Tag Archives: unstoppale talk show

Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన మహేష్ బాబు..! ఎందుకో తెలుసా..?

Mahesh Babu: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న.. ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే మోహన్ బాబు, బన్నీ, రాజమౌళి, శ్రీకాంత్, బోయపాటి మొదలైన వారితో టాక్ షోని నిర్వహించారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటోంది.

Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన మహేష్ బాబు..! ఎందుకో తెలుసా..?

తాజాగా గ్రాండ్ ఫినాలే జరుపుకుంటోంది. ఈ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. ఆయన తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ షోకు మహేష్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడపల్లి కూడా హాజరయ్యారు.

Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన మహేష్ బాబు..! ఎందుకో తెలుసా..?

ఇలా షో జరుగున్న సమయంలో బాలయ్య.. డైరెక్టర్ మెహర్ రమేష్ కు ఫోన్ చేశారు. ఓసారి ముంబైలో ఎదురైన సంఘటన గురించి తెలిపారు. ఓ సారి ముంబై మారిటన్ హోటల్‌లో మేము టిఫిన్‌ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్పీ అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మహేశ్‌ చెప్తాడు అని ఫోన్‌ పెట్టాశాడు.

ఇది చూసిన మెహర్ రమేష్ వారు…


ఈ విషయంపై మహేష్ ఓపెన్ అయ్యారు. ఓసారి ముంబై మారిటన్ హెటల్ లో టిఫిన్ చేస్తుండగా.. ఇద్దరు అమ్మాయిలు వచ్చి తనను సెల్ఫీ అడిగారని.. అయితే తాను ఫ్యామిలీతో ఉన్నానని వారిద్దరికి చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారన్నారు. ఇది చూసిన మెహర్ రమేష్ వారు ఇద్దరు డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అని చెప్పాడు. వెంటనే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్లి.. సారి సార్ మీ కూతుళ్లు అని తెలియదని చెప్పానని.. దానికి శంకర్ పర్వాలేదు, హీరోలు ఎలా ఉంటారో కూడా వీరికి తెలియాలి కదా అని అన్నారని గుర్తు చేసుకున్నారు

Mahesh Babu – Sitara: వింటే వింటుంది లేదంటే లేదు.. సితారపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

MaheshBabu-Sitara: ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీ కంటూ టైమ్ కేటాయించే స్టార్లలో ముందు వరసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా షూటింగ్ ల నుంచి విరామం దొరికినప్పుడల్లా.. భార్య నమ్రతా, కుమారుడు గౌతమ్, కూతురు సితారలతో ఫారన్ ట్రిప్పులు వేస్తుంటారు మహేష్ బాబు.

Mahesh Babu – Sitara: వింటే వింటుంది లేదంటే లేదు.. సితారపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తాజాగా బాలయ్యతో ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కుమారుడు గౌతమ్ ఇప్పటికే ‘ 1 నేనొక్కడినే’ సినిమాలో కనిపించాడు. సితార, గౌతమ్ లకు కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.  ఇదిలా ఉంటే బాలయ్యతో అన్ స్టాపబుల్ షో గ్రాండ్ ఫినాలే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకు ప్రత్యేక అతిథిగా మహేష్ బాబు వచ్చారు.

Mahesh Babu – Sitara: వింటే వింటుంది లేదంటే లేదు.. సితారపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తాను మొదట సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానని.. ఎవరికీ చెప్పలేదని.. తాను తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానని టీజ్ చేసేవారని గుర్తుచేసుకున్నారు. నాన్న గారి సినిమాలు వేసవిలో ఊటీలో షూటింగ్ జరుపుకునేవని.. ఆయనతో పాటు నేను కూడా వెళ్లేవాడినని మహేష్ బాబు అన్నారు.

సినిమాలు సక్సెస్ కావడంతో..


దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన నీడ తను నటించిన తొలి సినిమా అని తను నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో చైల్డ్ స్టార్ అయ్యాడని తనపై కామెంట్లు వచ్చాయని మహేష్ తెలిపారు. మహేష్ బాబు డీసెంట్ అనుకుంటే గౌతమ్ డీసెన్సీ కా బాప్ అని బాలయ్య చెప్పగా మహేష్ నవ్వారు. ఈ షోలో బాలయ్య ఎవరు క్యాట్, ఎవరు  బ్రాట్ .. అంటూ ప్రశించగా.. గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ అంటూ మహేష్ అన్నారు. సితారది వాళ్ల అమ్మపోలిక అని తాట తీసేస్తుందని అన్నారు. వేకేషన్ క్యాన్సిల్ అయితే గౌతమ్ నార్మల్ గానే ఉంటాడని.. కానీ వేకేషన్ అంటే సితార చాలా ఎగ్జైట్ అవుతుందని.. క్యాన్సిల్ అయిందని తెలిసిందే ఇళ్లు పీకి పందిరి వేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Balakrishna: బాలయ్య టాక్ షో సక్సెస్ కావడానికి కారణం ఆయన కూతురే.. అసలు విషయం బయట పెట్టిన డైరెక్టర్!

Balakrishna: నందమూరి బాలకృష్ణ వెండితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా తనదైన శైలిలో తన హవా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మొట్టమొదటిసారిగా తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహాను స్థాపించిన సంగతి తెలిసిందే. ఆహా ద్వార ఎన్నో టాక్ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆహా ద్వారా బాలయ్య వ్యాఖ్యాతగా ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ మహేష్ బాబుతో ఎపిసోడ్ ప్రసారం అవుతూ మొదటి సీజన్ పూర్తి అవుతుంది.

ఈ విధంగా ఈ కార్యక్రమం మంచి సక్సెస్ కావడం వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉందని ఈ కార్యక్రమం డైరెక్టర్ బివిఎస్ రవి వెల్లడించారు.ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బాలయ్య ఇంత విజయవంతంగా నడిపించడం వెనుక బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని పాత్ర చాలా ఉందని రవి బయటపెట్టారు.

Balakrishna : కీలకంగా మారిన తేజస్విని..

ఈ కార్యక్రమంలో బాలయ్య డ్రెస్సింగ్ లుక్, హెయిర్ స్టైల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం కోసం ఆయన చిన్న కుమార్తె తేజస్విని ఎంతో సెర్చ్ చేసి ఆయన అందంగా కనిపించడం కోసం ఎంతో కృషి చేశారని రవి వెల్లడించారు. ఈ విధంగా ఈ కార్యక్రమం విజయంలో తేజస్విని పాత్ర చాలా కీలకంగా ఉందని ఈ సందర్భంగా బయటపెట్టారు.

Balakrishna – Chiranjeevi: బాలయ్య టాక్ షో కి చిరంజీవి రాకపోవడానికి వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

Balakrishna – Chiranjeevi: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై బాలయ్యతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికగా ఈ కార్యక్రమం నెంబర్ వన్ స్థానంలో కొనసాగిందని చెప్పవచ్చు.

Balakrishana – Chiranjeevi: బాలయ్య టాక్ షో కి చిరంజీవి రాకపోవడానికి వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

ఈ కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని షో కోసం పని చేస్తున్న బీవీఎస్ రవి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రాలేదు అనే విషయాన్ని బయటపెట్టారు.

Balakrishana – Chiranjeevi: బాలయ్య టాక్ షో కి చిరంజీవి రాకపోవడానికి వెనుక ఇంత పెద్ద కారణం ఉందా?

సాధారణంగా చిరంజీవి బాలకృష్ణ మధ్య సినిమాల విషయంలో తీవ్ర స్థాయిలో పోటీ ఉండటం వల్ల వీరిద్దరికి పరస్పర మనస్పర్ధలు ఉండటం చేత ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చాలామంది భావించారు. నిజానికి చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అంటే చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కారణమని రవి వెల్లడించారు.

సీజన్ 2 లో మెగా స్టార్ సందడి…

మొదటి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన లేకపోయినప్పటికీ రెండవ సీజన్ లో మాత్రం మెగాస్టార్ తప్పకుండా పాల్గొంటారని అందుకు సంబంధించిన వర్క్ కూడా జరిగిందని బీవీఎస్ రవి వెల్లడించారు.అయితే ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం నాగార్జునని అడగలేదని ఇక వెంకటేష్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని ఆయన తెలియజేశారు. ఇక సీజన్ 2 ఈ ఏడాది చివరిలో ప్రారంభం కావచ్చని రవి తెలిపారు.

Balakrishna: ‘సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి’.. టాక్ షోలో సందడే సందడి..!

Balakrishna: నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా స్మాల్ స్క్రీన్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఈ షోకు వచ్చిన విషయం తెలిసిందే.

షోలకు, సినిమాలకు రేటింగ్ ఇచ్చే.. ఐఎండీబీ వెబ్ సైట్ లో ఈ షో టాప్ 10 లో స్థానం సంపాదించడం విశేషం. మొదటి షోలో మోహన్ బాబు, మంచు లక్ష్మి సందడి చేశారు. తర్వాత నానీ, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, పుష్ప టీం, అఖండ టీం, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా వచ్చి అలరించారు.

Balakrishna: అర్జున్ రెడ్డికి సమరసింహారెడ్డి వెల్ కమ్..! టాక్ షోలో సందడే సందడి..!

తాజాగా మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండలతో కూడిన లైగర్ మూవీ యూనిట్ నందమూరి బాలయ్యతో అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌లుగా వచ్చారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ మొత్తాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న స్ట్రీమింగ్ కానుంది.

నటుడిగానే కాకుండా ఇలా టక్ షోలో..

ఈ షోకి సంబంధించిన స్పెషల్ ప్రోమోను షో మేకర్స్ రివీల్ చేశారు. వీడియోలో, లైగర్ చిత్ర యూనిట్ తమ సినిమా అనుభవాలను పంచుకోవడం అందులో కనిపించింది. షో ప్రోమోలో విజయ్ దేవరకొండ తన బాక్సింగ్ నైపుణ్యాలను కూడా ప్రదర్శించాడు. అర్జున్ రెడ్డికి వెల్ కమ్ చెబుతున్న సమరసింహారెడ్డి అంటూ బాలయ్య అలరించాడు. షోకి రావడమే.. బాక్సింగ్ చేస్తూ బాలయ్య, విజయ్ దేవరకొండ కాసేపు ప్రేక్షకులను నవ్వులతో పూయించాడు. నటుడిగానే కాకుండా ఇలా టక్ షోలో అతడు హోస్ట్ గా మారిన బాలకృష్ణతో అతని కార్యకలాపాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే.. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

Nandamuri Tejaswini : బాలయ్య అన్ స్టాపబుల్ విజయానికి కారణం ఆమెనా..? తండ్రికి ఏ మాత్రం తీసిపోని తనయ!

Nandamuri Tejaswini: నందమూరి నటసింహం ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవం కావడమే కాకుండా మరోవైపు ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఈ కార్యక్రమం కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని దూసుకుపోతుంది. ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న టాక్ షో లలో బాలకృష్ణ టాక్ షో IMDB టాప్ 10లో ఉండటం విశేషం.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి బాలకృష్ణ రెండవ కూతురు కూడా కారణమని చెప్పాలి. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ప్రముఖ విద్యావేత్త ఎంవివిఎస్ మూర్తి మనవడు భరత్ ని వివాహం చేసుకున్నారు. అయితే తేజస్వినికి బాలయ్య బాబు టాక్ షో విజయవంతం అవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

Nandamuri Tejaswini : బాలయ్య అన్ స్టాపబుల్ విజయానికి కారణం ఆమెనా..? తండ్రికి ఏ మాత్రం తీసిపోని తనయ!

బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి తన చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆమె క్రియేటివిటి వల్లే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హోస్టింగ్ చేస్తూ అద్భుతంగా.. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా తేజస్విని కెమెరా వెనక ఉంటూ కెమెరా ముందు తన తండ్రి విజయానికి కారణమైనదని తెలుస్తుంది.

Nandamuri Tejaswini : తండ్రికి ఏ మాత్రం తగ్గని తనయ..

ఈ విధంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోవడమే కాకుండా ఎంతో మంది సబ్ స్కైబర్లు దక్కించుకోవడంతో బాలకృష్ణ పారితోషికం కూడా పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని మొదట్లో ప్రకటించినప్పుడు బాలకృష్ణ ఏంటి? యాంకర్ గా చేయడం ఏంటి? అనే వాళ్లకు బాలయ్య దీటుగా సమాధానం చెప్పారు. ఇక అఖండ సినిమా కూడా విజయవంతం కావడంతో బాలకృష్ణ తర్వాత చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు.

అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో జక్కన్న సందడి..బాలయ్యతో అంత ఈజీ కాదంటూ..!

నందమూరి నటసింహం లెజెండ్ బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో చాలా మంచి అభిప్రాయం ఉంది. అతన్ని దగ్గర నుంచి గమనించిన వారు బాలకృష్ణ వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు. తన మనసులో ఏం అనిపిస్తే అదే చేస్తారు బాలకృష్ణ. డైరెక్టర్ల హీరో అంటూ బాలకృష్ణకు మంచి పేరుంది. తన సినిమాలో డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తారు బాలయ్య. తనకు కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా ఆపుకోలేరు బాలకృష్ణ. తన అభిమానులు క్షమశిక్షణ మరిచి హద్దు మీరి ప్రవర్తిస్తే చంప చెల్లుమనిపించడం మనకు తెలిసిందే.

అయితే ఫ్యాన్స్ మాత్రం మా బాలయ్య చేయి తగిలిందంటూ.. సంతోషపడతారు. ఇదిలా ఉంటే తాజాగా అఖండ హిట్ ఇచ్చిన కిక్ బాలకృష్ణ లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆహాలో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఆ షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముందుగా మోహన్ బాబుతో మొదలైన ఈ ’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘ మొదటి ఎపిసోడ్ తోనే చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చకుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది.

ఇదిలా ఉంటే.. ఐదో ఎపిసోడ్ కు దర్శక ధీరుడు రాజమౌళి గెస్ట్ గా వస్తున్నారు. దీనిపై ప్రోమో కూడా విడుదలైంది. ప్రోమో చూస్తుంటే.. ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ టాక్ షోలో ’ ”ఇప్పటిదాకా మన కాంబినేషన్లో సినిమా పడలేదు.. నా అభిమానులు అడిగారని నాకు తెలుసు.. మీరు నన్ను హ్యాండిల్ చేయలేరు అన్నారట కదా అని రాజమౌళిని బాలకృష్ణ ప్రశ్నిస్తారు. దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ..’ ”నిజానికి నాకు భయం సార్.. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను.. మీకు కోపం వస్తే ఆగరు.. ఎదుటి మనిషి ఎవరు.? ఏంటి అని చూడకుండా నోటికి ఎంతమాట వస్తే అంత మాట తిట్టేస్తాట్టే స్తారు..’ అని సమాధానమిచ్చారు. బాలకృష్ణ బదులిస్తూ ఎవరో డైరెక్టర్ కి జరిగిన సంఘటనను గుర్తుచేస్తూ.. ‘స్క్రి ప్ట్ తీసి నేలపై కొట్టి నేను ఈ సినిమా చేయను’ అని చెప్పేశాను అంటూ ఘాటుగా రియాక్టయ్యారు.

ఆ తర్వా త జక్కన్న మాట్లాడుతూ ”అలా అయితే మీరు చేసింది తప్పని” చెప్పుకొచ్చారు. దీనికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ”అలా అయితే నేను బాలయ్యను కాదు.. బాలయ్య కాక్టేల్” అన్నారు. దీంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.  ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా వచ్చారు. అయితే జక్కన్న చేసిన ఈ కామెంట్లను బట్టి చూస్తే రాజమౌళి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా ఉండదనే తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే బాలయ్య అభిమానుల ఆశ నిరాశయ్యే అవకాశమే ఉంది.

బాలయ్య టాక్ షోలో మహేష్.. అభిమానులకు పండగే?

టాలీవుడ్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే వెండితెరపై తనదైన శైలిలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ ప్రస్తుతం బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ వచ్చి సందడి సందడి చేశారు. అనంతరం ఈ ఫ్యామిలీ రెండవ ఎపిసోడ్ కు టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు కూడా ఈ షోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే మహేష్ బాబు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నారని అర్థమవుతోంది . సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డిసెంబర్ 4న మహేష్ బాబు బాలకృష్ణ ఒక వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తుంది.

ఈ వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అలా బాలకృష్ణ మహేష్ బాబు అరుదైన కాంబినేషన్ లో రెండు మూడు రోజుల్లో రానుందని తెలిసిన బాలకృష్ణ మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ షో ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య టాక్ షోలో రోజా.. ఉత్కంఠభరితంగా మారనున్న ఎపిసోడ్!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి వెండితెరపై ప్రేక్షకులను అలరించారు. మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కావడంతో ఈ షో కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ షో మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ లుగా మోహన్ బాబు ఫ్యామిలీ వచ్చారు.

రెండవ ఎపిసోడ్ కి జస్ట్ గా నాచురల్ స్టార్ నాని వచ్చారు. రానున్న రోజుల్లో కూడా ఈ షోకి అతిధులుగా క్రేజీ సెలబ్రిటీలు రాబోతున్నారు అంటూ వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తదుపరి ఎపిసోడ్ కి గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నట్టు సమాచారం. ఆ తరువాత ఎపిసోడ్ కూడా గెస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణతో కలసి వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన బాలయ్య లక్కీ హీరోయిన్ రోజా ఈ షోకి అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ ప్రస్తుతం ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతోంది. బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

ఇవే కాకుండా పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి సినిమాలలో కూడా నటించింది. అందువల్లే బాలకృష్ణ,రోజా ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ రోజాకు బాలకృష్ణ అంటే అభిమానం. ఇక పొలిటికల్ విషయానికి వచ్చినప్పుడు ఆమె బాలకృష్ణ పై కూడా విమర్శలు చేయటం అనేది చాలా సార్లు చూసి ఉన్నాయి.తెల్ల వీరిద్దరూ పాల్గొనడంతో బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేదాని గురించి ఎంతో ఉత్కంఠత ఏర్పడింది.

అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలయ్యను సర్ ప్రైజ్ చేసిన నాని..!

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇంతవరకూ వెండితెరపై ఎంతోమంది ప్రేక్షకులను ఆలరించిన బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై అన్ స్టాపబుల్ అనే షోకి హోస్ట్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన బాలకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తున్నాడు.

ఈ షో తొలి ఎపిసోడ్ ను మంచు మోహన్ ఫ్యామిలీతో చిత్రీకరించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రసారమైన ఈ షో భారీగా రెస్పాన్స్ ను అందుకుంది. మొదటి షో తోనే ఆన్లైన్ వేదికపై బాలయ్య మార్క్ ఏంటో కనిపించింది. అయితే తాజాగా అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నానితో కలసి చిందులు వేశారు బాలకృష్ణ.

ఇక ఈ ఎపిసోడ్లో బాలకృష్ణకు నాని ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సర్ప్రైస్ తో బాలయ్య పదేళ్లు వెనక్కి వెళ్లారు. అయితే నాని ఇచ్చిన ఆ సర్ప్రైజ్ ఏమిటంటే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ సహాయంతో ఆ అమ్మాయికి చికిత్స జరిగిందని నాని తెలిపాడు. అయితే కొన్నేళ్ల తర్వాత సహాయం పొందిన చిన్నారిని తెలుసుకున్నందుకు బాలకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిన్నారి ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

ఈ ఎపిసోడ్ ని చూసిన అభిమానులు ఎప్పుడో 2011 జరిగిన సంఘటన ఇవాళ నాని గుర్తు చేస్తే తప్పా బయటకు రాలేదు. బాలకృష్ణ చాలామందికి తెలియకుండా ఎన్నో ప్రాణాలను నిలబెట్టాడు. అతను చేసిన సహాయాన్ని ఎవరికీ తెలియనివ్వడు. అంతేకాకుండా తన సహాయం వల్ల ఒక జీవితం బాగుపడితే చాలు అని సంతోషిస్తాడనీ నెటిజన్స్ బాలయ్య ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.