Tag Archives: maharashtra

Geneliya: తన మామయ్యను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన జెనీలియా.. వైరల్ అవుతున్న పోస్ట్!

Geneliya: జెనీలియా పరిచయం అవసరం లేని పేరు.జెనీలియా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే ఈమె నటుడు రిషితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత జెనీలియా పూర్తిగా నటినకు దూరమై ఇంటికి పరిమితమయ్యారు.

ఇకపోతే జెనీలియా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన అనంతరం ఈమె పూర్తిగా తన పిల్లల సంరక్షణ చేపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక జెనీలియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ఇంటికి కోడలుగా వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక జెనీలియా తన మామయ్యను కూడా పప్పా అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. ఇక ఈయన ఆగస్టు 14 2012 లో మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా తన పిల్లలు తనని ఓ ప్రశ్న అడిగారంటూ ఈమె తన మామయ్య గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పప్పా ఈరోజు రియాన్‌, రహైల్‌ నన్ను ఓ ప్రశ్న అడిగారు. అమ్మ మేము తాతను ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెబుతారా? అంటూ చెప్పుకొచ్చారు.ఈ ప్రశ్నకు తాను సమాధానం చెబుతూ మీరు వినగలిగితే సమాధానం చెబుతారు అని చెప్పానని ఈమె వెల్లడించారు.

Geneliya: వీ మిస్ యు పప్పా…

ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెబుతూనే ఉన్నారు. మీ సమాధానం నేను వింటూనే ఉన్నాను. మాకు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఆ సమయంలో మీరు మాకు అండగా ఉన్నారు. మా కోసం మీరు అండగా ఉంటానని మీరు నాకు మాట ఇచ్చారు. మేము కళ్ళు చేవులు తెరిచి, మీ మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. వీ మిస్ యు పప్పా అంటూ తన మామయ్య గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

Trending News: ఎవరి ఖాతాలోనైనా రూ.15లక్షలు వచ్చి పడితే ఏం చేస్తాం. ఎక్కడి లేని సంతోషపడుతాం. ఆ తర్వాత అవి ఎక్కడి నుంచి వచ్చాయోనని ఆరా తీస్తాం. అవి పొరపాటున ఖాతాలో జమయ్యాయని తెలిస్తే షాక్ కు గురవుతాం. సరిగ్గా ఓ రైతుకు ఇలాగే జరిగింది.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

వచ్చిన డబ్బులో రూ.9లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. తీరా ఆ నగదు తనకు రావాల్సింది కాదని తెలుసుకొని షాక్ కు గురయ్యాడు. ఆ ఖర్చు చేసిన మొత్తం కట్టాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఎలా అని తలపట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్ జిల్లా దావర్వాడీ గ్రామంలో చోటుచేసుకుంది.

Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..

దావర్వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే.. చిన్నా చితకా పనులు చేస్తూ జీవించేవాడు. కొంతకాలం క్రితం అతను తన జన్ ధన్ బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోగా రూ.15లక్షలు జమ అయి ఉన్నాయి.


దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ..

2014 ఎన్నికల సమయంలో భాజపా అధికారంలోకి వస్తే వస్తే విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం తిరిగి వెనక్కి తెస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేయొచ్చని చెప్పారు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న ధ్యానేశ్వర్ తన ఖాతాలో మోదీనే నగదు జమ చేసి ఉంటుందని సంబరపడ్డాడు. దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ఓ చిన్న ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు. ఆ ఆనందంలోనే అతనికి అందిన ఓ లేఖ పిడుగులాంటి వార్తను తెచ్చింది. ‘జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాలో జమయ్యాయి. వాటిని మీరు తిరిగి చెల్లించాలి’ ఇది ఆ లేఖలోని సారాంశం. ఇది చదివి ఆ రైతు కంగుతిన్నాడు. ఖాతాలో మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించినా.. ఖర్చు చేసిన డబ్బును ఎలా చెల్లించాలా ఆ రైతు తలపట్టుకున్నాడు.

పోర్న్ వీడియోలకు అలవాటు పడిన యువతి.. సొంత తమ్ముడితో ఇలా..!

కరోనా కారణంగా చాలా వరకు ఆన్ లైన్ లోనే క్లాసులను నిర్వహిస్తున్నారు. దీంతో యువత ఆన్ లైన్ క్లాసుల పేరుతో తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. ఇంటర్నెట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నయో.. అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. అయితే దేనిని ఎంచుకోవడం అనేది ఆ వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటిదే ఓ 16 ఏళ్ల యువతి ఆన్ లైన్ క్లాస్ లను మొబైల్ ఫోన్ ద్వారా వింటోంది.

వాటిని పక్కన పెట్టేసి పోర్న్ వీడియోలు చూడటం మొదలు పెట్టింది. చివరకు అది ఎంతకు దారి తీసిందో తెలియాలంటే.. పూర్తి వివరాలను తెలుసుకోవాల్సిందే.. రాజస్తాన్‌ లోని అల్వార్‌కు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. వాళ్ల ఇంట్లో 16 సంవత్సరాల యువతి ఆన్ లైన్ క్లాసులకు హాజరు అవుతోంది. ఇలా ఆమె పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకుంది.

ఓ రోజు తన తమ్ముడికి కూడా చూపించింది. తర్వాత ఆమె తన తమ్ముడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసింది. అతడు నిరాకరించడంతో ఒత్తిడి తీసుకొచ్చి.. బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఆ యువతికి కడుపులో నొప్పి ఎక్కువగా రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించగా.. ఆమె గర్భవతి అని తెలిసింది.

దీంతో విషయం అంతా బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలిక తమ్ముడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం సున్నితమైనది కావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు.. వివిధ కోణాల్లో పోలీసలు దర్యాప్తు చేపడుతున్నారు.

ఫోర్న్ కేసులో శిల్పాశెట్టికి సంబంధం ఉందా… అనుమానాలను పెంచిన ఆ వీడియో?

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత వారం రోజుల నుంచి ఫోర్న్ రాకెట్ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, విభాగాలు వివిధ కోణాలలో ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కటిగా బయటపేడుతున్నారు. తాజాగా ఈ కేసులో రాజ్ కుంద్రా భార్య సినీ నటి శిల్పాశెట్టిని కూడా విచారించాలని భావిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం రాజ్ కుంద్రాను మాత్రమే విచారించిన పోలీసులు ఇప్పుడు వారి దృష్టిని శిల్పాశెట్టి పైకి మరలించారు. నిన్నటి వరకు ఈ కేసు విషయంలో శిల్పాశెట్టికి ఏమాత్రం సంబంధం లేదని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు స్పష్టం చేశారు. కానీ గతంలో శిల్పా శెట్టి జేఎల్ స్ట్రీమ్ సమస్థకి సంబంధించిన వెబ్ సైట్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కంపెనీలో ఫోర్న్ రాకెట్ జరుగుతుందని ఆరోపణలు రావడం చేత పోలీసులు శిల్పాశెట్టి పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ వ్యవహారంలో శిల్పాశెట్టి పాత్ర ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కంపెనీకు,శిల్పాశెట్టికి ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.అలాగే రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న శిల్పాశెట్టి శుక్రవారం తన భర్త గురించి భావోద్వేగమైన పోస్ట్ చేయడం విశేషం. ఈ విధంగా శిల్పాశెట్టిపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో ఆమెను కూడా విచారించాలని భావించడంతో ఈ విషయం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.

కరోనాతో తల్లి మృతి …పాలిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహిళలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతో మంది పసిబిడ్డలకు తమ తల్లులను దూరం చేసింది. ఈ విధంగా వైరస్ బారినపడి ప్రసవ సమయంలో ఎంతోమంది తల్లులు మరణించడంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఈ తరుణంలోనే ప్రసవం కాగానే కరోనాతో తల్లి మరణించగా బిడ్డ కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆ బిడ్డకు పాలు ఇవ్వడానికి ఎంతోమంది తల్లులు ముందుకు వచ్చి వారిలో ఉన్న అమ్మతనాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

మహారాష్ట్ర,నాగపూర్‌లోని కింగ్స్‌వే ఆస్పత్రిలో మినాల్ వెర్నేకర్ అనే 32 ఏళ్ల గర్భిణీ ఇటీవల కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలోనే అత్యవసర పరిస్థితులలో ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.బిడ్డకు జన్మనివ్వగానే సదరు మహిళకు చాతిలో నొప్పి రావడంతో మరణించింది. నెలలు నిండకనే జన్మించిన బిడ్డకు ఫార్ములా మిల్క్ వల్ల అలర్జీ రావడంతో కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు.ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల తల్లులు వారి చనుబాలను బాటిల్లో పిండిచ్చి ఆ బిడ్డకు పంపేవారు.

ఈ క్రమంలోనే ఆ బిడ్డ తండ్రి చేతన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా భార్య ఏప్రిల్ 8న బిడ్డను కని చనిపోయింది. అయితే, నా బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలిసిన కొందరు మహిళలు తమ చనుపాలను నా బిడ్డ కోసం పంపించేవారు. వారు చూపిన మానవత్వం వల్లే ప్రస్తుతం నా బిడ్డ ఎంతో సురక్షితంగా ఉన్నాడని తెలిపారు”.

ఆస్పత్రి నుంచి ఆ బిడ్డను తీసుకుని థానేలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడు కూడా తన బిడ్డకు తల్లి చనుబాలు అవసరం ఏర్పడటంతో తన తండ్రి చేతన్”బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ ఉమెన్” అనే ఫేస్ బుక్ పేజీ ద్వారా తన సమస్య తెలిపాడు. ఈ విషయానికి స్పందించిన సమస్థ వ్యవస్థాపకురాలు అదునికా ప్రకాష్ ముందుకు వచ్చి ఇప్పటికీ ఆ బిడ్డకు వివిధ ప్రాంతాల నుంచి తల్లుల చనుబాలను అందజేస్తూ బాబు ప్రాణాలను కాపాడుతున్నారు.

అంతిమయాత్రకు తీసుకెళ్తుండగా లేచిన బామ్మ.. షాక్ లో కుటుంబ సభ్యులు.. చివరికి?

కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.ఇలాంటి సమయంలో మన దేశంలోని మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.పోలీస్ అధికారి సంతోష్ గైక్వాడ్ ఈ ఘటనను ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

మహారాష్ట్ర బారామతి జిల్లాలోని ముధలే గ్రామా నివాసి 76 ఏళ్ల బామ్మ శంకుత గైక్వాడ్‌ కు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడగా కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఆబామ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో మే 10వ తేదీన ఓ ప్రైవేట్ వాహనంలో శంకుత గైక్వాడ్‌ ను బారామతి లోని ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమయ్యారు.

అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా ఆస్పత్రిలో బెడ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. చేసేదేమీ లేక వారు కారులో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో శకుంతల పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కదలం కూడా ఆపేసింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయడానికి తమ స్వగ్రామానికి తిరిగి వచ్చారు.

తమ ఊరిలో అంత్యక్రియలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత అంతిమ యాత్రలో భాగంగా బామ్మను పాడెపై పడుకో పెడుతుండగా బామ్మ ఉలిక్కిపడి లేచి ఏడవటంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఊరి జనం ఒక్కసారిగా ఆశ్చర్యానికిలోనయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులు బామ్మను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బామ్మ బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

పట్టాలపై చిన్నారి.. వేగంగా వస్తున్న రైలు.. రైలుకి ఎదురెళ్ళినా రైల్వే ఉద్యోగి చివరికి?

ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి సమయంలోనే ఎంతోమంది ఎన్నో ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ఒక రైల్వే ప్లాట్ ఫామ్ పై ఓ వ్యక్తితో కలిసి చిన్నారి నడుచుకుంటూ వెళుతోంది. అకస్మాత్తుగా కాలుజారి రైల్వే పట్టాలపై పడింది. అదే సమయంలో అటుగా రైలు ఎంతో వేగంతో దూసుకొస్తోంది.

ఒక్కసారిగా చిన్నారి రైల్వే పట్టాలపై పడడంతో తనకు తోడుగా వచ్చిన వ్యక్తి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే రైలుకు ఎదురెళ్లి పాప ప్రాణాలను రక్షించేందుకు సాహసం చేశాడు. రైల్వే పట్టాలపై పరుగులు పెడుతూ చిన్నారిని ఫ్లాట్ ఫామ్ మీదకు సురక్షితంగా ఎక్కించి సెకండ్ల వ్యవధిలోనే తను కూడా సురక్షితంగా బయటపడ్డాడు.

మయూర్ షెల్కే మహారాష్ట్రలోని థానే జిల్లా వంగణీ రైల్వే స్టేషన్‌లో పాయింట్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం చిన్నారి ప్లాట్ ఫామ్ పై పడటంతో చిన్నారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. ఈ భయంకరమైన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఇతని ధైర్యసాహసాలు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆయన ధైర్యానికి సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ డీఆర్‌ఎం సహా సిబ్బంది లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ అభినందించారు. అదేవిధంగా ఈ వీడియో పై భారత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించి మయూర్ షెల్కే కి అభినందనలను తెలియజేసారు.

దారుణం: ప్రమాదంలో పది మంది చిన్నారులు బలి!

మహారాష్ట్ర జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అభం శుభం తెలియని నవజాత శిశువులు పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర భండార జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలోనిఐసీయూ ఈ విభాగంలో దాదాపు నెల నుంచి మూడు నెలల వయసున్న 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఐసీయూ ఈ విభాగంలో ఉన్నఫలంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూ విభాగంలో పనిచేసే వైద్య సిబ్బంది ఏడుగురు చిన్నారులను రక్షించగలగారు. మిగిలిన పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. అయితే ఈ ప్రమాదం ఏ కారణం వల్ల చోటు చేసుకుందో తెలియాల్సి ఉంది.ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం భవిష్యత్తులో ఎంతో విలువైన చిన్నారులను కోల్పోయామని,గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని నరేంద్రమోడీ ఆకాంక్షించారు.

మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేతో మాట్లాడి విషయంపై ఆరా తీశారు వెంటనే ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలియజేశారు. ఈ ఘటనపై మృతుల బంధువులు స్పందిస్తూ కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏమీ తెలియని తమ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తొందరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.

ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. ఆరు నెలలు డబ్బులు తీసుకోలేరట..?

గత రెండు రోజుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని పలు బ్యాంకులకు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రోజు లక్ష్మీవిలాస్ బ్యాంకుకు నెల రోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధించిన ఆర్బీఐ నిన్న మరో బ్యాంక్ కు షాక్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు ఖాతాదారులు డబ్బులు విత్ డ్రా చేయకుండా ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది.

మహారాష్ట్రలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కండీషన్లు పెట్టింది. ఆర్బీఐ కండీషన్ల వల్ల బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు నష్టపోనున్నారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎవరికైతే అకౌంట్లు ఉన్నాయో వాళ్లు ఇకపై రాబోయే 180 రోజుల వరకు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం సాధ్యం కాదు. అదే సమయంలో ఖాతాదారుల నుంచి బ్యాంకు డిపాజిట్లు సేకరించకూడదు.

ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం బ్యాంకుపై, ఇటు కస్టమర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధనలతో పాటు ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుకు మరికొన్ని నిబంధనలను కూడా విధించింది. ఇకపై అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు రుణాలను సైతం మంజూరు చేయడానికి అర్హత లేదు. ఆర్బీఐ వరుసగా బ్యాంకులకు వరుస షాకులు ఇస్తూ ఉండటం ఖాతాదారులను టెన్షన్ పెడుతోంది.

లక్ష్మీవిలాస్ బ్యాంకుకు విధించిన షరతులతో పోల్చి చూస్తే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్బీఐ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తూ ఉండటం గమనార్హం. లక్ష్మీవిలాస్ బ్యాంకు కస్టమర్లు నెల రోజుల పాటు కేవలం బ్యాంక్ ఖాతా నుంచి రూ.25,000 మాత్రమే విత్ డ్రా చేసే అవకాశం ఉంది. అత్యవసరమైతే ఆర్బీఐని సంప్రదించి బ్యాంక్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?

ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి వస్తువులను కొనుగోలు చేయలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ లో ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల కొడుకు ఆన్ లైన్ చదువుల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో ఒక తల్లి కొడుకుకు సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనిచ్చింది.

అయితే ఆ మహిళ కొనుగోలు చేసిన ఫోన్ ఎవరో దొంగతనం చేసిన ఫోన్ కావడంతో మహిళ ఒక రోజంతా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ మహిళ తాను డబ్బు చెల్లించి సెకండ్ హ్యాండ్ ఫోన్ ను కొనిందని చెప్పిన మాటలు నిజమేనని తెలియడంతో పోలీసులు ఆ మహిళను వదిలేశారు. మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బోరివ్లీలో నివశించే స్వాతి అనే మహిళ కుమారుని చదువుల కోసం రూ. 6 వేలు పెట్టి మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసింది.

ఆ తరువాత ఫోన్ లో కొన్ని సమస్యలు రావడంతో 1,500 రూపాయలు ఖర్చు చేసి స్వాతి ఫోన్ ను రిపేర్ చేయించింది. అయితే పోలీసులు ఆ ఫోన్ దొంగలించిన ఫోన్ కావడంతో స్వాతిని అరెస్ట్ చేశారు. ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో మహిళను ఫోన్ గురించి విచారించగా ఆ మహిళ తప్పేం లేదని తేలింది. స్వాతి మూడు నెలల కష్టపడి దాచుకున్న డబ్బుతో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసింది.

చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే కుమారుడి చదువులు సైతం ఆగిపోయే పరిస్థితి నెలకొంది. స్వాతి తాను పని చేస్తున్న ఇంటి యజమానితో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొని మోసపోతానని తన బాధను మొత్తం చెప్పగా ఇంటి యజమాని పోలీసులకు ఆ విషయాలను షేర్ చేశాడు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఆమె కుమారుడి చదువు కోసం మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఏ తప్పు చేయకపోయినా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి.