. మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఇలా మనల్ని వెనక్కు లాగే ప్రయత్నం చేస్తుంటారని వారు చెప్పిన విధంగా వినకపోతే ఇలాంటి వదంతులు పుట్టిస్తుంటారని ఈమె పేర్కొన్నారు.

Nithya menen: అవన్నీ అవాస్తవాలు…

ఇలా నా శత్రువులు నా గురించి పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు సృష్టించారని ఈమె పేర్కొన్నారు. నేను ఎంతోమంది దర్శకులు హీరోల దగ్గర పని చేశాను ఎవరి దగ్గర నుంచి నేను ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోలేదని తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలిసిందే అంటూ ఈ సందర్భంగా నిత్యామీనన్ తన గురించి తన పెళ్లి చేసుకోబోతున్న విషయం అలాగే ఓ వ్యక్తి తనకు ఫోన్లు చేసి హింసించారంటూ వచ్చే వార్తలు అన్నింటిని పూర్తిగా కొట్టి పారేశారు.

Dhanush: కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ధనూష్..! అందుకే ఐశ్వర్యకు విడాకులా..?

Dhanush: తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా హీరో ధనూష్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడికి సంబంధించి సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి ఎక్కువగా కలెక్షన్లకు తెచ్చిపెట్టాయి. ఇలా తెలుగులో కూడా ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నాడు ధనూష్.

Dhanush: కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ధనూష్..! అందుకే ఐశ్వర్యకు విడాకులా..?

ఇక ప్రస్తుతం ఈ హీరో.. బడా డైరెక్టర్స్ తో సినిమాలకు కమిట్ అవుతూ.. బిజీబిజీగా ఉన్నాడు. అయితే కెరీర్ పరంగా మాత్రం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న ధనూష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ధనూష్ హాట్ టాపిక్ గా మారుతున్నాడు.

Dhanush: కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ధనూష్..! అందుకే ఐశ్వర్యకు విడాకులా..?

ఇటీవల అతడు తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది అభిమానులు షాక్ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా అతడు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేశాడు. దీంతో వాళ్ల విడాకులకు సంబంధించి వివిధ రకాల విషయాలు ట్రోల్ అవుతున్నాయి.

ధనుష్ పక్కన కూర్చొని ఓ అమ్మాయి ..

ధనూష్ కు వేరే హీరోయిన్ తో ఎఫైర్ ఉండటం వల్లనే ఐశ్వర్యకు విడాకులు ఇచ్చాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ధనూష్ మాత్రం ఓ అమ్మాయితో దిగిన ఫొటో వైరల్ గా మారింది. దీంతో మరోసారి ధనూష్ విడాకుల ప్రస్తావన మరొకసారి ట్రెండింగ్ గా మారింది.

అస్సలు ఇది ఎలా బటయట పడిందంటే.. హైదరాబాద్ లో అతడు ఓ హోటల్ కు లంచ్ కు వచ్చాడు. ఆ విషయాన్నే ఆ హోటల్ మేనేజ్ మెంట్, ధనూష్ పీఆర్ టీం సోషల్ మీడియాలో షేర్ చేశాయి. అయితే వాళ్లు షేర్ చేసిన వాటిల్లో ధనుష్ పక్కన కూర్చొని ఓ అమ్మాయి భోజనం చేస్తోంది. దీంతో ఆ ఫొటోపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయే ధనూష్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ధనూష్ అభిమానలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కన కూర్చొని భోజనం చేస్తే లవర్ అయిపోతుందా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటివి నెట్టింట్లో ఎన్ని వైరల్ అవుతున్నా.. ధనూష్ గానీ.. వాళ్ల పీఆర్ టీం గానీ స్పందించకపోవడం విశేషం.

Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై విమర్శలు..! అది కూడా చేతకాదా..?

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. తన నటనతో అటు తమిళంలో, ఇటు తెలుగులో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాతో తెలుగుకు పరిచయం అయిన విజయ్ సేతుపతి… తరువాత వరసగా తన సినిమాలను డబ్ చేశారు. అయితే వీటిలో చాలా వరకు పెద్దగా హిట్ కాలేదు. అయితే నటన పరంగా విజయ్ సేతుపతికి వంక పెట్టలేము. 

Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై విమర్శలు..! అది కూడా చేతకాదా..?

వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి  నటించిన ఉప్పెన సినిమాలో కృతిశెట్టి  తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడని చెప్పవచ్చు. తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో సినిమాలో డామినేట్ చేశాడు. ఆ తరువాత పలు స్ట్రేయిట్ తెలుగు సినిమాలకు ఆఫర్లు వచ్చినా.. ఎందుకో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ లు వర్క్ అవుట్ కాలేదు. దీనికి విజయ్ సేతుపతి రెమ్యునరేషన్, కొన్ని డిమాండ్లు కూడా కారణం అయ్యాయని తెలుస్తోంది. 

Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై విమర్శలు..! అది కూడా చేతకాదా..?

ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ సేతుపలి, నయనతార, సమంత కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ‘కణ్మణి రాంబో ఖతీజా’ పేరుతో తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధం అయింది. తమిళంలో రూపొందిన ఈసినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విజయ్ సేతుపతికి, సమంతకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

పూర్తిగా తమిళ వాసనతో ఉన్న ..

అయితే ప్రస్తుతం ఈ సినిమా పేరుపైనే కాస్తా వివాదం నడుస్తోంది. సినిమా పేర్లకు తెలుగు పేర్లు దొరకడం లేదా.. అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తిగా తమిళ వాసనతో ఉన్న పేరుతోనే సినిమాను విడుదల చేస్తుెన్నారు. సినిమా టైటిల్.. పూర్తిగా విజయ్ సేతుపతి, సమంత, నయనతార క్యారెక్టర్ల పేర్లని తెలుస్తుంది. కనీసం తెలుగు ప్రేక్షకులకు అర్థం అయ్యే పేర్లు పెడితే బాగుండేదని.. సినిమా రీచ్ మరింత పెరిగేదని విజయ్ సేతుపతి ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Aishwarya -Dhanush: ఆస్పత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య.. పోస్ట్ వైరల్!

Aishwarya -Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో కూతురిగా, మరొక స్టార్ హీరో భార్యగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రజనీకాంత్ కుమార్తె ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె 18 సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

Aishwarya -Dhanush: ఆస్పత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య.. పోస్ట్ వైరల్!

18 సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఏడాది మొదట్లోనే విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇలా గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది.

Aishwarya -Dhanush: ఆస్పత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య.. పోస్ట్ వైరల్!

ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.

2022 నా కోసం ఇంకా ఏం చేస్తావో…

ఈ ఏడాది మొదట్లోనే తన భర్తతో విడాకులు తీసుకోవడం అనంతరం కరోనా బారిన పడటంతో ఈమె 2022 సంవత్సరం నా కోసం ఇంకా ఏమి చేస్తావో అంటూ పరోక్షంగా విడాకుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.