Tag Archives: mla roja

Roja: హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే రోజా…షాక్ లో మిగతా కంటెస్టెంట్ లు!

Roja: రాజకీయ నాయకురాలిగా, హీరోయిన్ గా,జబర్దస్త్ జడ్జిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక జబర్దస్త్ కార్యక్రమం లో మాత్రమే కాకుండా ఏదైనా పండుగల సమయంలో ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా రోజా సందడి చేస్తుంటారు.

Roja: హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే రోజా…షాక్ లో మిగతా కంటెస్టెంట్ లు!

ఈ క్రమంలోనే ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ టీవీ వారు అంగరంగ వైభవంగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్, యాంకర్ సుమ, శ్రీముఖి, రష్మి, ప్రదీప్, జీవిత రాజశేఖర్ దంపతులు, పలువురు సీనియర్ నటీమణులు హాజరై ఎంతో సందడి చేశారు.

ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ జడ్జి రోజా తనదైన శైలిలో అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా పలు స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో రోజా బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది పై చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాకయ్యారు.

ఏప్రిల్ ఫూల్ చెయ్యొద్దు…

రోజా ఈ విధంగా వీరి పై చేయి చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… బుల్లెట్ భాస్కర్ రోజాతో మాట్లాడుతూ మీరు మాకు ఇవ్వకపోతే అక్కడేం చేస్తారని ప్రశ్నించాడు భాస్కర్‌. దీంతో గట్టిగా రియాక్ట్ అయిన రోజానువ్వు .. బీప్‌ గురించి మాట్లాడకు అని అనడంతో, నేను బారాబర్ ఇంతే ఇలాగ మాట్లాడతానని బుల్లెట్ భాస్కర్ నోరు లేపాడు. దీంతో కోపంతో ఊగిపోయిన రోజా ఒక్కసారిగా అతని చెంప పై చెల్లుమనిపించింది.ఈ విధంగా రోజా బుల్లెట్ భాస్కర్ పై చేయి చేసుకోవడంతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది మధ్యలో ఎంటర్ అయి ఇలా ఒక ఆర్టిస్ట్ పై చేయి చేసుకోవడం ఏం బాగాలేదు మేడం అని చెప్పగా వెంటనే రోజా హైపర్ ఆది చెంప కూడా చెల్లుమనిపించింది.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్దఎత్తున నెటిజనులు ఈ కార్యక్రమం పై స్పందిస్తూ మరోసారి మమ్మల్ని ఫూల్స్ చేయాలని భావిస్తున్నారా… అంటూ కామెంట్లు చేస్తున్నారు.

MLA Roja: హోం టూర్ చేసిన ఎమ్మెల్యే రోజా..! రోజా ఇంద్ర భవనం మామూలుగా లేదుగా..!

MLA Roja: రోజా.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. తెలుగులో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందరో అగ్రహీరోలతో నటించింది రోజా. తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జునతో పాటే కాకుండా తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా నటించి మెప్పించింది. 

MLA Roja: హోం టూర్ చేసిన ఎమ్మెల్యే రోజా..! రోజా ఇంద్ర భవనం మామూలుగా లేదుగా..!

ప్రస్తుతం బుల్లితెర హోస్ట్ గా అలరించడంతో పాటే.. మరోవైపు పలు సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ప్రజలకు సేవ చేస్తోంది. నగరి వైసీపీ ఎమ్మెల్యేగా తన ప్రజలకు అందుబాటులో ఉంటోంది. 

MLA Roja: హోం టూర్ చేసిన ఎమ్మెల్యే రోజా..! రోజా ఇంద్ర భవనం మామూలుగా లేదుగా..!

అయితే ఇటీవల పలువురు సెలబ్రెటీలు తమ హోమ్ టూర్ నిర్వహించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మంచు లక్ష్మీ తన ఇంటితో పాటు మోహన్ బాబు ఇంటి హోం టూర్ నిర్వహించింది ఇంద్రభవనంలా ఉండే ఇళ్లను చూసి నెటిజెన్లు కూడా ఫిదా అవుతున్నారు.


మ్మెల్యే రోజా కూడా తన ఇంటిని..

తాజాగా ఎమ్మెల్యే రోజా కూడా తన ఇంటిని నెటిజెన్లకు, ప్రేక్షకులకు పరిచయం చేసింది. తిరుపతి గరిలో  విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుంది. ఈ క్రమంలో ఓ షో కోసం రోజా తన హెమ్‌ టూర్‌ని రిలీజ్‌ చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోతో ఇంట్లోకి స్వాగతం పలికిన రోజా.. ఇంట్లోని అన్ని రూములను ఫోటోలను అభిమానులతో పంచుకుంది. పూజాగది, బెడ్ రూమ్, హాల్ , పిల్లల రూమ్స్ ఇలా ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్టో వైరల్ అవుతున్నాయి. ఎంతో గ్రాండ్ గా నిర్మించుకున్న.. ఇంద్ర భవనం లాంటి ఇంటిని చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

Roja-Nani: హీరో నానిపై .. ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్..! సోషల్ మీడియాలో వైరల్..!

Roja-Nani: టాలీవుడ్.. ఏపీ ప్రభుత్వాల మధ్య టికెట్ల విషయంలో వివాదం రగులుతోంది. థియేటర్ల సినిమా టికెట్ రేట్లను తగ్గించడంతో టాలీవుడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు చేసే వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. దీనికి ఏపీ మంత్రులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.

Roja-Nani: హీరో నానిపై .. ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్..! సోషల్ మీడియాలో వైరల్..!

ఇటీవల హీరో నాని థియేటర్ల కలెక్షన్ల కన్నా.. కిరాణా కొట్టు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ నేరుగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై జగన్ సర్కార్ కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ముఖ్యంగా మంత్రి పేర్నినాని తనదైన శైలిలో స్పందించారు.

Roja-Nani: హీరో నానిపై .. ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్..! సోషల్ మీడియాలో వైరల్..!

ఆయన ఏ థియేటర్ కలెక్షన్లు చూశాడో.. ఏ కిరాణా కొట్టు కలెక్షన్లు చూశాడో తెలియదని.. బహుషా రెండింటి కలెక్షన్లను లెక్కించి హీరో నాని ఈ కామెంట్లు చేసి ఉంటాడేమో అని మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చాడు. దీంతో పాటు హీరో సిద్దార్థ్ కు కూడా చురకలు అందించారు. 

తాజాగా ఈవిషయంపై ఎమ్మెల్యే రోజా కూడా స్పందించింది. టికెట్ ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుందని.. ఆమె అన్నారు. హీరో నాని సినిమా టికెట్ల కన్నా కిరాణా కొట్టు కలెక్షన్లే బాగా అనిపిస్తే ఆయన సినిమాలు తీయడం వేస్ట్ అని.. కిరాణా కొట్టు బిజినెస్ పెట్టుకోవాలని సెటైర్ వేశారు. 

రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు.. ఎమ్మెల్యే రోజా..

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందని రోజా అంది. సినిమాలు తీస్తూ పొలిటికల్ పార్టీ పెట్టిన వ్యక్తి వల్లే ఇదంతా జరుగుతుందని.. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడటం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. కొంతమంది నోటి దురుసు వల్లే ’మా‘ ఎన్నికలు జనరల్ ఎలెక్షన్లను తలపించాయని రోజా విమర్శించారు.

ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం.. గాల్లోనే గంటపాటు తిరిగిన విమానం.. చివరకు ఏమైందంటే?

నగరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న రాజమండ్రి-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. ఎమ్మెల్యే రోజా రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉండగా.. ఈరోజు ఉదయం 10:55 గంటలకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆమె ఎక్కారు. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వేగంగా స్పందించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉండగా, విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాము ఇంకా విమానంలోనే ఉన్నామని, ఇంకా విమానం తలుపులు తెరవలేదని ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైలట్‌కు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు అని రోజా వీడియో విడుదల చేశారు. తిరుపతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో విమానం గంటకు పైగా గాలిలో తిరుగుతోందని ఆమె వీడియో ద్వారా వార్తను పంచుకున్నారు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది. మరోవైపు ఈ విమానం తిరుపతికి తిరిగి వస్తుందా లేదా అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే తో పాటు ఇతర ప్రయాణీకులు ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి దిగడానికి అనుమతించారని .. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ల్యాండింగ్‌కు అనుమతి లేనందున విమానం దిగేందుకు రూ. 5,000 చెల్లించాలని ఇండిగో అధికారులు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఊపిరాడక విమానంలో కూర్చోలేక ఆమెతో సహా కొందరు డబ్బులు చెల్లించారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేయాలని చెప్పారన్నారు. ఆమెతో పాటు మిగిలిన ప్రయాణికులు ఈ వ్యవహారంపై సివిల్ కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

రోజా కూతురుకు అరుదైన గౌరవం.. ఉబ్బితబ్బైపోతున్న నటి..!

తెలుగు సినీ పరిశ్రమలో రోజా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఇటు రాజకీయాల్లోను.. సినీ పరిశ్రమలోనూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే గా రెండు సార్లు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె జబర్దస్త్ కామెడీ షో లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. కమెడియన్లకు పంచ్ లు వేసి నవ్వుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తోంది.

ఇటు రాజకీయాల వైపు కూడా తన కార్యక్రమాలకు హాజరవుతూ.. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే సెల్వ‌మ‌ణిని వివాహం చేసుకున్న రోజాకు మొదట అన్షు మాలిక్ తర్వాత కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లల‌కు జ‌న్మ‌నిచ్చింది. అన్షు అంటే తనకు ఎంతో ఇష్టమని పలు కార్యక్రమాల్లో ఎన్నో సందర్బాల్లో తెలిపింది.

వారి అభిరుచులకు అనుగుణంగా ఆమె నడుస్తోంది. వాళ్ల ఇష్టాలకు ఏనాడు ఎదురుతిరగలేదు. అందరూ టెక్నాలజీలో తమ ట్యాలెంట్ ను నిరూపించుకుంటూ అటు వైపు వెళ్తుంటే.. రోజా కూతురు అన్షు మాత్రం సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించి భాషపై పట్టు సాధించి సృజనాత్మకతతో ముందుకెళుతోంది. తాజాగా అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది.

ప్రఖ్యాత ఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించడం విశేషం. తను ఎప్పటి నుంచి కలలు కంటున్న ఈ రోజు నెరవేరిందని.. అన్షూ సంతోషం వ్యక్తం చేసింది. ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫోటో ప్రచురించారు. ఇలా ఆమె ఇంతటి గౌరవాన్ని దక్కించుకోవడంతో రోజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబసభ్యులతో ఆమె చిన్న పాటి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.

రోజాను ఆర్థికంగా ఆదుకున్నది ఎవరో తెలుసా..?

ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు బబర్దస్త్ జడ్జిగా సుపరిచితం. సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్న రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె చిత్తూరు జిల్లా, చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు.

పొలిటికల్ సైన్స్ లో ఆమె నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహమాడిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. పెళ్లి అయిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. ప్రొడక్షన్ కంపెనీని నిర్మించి భర్త సెల్వమణిని దర్శకుడిగా పెట్టి అనేక సినిమాలను నిర్మించింది. దీనికి పెట్టుబడిగా ఆమె తన ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ను పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది.

తర్వాత అతడి దర్శకత్వంలో మొదటి మూడు సినిమాలు హిట్ అయినా తర్వాత అంతగా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. తర్వాత ఆమె ఆర్థికంగా ఎంతో ఇబ్బందులను గురవుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మొదట టీడీపీలో కి వెళ్లిన ఆమె 2004, 2009 శాసనసభ ఎన్నికలలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు.

2014 శాసనసభ ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై గెలుపొందారు. తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటు జబర్దస్త్ లో కూడా ఆమె న్యాయ నిర్ణేతగా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఆర్థిక పరమైన కష్టాల నుంచి బయటకు రావడానికి వైసీపీ, జబర్దస్త్ గట్టెకించాయనే చెప్పాలి.

సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం ఆ నిర్ణయాలను తీసుకుంది.. ఎమ్మెల్యే రోజా

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్ర పరిశ్రమపై తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో నిర్మాతలు, యాజమాన్యాలు, ఎగ్జిబీటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ టికెట్ ధరల విషయంలోనే విసుగుచెంది సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడం కంటే.. ఓటీటీ లో విడుదల చేయడమే సేఫ్ అని భావిస్తున్నారు నిర్మాతలు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు మెగస్టార్ చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది.

ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో మెగస్టార్ తో సహా మరికొంత సినీ ప్రముఖులు సీఎంతో చర్చించనున్నారు. కానీ ఈ లోపే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్ లైన్ లో విక్రయించేలా నిర్ణయం తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి పేర్నినాని దీనిపై అధికారికంగా కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అయితే కొంత మంది ఈ నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాలవైపు మళ్లింది. ప్రభుత్వం టికెట్లను, మద్యాన్ని అమ్ముకుంటుందని విమర్శలు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రోజా దీనిపై తీవ్రంగా స్పందించారు.

ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. సినీ ప్రముఖులు ఆన్ లైన్ లోనే టికెట్లు అమ్మాలని సీఎంను కోరడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. అంతేగానీ దీనిపై మరే ఉద్దేశ్యం లేదంటూ రోజా స్పష్టం చేశారు. ఇక త్వరలో సీఎం జగన్ తో సినీ సమస్యలపై మీటింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఏ విషయాలపై చర్చించుకుంటారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ పెరుగుతోంది.

ఎమ్మేల్యే రోజాపై విమర్శల వర్షం.. మంచి పనికి వెళ్లినా తప్పని తిప్పలు.. ఏమైందంటే..!

ఆర్కే రోజా అంటే.. నగిరి ఎమ్మెల్యేగా కంటే కూడా చాలామందికి హీరోయిన్ గా.. బబర్దస్త్ జడ్డిగా చాలామందికి సుపరిచితం. ఆమెను వైయస్సార్సీపి పార్టీ ఫైర్ బ్రండ్ గా కూడా పిలుస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. దానికి భారత రాష్ట్రపతి కూడా అతీతం కాదు. మూతికి మాస్స్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలి.

కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటూ వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అయితే దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసకుంటున్నారు. కానీ ఇంకా 18 ఏళ్ల లోపు పిల్లలకు మొదలవ్వలేదు. పాఠశాలలో ఉండే పిల్లల దగ్గర ఎవరైనా నిబంధనలకు లోబడి బోధన లేదా ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే రోజా దానికి విరుద్ధంగా ప్రవర్తించారు.

చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అత్తూరులో 27.83 లక్షల రూపాయల వ్యయంతో ‘నాడు నేడు’ పథకం కింద ఆధునికరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనమును ఆమె ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు ఉన్న తరగతి గదికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. అక్కడ టీచర్ అవతారం ఎత్తారు. కాసేపు వాళ్లకు బోధించారు కూడా. అయితే ఈ సమయంలోనే ఆమె ఫేస్ కు మాస్క్ ధరింలేదు. అంతేకాకుండా.. ఆమె పక్కన ఉన్నవారు కూడా ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు.

భౌతికదూరం అస్సలు లేనే లేదు. దీంతో ఆమెపై ప్రతిపక్షపార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా తీసుకోని పిల్లల వద్ద మాస్క్ లు లేకుండా ఎలా తిరుగుతారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నాయకులు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మినహాయిపు ఇచ్చారా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోవిడ్ ప్రమాణాలు పాటించని ఆ పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పెళ్లి మాత్రమే చేస్తారా.. శోభనం కూడా చూపించండి.. జబర్దస్త్ స్కిట్స్‌పై ఫైర్!

బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో మొదట్లో మంచి ఆదరణ పొందింది. కానీ రాను రాను రేటింగ్ కోసం ఎంతటి దానికైనా దిగజారుతుంది. ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో పై నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అంతేకాకుండా మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ షోని చూసి మరిన్ని బుల్లితెర షోలు కూడా తమ రేటింగ్ కోసం బాగా దిగజారుతుంది.

ఇప్పటికే జబర్దస్త్ లో రేటింగ్ కోసం యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ను జోడిని ముందుంచారు. ఇక వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అన్నట్లు ప్రేక్షకులలో ఆలోచనలు మొదలయ్యేలా చేశారు. అంతేకాకుండా గతంలో వీరి పెళ్లి కూడా బుల్లితెర వేదికగా చేయగా అదంతా నిజం కాదని కేవలం రేటింగ్ కోసమని ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశారు. నిజానికి ఏదైనా ఒక్కసారి చేస్తే కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అదే మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం ఆ షో విమర్శలు ఎదుర్కోక తప్పదు.

jabardasth

ఇదిలా ఉంటే తాజాగా వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక ఇందులో కూడా మళ్లీ పెళ్లి స్కిట్ చేశారు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్. ఇందులో వీరికి జంటగా సోషల్ మీడియా స్టార్ దీపిక పిల్లి, యాంకర్ రష్మీ పెళ్లి కూతుర్ల గెటప్ లో కనిపించారు. వీళ్లను చూసి సుధీర్, ఆది తమ డైలాగ్స్ తో రెచ్చిపోయారు. సుధీర్ మరింత ఓపెన్ గా మాట్లాడుతూ పదిన్నర అయింది ఏమీ లేదా అని అనడంతో ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. హైపర్ ఆది రాసిన ఈ స్కిట్ కు మల్లెమాల పై కూడా టార్గెట్ పడినట్లు తెలుస్తుంది.

ఇక నెటిజన్లు ఇటువంటివి చూడలేక.. మల్లెమాల అంటే మల్లెలు, మాలలు అర్థం వచ్చేటట్లు.. మల్లెమాలా? పెళ్లిళ్ల బ్రోకరా? అంటూ శోభనం చేసేది కూడా పెట్టండి అని ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. నిజానికి ఫ్యామిలీతో కలిసి చూసే ఈ షో లలో ఇటువంటివి స్కిట్ లను చేయడం సరైనది కాదని గతంలో జబర్దస్త్ కు విమర్శలు ఎదురుగా మళ్లీ అలాంటి స్కిట్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సర్జరీ తర్వాత అలా అయిపోయిన ఎమ్మెల్యే రోజా..?

నటిగా ,రాజకీయ అభ్యర్థిగా ఎంతో చురుగ్గా ఉండే రోజా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సంగతి మనకు తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం ఆమె రెండు మేజర్ సర్జరీలు చేయించుకున్న క్రమంలో ఆమె ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం ఇంట్లో ఉన్నప్పటికీ తన అధికారిక కార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు.

తన నియోజకవర్గంలో సమస్యలు, కరోనా కట్టడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పది రోజుల నుంచి ఆన్ లైన్ ద్వారా అధికారులతో ఆమె టచ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ముఖ్యపట్టణమైన పుత్తూరు మునిసిపాలిటీ అధికారులు, నేతలతో రోజా జూమ్ మీటింగ్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులతో మాట్లాడారు.

కరోనాతో బాధపడుతున్నవారు ఆసుపత్రిలో చేరకుండా హోమియోపతి, అల్లోపతి వంటి మందులను వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరి నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. ముఖ్యంగా ఈ దశ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న క్రమంలో యువత కూడా మరణిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న సమయంలో రోడ్లపై విచక్షణారహితంగా ప్రవర్తించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ఈ విధంగా రోజా సర్జరీ తర్వాత ఇంటికే పరిమితమైన తన విధులను ఎంతో చక్కగా నిర్వహించడంతో ఈమె ఎక్కడున్నా ఫైర్ బ్రాండ్ అని మరోసారి నిరూపించుకున్నారు.