Tarakaratna: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులు పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యులతో పోరాడారు. అయితే ఈ పోరాటంలో తారకరత్న ఓడిపోక తప్పలేదు.ఇలా 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఈయన ఫిబ్రవరి 18వ తేదీ కన్నుమూశారు.ఈ విధంగా తారకరత్న మరణ వార్త నందమూరి కుటుంబంలోనూ అభిమానులను తీవ్ర విషాదం నింపింది.

ఇక ఈయన మరణించడంతో కుటుంబ సభ్యులు తారకరత్న చిన్న కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తారకరత్న తల్లిదండ్రులతో పాటు తన సోదరి హాజరయ్యారు. అలాగే నందమూరి బాలకృష్ణ కుటుంబం కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి కూడా ఈ చిన్న కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా నందమూరి నారా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక తారకరత్న చిన్న కర్మలో భాగంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక తారకరత్న తిరిగిరారనే నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తన భర్తను గుర్తు చేసుకుంటూ ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే తనను ఓదార్చడం కోసం కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా తనని ఆపడం ఎవరి తరం కాలేదు.

Tarakaratna: ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకున్న అలేఖ్య…
ఇక అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా తన పెద్ద కుమార్తె నిష్క సైతం తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరినీ బాలకృష్ణ తన అన్నయ్య మోహన్ కృష్ణతో కలిసి స్వయంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































