Tarakaratna: నందమూరి తారకరత్న గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఈయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనని మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

ఇలా గుండెపోటుకు గురైన సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతోనే ఈయన మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిందని తద్వారా ఈయన గత 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఈయన శరీరం వైద్యానికి సహకరించలేదని నిపుణులు వెల్లడించారు. ఇలా ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఈయనకు చికిత్స జరిగినప్పటికీ చివరికి ఈయనని ప్రాణాలతో కాపాడుకోలేకపోయారు.
ఈ క్రమంలోనే ఈయన ఫిబ్రవరి 18వ తేదీ శ్వాస విడిచారు. ఇలా నందమూరి తారకరత్న మృతి చెందారని వార్త ఇటు నందమూరి అభిమానులలో కుటుంబ సభ్యులలో జీర్ణించుకోలేని విషయంగా మారింది. తారకరత్న మరణించడంతో ఈయన పార్థివ దేహం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది.మొదటగా ఈయన పార్థివదేహాన్ని మోకిలలో ఉన్నటువంటి తన సొంత నివాసానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు.

Tarakaratna: మహాప్రస్థానంలో అంత్యక్రియలు…
ఇలా అభిమానుల సందర్శనాంతరం సోమవారం ఈయన అంతిమయాత్ర మొదలవుతుంది.సోమవారం సాయంత్రం హైదరాబాదులోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఇక తారకరత్న మరణించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతి పై స్పందిస్తూ తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.


































