Tammareddy Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా గుర్తింపు పొందిన తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా పై స్పందిస్తూ పెద్ద ఎత్తున హీరో నిఖిల్ పై ఫైర్ అయ్యారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ తన సినిమా విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని థియేటర్లు కూడా దొరక్కుండా చేస్తున్నారంటూ పరోక్షంగా దిల్ రాజు గురించి ఈయన ఆరోపణలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విషయంపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ నిఖిల్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ హీరో నిఖిల్ సినిమా విడుదలకు థియేటర్స్ దొరకడం లేదని ముసలి కన్నీళ్లు కార్చి సినిమా హిట్ అవ్వగానే దిల్ రాజుని సక్సెస్ మీట్ కి పిలవడం ఆయన మాట్లాడుతూ చేసిందంతా మీడియా అంటూ మీడియాపై మండిపడుతున్న సమయంలో నిఖిల్ మాత్రం వెనకనే ఉండి నవ్వుతున్నారే తప్ప ఆ రోజు నువ్వు నా సినిమాకి అడ్డుపడలేదా అని దిల్ రాజు గారిని ప్రశ్నించలేదు.
నిజంగానే నీ సినిమాకి దిల్ రాజుగారు అడ్డుపడి ఉంటే ఆరోజు ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ తీసుకొని మీరు నా సినిమాకు అడ్డుపడలేదా అని అడగాల్సింది. సినిమా హిట్ అయితే ఒక విధంగా ఫ్లాప్ అయితే మరొక విధంగా మాట్లాడటం మానుకోవాలి. అయినా దిల్ రాజు గారి ఇంటికి వెళ్లి అడుక్కోవాల్సిన అవసరం నీకేంటి? హీరో హీరో పనులు మాత్రమే చూసుకోవాలి డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమాలో నటించలేదు కదా…మాచర్ల నియోజకవర్గం సినిమాకి పోటీగా వచ్చిన నీవు థాంక్యూ సినిమాకి ఎందుకు పోటీగా రాలేకపోయావు అంత ధైర్యం నీకు లేదా? అంటూ తమ్మారెడ్డి నిఖిల్ పై ఫైర్ అయ్యారు.
Advertisement
Tammareddy Bharadwaj: డబ్బు కోసమే సినిమాలు చేస్తారు…
సినిమా ఫ్లాప్ అయితే ముసలి కన్నీళ్లుకార్చడం హిట్ అయితే కాలర్ ఎగరేయడం వంటివి మానుకోవాలి అయినా నువ్వు హీరోగా డబ్బు తీసుకోకుండా సినిమాలు చేయలేదు కదా డబ్బు కోసమే సినిమాలు చేశావు కానీ దేశాన్ని ఉద్ధరించడం కోసం సినిమాలు చేయలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన నిఖిల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వ్యాఖ్యలపై నిఖిల్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.