Tag Archives: photos viral

Kiran Abbavaram: ఘనంగా హీరోయిన్ తో నిశ్చితార్థం జరుపుకున్న కిరణ్ అబ్బవరం.. ఫోటోలు వైరల్!

Kiran Abbavaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా ఈయన తన మొదటి సినిమా రాజా వారు రాణి గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్గా రహస్య గోరక్ నటించారు.

ఇలా ఈ సినిమా ద్వారా వీరిద్దరి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఎవరికి తెలియకుండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ వచ్చారు. అయితే వీరి ప్రేమ గురించి వార్తలు వచ్చిన వీటిని ఖండిస్తూ వచ్చారు. ఇకపోతే గత రెండు మూడు రోజుల నుంచి వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇలా వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలోని వీరిద్దరూ బుధవారం సాయంత్రం అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థపు వేడుకలను జరుపుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆగస్టులోనే పెళ్లి..
ఈ విధంగా కిరణ్ రహస్యల నిశ్చితార్థపు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జంట ఆగస్టు నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కాగానే ఈయన పెళ్లి చేసుకుని. ఇండస్ట్రీకి కొంత బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

Manoj -Mounika: ప్రాణాలు అడ్డువేసి మిమ్మల్ని రక్షించుకుంటా.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్టు!

Manoj -Mounika: మంచు మనోజ్ పరిచయం అవసరం లేని పేరు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇకపోతే ఈయన గతేడాది భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. మార్చి మూడవ తేదీ వీరి వివాహం మంచు లక్ష్మి నివాసంలో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా భూమా మౌనికతో పెళ్లి తర్వాత మనోజ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే ఇటీవల వీరిద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మనోజ్ తన భార్య మౌనికకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నీతో ఉన్న ప్రతిక్షణం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నిన్ను ధైరవ్ ను నా జీవితంలోకి పంపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నాను త్వరలోనే మన బిడ్డ కూడా రాబోతున్నారు. నీ రాకతో నా జీవితం ఎంతో అద్భుతంగా సాగిపోతుందని తెలిపారు.

ఆ లోటు భర్తీ చేయలేను..
ఇక నిన్ను మీ అమ్మానాన్నల మాదిరిగా చూసుకోలేకపోవచ్చు కానీ ప్రతిక్షణం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను మీ జీవితంలో ఏ విధమైనటువంటి కష్టం రాకుండా నా ప్రాణాలను అడ్డేసి మిమ్మల్ని కాపాడుతాను. నీకు నా హృదయంలో ఎంతో గొప్ప స్థానం ఉంది మనం ఇలాంటి పెళ్లి రోజులను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నా సతీమణికిపెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ మనోజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/C4Dc8_YSBJH/?utm_source=ig_embed&ig_rid=f2a46162-b7b3-4fb0-94bf-09e6a5a6f7e3

Varalakshmi: సైలెంట్ గా నిశ్చితార్థం జరుపుకున్న లేడీ విలన్.. కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Varalakshmi: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అనంతరం లేడీ విలన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నటువంటి వారిలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు అయితే తనకు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నెగిటివ్ పాత్రలలో విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా విలన్ పాత్రలలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పిస్తున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నఫలంగా తన ప్రియులతో నిశ్చితార్థం జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా ఈమె నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ముంబైలో వీరికి నిశ్చితార్థం మార్చి 1వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె నికోలయ్ సచ్‌దేవ్ ని నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరికీ గత 14 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో జీవితంలో ఒకటవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

పెయింట్ ఆర్టిస్ట్..
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమించినటువంటి ఈ సచ్ దేవ్ ఎవరు ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే.. సచ్ దేవ్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ ఇలా ఈయనతో ప్రేమలో పడినటువంటి ఈమె పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు.

Klin kaara: తన చెల్లెలను కలిసిన క్లిన్ కారా.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Klin kaara: క్లిన్ కారా పరిచయం అవసరం లేని పేరు మెగా ప్రిన్సెస్ గా అందరికీ ఎంతో సుపరిచితం అయినటువంటి ఈమె ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ అభిమానులకు చూపించలేదు దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగా వారసురాలిగా మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టారు.


రామ్ చరణ్ ఉపాసన ముద్దుల కుమార్తెగా క్లిన్ కారా ను ఎప్పుడెప్పుడు చూడాలా అని అభిమానులు కూడా ఆరాటపడుతున్నారు అయితే తాజాగా ఉపాసన తన భర్త కూతురితోపాటు తన చెల్లెలు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉపాసన సోదరి అన్షు పాల్ కూడా తల్లిగా ప్రమోట్ అయ్యారు అయితే ఈమెకు కవల పిల్లలు జన్మించారనే విషయం తాజాగా బయటపడింది.

ఉపాసన తన చెల్లెలు అన్షు ఇద్దరూ కూడా తమ ఫ్యామిలీ పిల్లలతో కలిసి ఒక అకేషన్ లో కలిసారు. తాజాగా వీరందరూ కలిసి దిగిన ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అన్షు దంపతులు తన ఇద్దరి కవల పిల్లలను ఎత్తుకొని ఉండగా రాంచరణ్ ఉపాసన దంపతులు కూడా తమ కూతురితో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..

పవర్ పఫ్ గర్ల్స్…
అద్భుతమైనటువంటి ముగ్గురిని మేము మీకు పరిచయం చేస్తున్నాము. ఈ ముగ్గురు పవర్ పఫ్ గర్ల్స్. క్లిన్ కారా తన ఇద్దరి సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసిపోయింది అంటూ ఈ పోస్ట్ చేశారు దీంతో క్లీన్ కారా తన చెల్లెలను కలవడానికి వెళ్ళిందంటూ కొందరు కామెంట్లు చేయగా ఈ ఫ్యామిలీ మొత్తం ఇంతేనేమో పిల్లల ఫేస్ కెమెరాలకు చూపించరేమో అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Geetha Madhuri: ఘనంగా గీత మాధురి సీమంతపు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాలలో ఈయన కీలక పాత్రలలో నటిస్తున్నారు ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నటువంటి నందు సింగర్ గీతామాధురిని ప్రేమించే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి వివాహం 2014వ సంవత్సరంలో అయింది. వీరిద్దరికి ఒక చిన్నారి కూడా జన్మించింది అయితే తాజాగా మరోసారి గీత మాధురి తల్లి కాబోతున్నారని తెలిసిందే. ఇటీవల ఈమె ఫిబ్రవరిలో తన ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నారంటూ ప్రెగ్నెన్సీ గురించి అసలు విషయం బయట పెట్టారు. అయితే తాజాగా తన కుటుంబం ఈమెకు ఘనంగా సీమంతపు వేడుకలను నిర్వహించారని తెలుస్తుంది.

తాజాగా గీత మాధురి సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఫంక్షన్‌లో గీత స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. సీమంతం సందదర్భంగా ఆకుపచ్చ, నారింజ రంగు కాంబినేషన్‌లో ఉన్న చీరలో మెరిసిపోయింది. ఇక వేదికను కూడా రకరకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. 

సాంప్రదాయబద్ధంగా సీమంతం…

ఇలా సాంప్రదాయబద్ధంగా గీతామాధురి సీమంతపు వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొద్ది రోజులలో గీతామాధురి ఇంట మరో చిన్నారి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

Pooja Hegde : మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తున్న పూజా హెగ్డే.. అవకాశాలు తగ్గిన అందం కొంచెం కూడా తగ్గలేదంటూ?

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు. అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడం. ఇకపోతే పూజా హెగ్డే చివరగా గత ఏడాది విడుదలైన కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఈ సినిమా కంటే ముందు విడుదలైన బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్యా సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజా హెగ్డే కెరియర్ కాస్త డల్ అయ్యింది.దాంతో ఐరన్ లెగ్ అంటూ పూజ హెగ్డే ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది.

అప్పుడప్పుడు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది పూజా హెగ్డే. అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందం మాత్రం చెక్కు చెదరడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా పూజ హెగ్డే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

అందాలను ఆరబోస్తున్న పూజా హెగ్డే…

లంగా వోణీలో చాలా పద్ధతిగా కనిపిస్తూనే అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది పూజ. తన నడుము అందాలను చూపిస్తూనే మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది. పింక్ కలర్ లెహంగా గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం తన అమ్మమ్మ ఊర్లో ఉన్న పూజా హెగ్డే అక్కడ పల్లెటూర్లలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాఫ్ శారీలో పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలను చూసిన అభిమానులు సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ పూజ అందం ఏ మాత్రం చెక్కు చదరడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎక్సలెంట్,సూపర్,ఆసమ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

Pooja Kannan : సాయి పల్లవి చెల్లి పూజా ఎంగేజ్మెంట్ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం.. ఫొటోస్ వైరల్?

Pooja Kannan: పూజా కన్నన్.. సోషల్ మీడియాలో గత నాలుగు ఐదు రోజులుగా ఈ పేరు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోయిన్ సాయి పల్లవి చెల్లిలిగా భారీగా గుర్తింపును తెచ్చుకుంది పూజా కన్నన్. అయితే త్వరలోనే పూజ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీంతో గత రెండు మూడు రోజులుగా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే మొదట్లో అందరూ ఈ కేవలం గాసిప్స్ అనుకుంటుండగా ఇటువంటి సమయంలోనే తాజాగా పూజా కొన్ని ఫోటోలను షేర్ చేసి ఆ వార్తలు నిజమే అని చెప్పకనే చెప్పింది.

ప్రస్తుతం పూజా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా లేడీ సూపర్ స్టార్ అయిన సాయి పల్లవి మాదిరిగానే పూజా కన్నన్ కూడా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూజా 2021లో విడుదలైన చిత్తిరాయి సెవ్వానం అనే చిత్రంతో హీరోయిన్ గా అలరించింది. సముద్రఖనికి కూతురు పాత్రలో నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటించి మెప్పించింది. సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పూజా కన్నన్ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అక్క సాయిపల్లవితో కలిసి ఫొటోలకూ ఫోజులిస్తూ సందడి చేస్తుంటుంది.

పెళ్లి గురించి మరో అప్డేట్ ఇచ్చిన పూజా..

ఇక రీసెంట్ గా గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తన ప్రియుడి గురించి చెప్పింది. తన ప్రియుడు వినీత్ ని పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తన పెళ్లిపై మరో అప్డేట్ ఇచ్చింది. ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు రెడీ అని చెప్పింది. ఇందుకు సంబంధించి ఒక ఫొటోను షేర్ చేసింది. అక్క సాయిపల్లవితో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంది. చేతులకు మెరిసిపోతున్న మెహందీని కూడా చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. రేపు సాయిపల్లవి ఎంగేజ్ మెంట్ జరిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి ఎప్పుడనేది తెలియలేదు. డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. పూజా చేతులకు పెట్టుకున్న మెహేంది ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఎంగేజ్మెంట్ పెళ్లి వార్తలు నిజమే అని చాలామంది నమ్ముతున్నారు.

Aadi Reddy: వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన ఆదిరెడ్డి… బిగ్ బాస్ విన్నర్ చేతుల మీదుగా ఓపెనింగ్?

Aadi Reddy: బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూలు ఆ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో ఆదిరెడ్డి ఒకరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అనంతరం ఈయన కూడా సీజన్ సిక్స్ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత ఈయనకు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. ఇక ఏడవ సీజన్లో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమాలకు రివ్యూ ఇస్తూ నెలకి సుమారు 40 లక్షల వరకు ఆదాయం పొందారు అంటూ గత వీడియోలలో స్వయంగా ఆదిరెడ్డి తెలియజేశారు. ఇలా యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం పొందడంతో ఈయన బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఒక సెలూన్ షాప్ ప్రారంభించారు.

విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆయన చేతుల మీదుగా ఈ సెలూన్ ప్రారంభించారు. ఈ ఫోటోలను ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మీ చేతుల మీదుగా ఈ షాప్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు .

మరి కొంతమందికి ఉపాధి…

ఈ షాప్ ద్వారా తాను మరి కొంతమందికి ఉపాధి కల్పించాలని దాదాపు 15 మంది వరకు కూడా ఇక్కడ పనిచేయబోతున్నారు అంటూ ఈ సందర్భంగా ఆదిరెడ్డి షేర్ చేసినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదివరకు రాహుల్ బార్బర్గా పనిచేశాను అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు. దీంతో ఈ సెలూన్ ప్రారంభించడానికి ఆయనని ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది.

Ntr:ఎన్టీఆర్ మీద కూర్చున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో తెలుసా?

Ntr: ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల సినిమాలకు సంబంధించిన విషయాలు లేదా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలియాలి అంటే కేవలం సినీ వారపత్రికలో మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాలలో అభిమానులకు తెలిసిపోతుంది. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలందరూ కూడా వారికి సంబంధించిన విషయాలతో పాటు వారి చిన్నప్పటి విషయాలను కూడా అందరితో పంచుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలోనే సెలబ్రిటీల ఓల్డ్ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ మీద ఒక కుర్రాడు కూర్చొని ఉన్నటువంటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు అయితే ఆ హీరో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కొనసాగుతున్నారు.

మరి ఎన్టీఆర్ దగ్గర కూర్చుని ఉన్నటువంటి ఆ కుర్రాడిని ఎవరో గుర్తుపట్టారా… మన అక్కినేని వారసుడు అఖిల్. ఎన్టీఆర్ దగ్గర ఎంతో చనువుగా కూర్చుని ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులు అటు అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు అఖిల్ చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తారక్ తో అఖిల్..


ఇక అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు అఖిల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అయితే ఈయన కెరియర్ లో ఇప్పటివరకు నటించిన సినిమాలేవి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. చివరిగా అఖిల్ ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Karthik Varma Dandu: ప్రేక్షకులను భయపెట్టి ఖరీదైన కారు కొట్టేసిన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు!

Karthik Varma Dandu: విరూపాక్ష సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన కార్తీక్ దర్శకత్వంలో సాయి ధరంతేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఘనవిజయం సాధించింది.

తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కొల్లగొట్టడమే కాకుండా జోరు కొనసాగిస్తోంది. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో బాగా సక్సెస్ అయ్యి హిట్ అందుకుంది. ఇదిలా ఉండగా కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో నిర్మాతలు ఆయనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు.

సాధారణంగా సినిమా హిట్ అయ్యి మంచి వసూళ్లు రాబడితే నిర్మాతలు ఆ సినిమా దర్శకులకు ఏదో ఒక ఖరీదైన బహుమతిని అందజేస్తూ ఉంటారు. విరూపాక్ష సినిమా విషయంలో కూడా అదే జరగడం వల్ల ఆ సినిమా నిర్మాతలు దర్శకుడు కార్తీక్ కి ఒక గిఫ్ట్ అందజేశారు. విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రూ. 100 కోట్లు వసూళ్లు చేయడంతో దర్శకుడు కార్తీక్ కి నిర్మాతలు ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా అందజేశారు.

Karthik Varma Dandu:70 లక్షల కారును బహుమతిగా అందుకున్న డైరెక్టర్…

ప్రస్తుతం ఆకారుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను బట్టి చూస్తే నిర్మాతలు బెంజ్ సీ మోడల్ కారుని దర్శకుడికి బహుకరించినట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ . 60 నుండి రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఏది ఏమైనా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయిన కార్తీక్ కు నిర్మాతలు ఒక ఖరీదైన కారుని బహుమతిగా అందజేశారు.